Search This Blog

Monday 24 August 2015

ఆంధ్రా ఆలోచన


  • ఋణాల పై  90%గ్రాంట్ .... 
  • లోటు బడ్జెట్ ని పూడ్చడానికి ,  ప్రతి ఏ టా సాయం పొందడం .... 
  • పరిశ్రమలకు పన్ను రాయితీలు ... 
  • వీటన్నింటితో పాటు ప్రత్యేక హోదా !
1. ప్రపంచ బాంక్ తదితర విదేశీ బాంకులు , సంస్థలు మంజూరు చేసిన రుణాలకు రాష్ట్ర ,కేంద్ర ప్రభుత్వాలు హామీ ఇవ్వ వలసి ఉంటుంది . ఇలా మన రాష్ట్ర ము తెచ్చు కొనే రుణాల పై కేంద్ర ము  90% గ్రాంట్ అంటే ,ఉచితం గా ఇవ్వాలని ఆంద్ర ప్రభుత్వం కోరబోతుం ది . ఇలా విదేశీ రుణ ప్రాజెక్టుల్లో అధిక భాగం గ్రాంటుగా వచ్చేలా చూసుకోగలిగితే అది రాషా్ట్రనికి మేలు చేకూరుస్తుంది . 

2.  తక్షణ సాయంగా (అప్పుగా కాదు ) రూ.25 వేల కోట్లు కేంద్రం నుంచి తెచ్చుకోవాలని ,దానితో  రాష్ట్రంలో పెద్దఎత్తున మౌలిక వసతులు చేపట్టవచ్చని, తద్వారా పరిశ్రమలను ఆకర్షించడం వీలవుతుందని రాష్ట్ర ప్రభుత్వ ఆలోచన . ఇదే విధం గా  మరికొన్ని నిధులు ఏడాదికి కొంత చొప్పున మిగిలిన సంవత్సరాల్లో  రాబట్టు కో వచ్చని , వాటితో అభివృద్ధిపరంగా ముందడుగు వేయవచ్చని  ఓ ఆలోచన . 
ఒక నిర్దిష్ట కాలపరిమితితో కూడిన ప్యాకేజీని ప్రకటించాలని కేంద్రాన్ని కోరనుంది. 

3. పారిశ్రామిక రాయితీల ద్వారా  ఏపీలో కొత్తగా పరిశ్రమలు పెట్టే వారికి 15 శాతం అదనపు మూలధన రాయితీ, 15 శాతం అదనపు తరుగుదల రాయితీ  వస్తాయి . 

అంతే కాదు , ఇలా ప్రత్యేక ప్యాకేజీతోపాటు ప్రత్యేక హోదా కూడా సాధించాలనే పట్టుదలతో నవ్యాంధ్ర ఉన్నట్లు తెలుస్తోంది. 

Thursday 20 August 2015

ఊరంతా ఒక దారి -ఉలిపికట్టదొక దారి

2013-భూసేకరణ చట్టం ప్రకారం ,ఏదైనా ప్రజోప యోగ కరమైన ప్రాజెక్ట్ ల కోసం భూమిని తీసుకోవాలీ అనుకుంటే , ఆయా భూ యజమానులలో 80శాతం మందిని ఒప్పించి  మాత్రమె తీసుకోవాలి .
అమరావతి  ఆంధ్రుల రాజధాని గా చట్ట సభలో తీర్మానం చేయడ మైనది . 
దీని నిర్మాణానికి  ప్రభుత్వం ప్రతిపాదించిన ప్రతిఫలం  నచ్చి , భూమిని "సేకరణ"రూపం లో కాకుండా భూ సమీకరణ ప్రాతిపదికన  ఇప్పటికే 98శాతం మంది భూ యజమానులు తమ భూములను  స్వచ్చందం గా ప్రభుత్వానికి స్వాధీనం చేశారు . ఆ విధం గా వారు కూడా చారిత్రాత్మక బృహత్తర రాజ ధాని నిర్మాణం లో భాగ స్వామ్యులు అయ్యారు .
కానీ , కేవలం 2శాతం మంది మాత్రమే ప్రభుత్వ ప్రతిపాదనలను వ్యతిరే కించి రాజధాని నిర్మాణం అనుకొన్న రీతిలో జరగా కుండా అడ్డు పడుతూ , 5కోట్ల మంది ఆంధ్రుల ఆశలే కాకుండా , భూములిచ్చి రాజధానిలో భాగ స్వామ్యులైన 98శాతం మంది రైతుల ఆశలను కూడా  వమ్ము చేయడానికి రక రకాలుగా ప్రయత్నం చేస్తున్నారు .
కొంతమంది మేధావులు ,దయార్ద్ర హృదయులు ఆ 2శాతం వారికి ఎలాంటి కష్టం కలగ కుండా చూడ మంటున్నారు . అదెలా సాధ్యమో కూడా వారు వివరిస్తే రాజధాని నిర్మాణానికి వారి వంతు పాత్ర  పోషించి నట్లు అవుతుంది .
ప్రస్తుతం ఉన్న కేంద్ర ప్రభుత్వ ఆర్డి నెన్స్ ప్రకారం చూసినా ,  2013-భూసేకరణ చట్టం ప్రకారం పరి శీలిమ్చినా భూసేకరణ చట్ట ప్రయోగం న్యాయమే !

Tuesday 18 August 2015

పట్టిసీమ, రాయల సీమ ను భాగ్య సీమ గా మారుస్తుం దా ?

10 ఏళ్ల తర్వాత అధికారం చేపట్టిన చంద్ర బాబు మనస్సులో  సమస్య  ల సుడి గాలి . 

  • కోస్తా వారికి ,రాయల సీమకి సమ న్యాయం ఎలా ఏ విధం గా చేయాలి ?
  •  అలాగే సీమ భూముల్లో బంగారం పండించి సీమ బతుకుల్లో ఎలా నవ్వులు పూయించాలి ?
  •  వృధాగా పోతున్న గోదావరి జలాలను రాష్ట్ర సర్వతో ముఖాభి వృద్ధికి ఎలా వినియోగించాలి ?
  •  ప్రభుత్వ ధనం  ఖర్చు పెట్ట కుండా కొత్త రాజధాని ని ఎలా నిర్మించాలి ? 
  • వ్యవసాయం దండుగ గా మారి కునారిల్లుతున్న రైతు బతుకులో పండుగ ఎలా తీసుకు రావాలి ? 

వెంటనే నిపుణుల సమావేశం ఏర్పాటు ఐయింది .
రాష్ట్రం లోని మేధావులు ,ఇతర దేశాల నిపుణులు  అభి ప్రాయాలు , రాజకీయ కార్య కర్తల సలహాలు వీటన్నింటినీ క్రోడీకరించు కొని తీసుకొన్న నిర్ణయాలే అమరావతి నగరం ,పట్టిసీమ ప్రాజెక్ట్ , రైతు ఋణ మాఫీ ...

కారు చీకటిలో కాంతి రేఖ - ఇరిగేషన్ కార్య దర్శి సమయానికి గుర్తు చేసిన విషయం -
బచావత్  ట్రిబ్యునల్  సూచన తో మూ డు రాష్ట్రాలు- మహారాష్ట్ర ,మధ్య ప్రదేశ్ ,ఆంద్ర ప్రదేశ్  ల మధ్య  జరిగిన  ఒప్పందం ప్రకారం, గోదావరి నది లోని మిగులు జలాలలో 80 TMC ల నీటిని   కృష్ణా నదికి మళ్లిం చు కోవచ్చు .

ఇంతలోనే నిర్వేదం - దానికి కారణం పోలవరం కాలవలో నీరు పారదు .
పోలవరం ఆంధ్రాకి వరం . దురదృష్ట వశాత్తు కాంగ్రెస్ ప్రభుత్వం వారి ట్రేడ్ మార్క్ అవినీతికి ఆలవాలం గా ముందు 'డాం ' కట్ట కుండా కాలవలు తవ్వడానికి ఉత్సాహం చూపించారు . ఎందుకంటే మట్టిపనుల్లో  లాభాలు ఎక్కువ .
అలా పోలవరం కుడికాలువ 80% పూర్తయ్యింది . కాని డాం లేదు . కాలవలో నీరు పారదు .

కొంతమంది నిరుత్సాహం -
 18000 కోట్లు ఖర్చు పెడితే గానీ , 150 అడుగుల పోలవరం డాం పూర్తవ్వదు . అంత  డబ్బు కేంద్రం నుండి వచ్చి పోలవరం ప్రాజెక్ట్ పూర్తవ్వడానికి ఎంత కాలం పడుతుందో తెలియదు . ఈ లోపల  నా నాటికీ ఎడారిగా మారి పోతున్న  రాయలసీమ వాసుల కష్టాలు ఎప్పటికి గట్టేక్కెనో ?
మేధోమధనం సాగుతుంది  - 
3000 TMC ల గోదావరి నీరు వృధాగా సముద్రం లోకి పోతుంది .దానిని సద్వినియోగం చేసుకోవాలీ అంటే గోదావరి -కృష్ణ ల అనుసంధానం జరగాలి . ఇలా చేస్తే గోదావరి డెల్టా కి ఏమైనా ఇబ్బంది కలుగుతుందేమో ?
రాయలసేమ జిల్లాలకు సాగు ,తాగు నీ టి అవసరా లు తీరాలంటే ఏం చేయాలి ?శ్రీశైలం నుండి కిందకు అంటే నాగార్జున సాగర్  కి కృష్ణా డెల్టా అవసరాలకు వదిలే నీటిలో సింహ భాగాన్ని ఒక రెగ్యు లేటర్ ద్వారా  రాయలసేమ జిల్లాలకు పంపాలి. అలాచేస్తే  కృష్ణా డెల్టా  ఇబ్బంది పడుతుంది . మరి  కృష్ణా డెల్టా రైతుల  అవసరా లు తీరే మార్గం ఏమన్నా ఉందా ?
పరిష్కారం  - 
నిజానికి 2006 లో ఇరిగేషన్ నిపుణులు సూచించిన ప్రకారం 80 TMC ల గోదావరి నీటిని ఒక క్రమ పద్దతిలో నెలకు ఇన్ని TMC ల చొప్పున వదులుతూ కాలవ ల ద్వారా కృష్ణా నదికి పంపితే ఆ నీటితో కృష్ణా డెల్టా అవసరా లు తీరతాయి . అంటే గోదావరి -కృష్ణా నదుల అనుసంధానం .
సరే బాగానే ఉంది . గోదావరి జిల్లాలకు లోటు రాకుండా గోదావరి నీటిని ఎలా ,ఎక్కడ నుండి  
మళ్లిం చాలి ?
 అందుకు అనువైన చోటు, కట్ట బోయే  పోలవరం డాం  కి దిగువన ఉన్న పట్టిసీమ . అక్కడ గోదావరి నీటి మట్టం  15 మీటర్ల కన్నా ఎక్కువ ఉండి, వరద లాగా వృధా అవుతున్న ప్పుడు మాత్రమే నీటిని,  ఇప్పటికే 80% పూర్తయిన పోలవరం కాలవ లోకి పంపు చేసి ప్రకాశం బారేజి రిజర్వాయర్  కి మళ్లిం చాలి .
అలా పంప్ చేయాలంటే ఎంత ఖర్చు అవుతుంది ? 
1400 కోట్లు .
అంటే 1400 కోట్లతో పోలవరం డాం కడితే ఎంత ఫలితం వస్తుందో అంత ఫలితం 
ఇప్పుడే ,ఇంత తక్కువ ఖర్చు తో  వస్తుందా ?
 గోదావరి డెల్టా  ఆయకట్టు స్థిరీకరణ , కొత్తగా 7లక్షల ఎకరాలకు సాగు నీరు , విశాఖ కి త్రాగు నీరు , కృష్ణా నదికి 80 TMC  ల నీటి మళ్లిం పు ,1000 విద్యుత్ ఉత్పత్తి -ఇవీ పోలవరం ప్రాజెక్ట్  వలన ఒన గూడే లాభాలు .
ఇందులో అత్యంత ముఖ్యమైనది కృష్ణా నదికి 80 TMC  ల నీటి మళ్లిం పు ద్వారా నదుల అనుసంధానం,
 తద్వారా కృష్ణ డెల్టా  ఆయకట్టు స్థిరీకరణ మరియు రాయలసేమ జిల్లాలకు సాగు ,తాగు నీటి లభ్యత . దీనికి గోదావరి వరద నీటిని మాత్రమె వాడుకొనే పట్టిసీమ ఎత్తిపోతల పధకం సరిపోతుంది .
మరి ,గోదావరి జిల్లాల రైతులు ఎందుకు భయ పడుతున్నారు ? 
వారు ఏ మాత్రం భయ పడ నక్కర లేదు . ఖరీఫ్   లో  గోదావరి డెల్టా కి 150 TMC ల నీరు అవసరం ఉంది .
ఖరీఫ్ 5 నెలల్లో ధవ ళే శ్వరమ్  ఆనకట్ట దగ్గర నీటి లభ్యత సుమారు 700 TMC లు  అని వెంకట రావ్ కమిటీ చెప్పింది .
గ త 50 ఏళ్ల రికార్డ్గ లు పరిశీలిస్తే   40 ఏళ్ళు  గోదావరికి వరదలు వచ్చినట్లుగా తేలింది .
ఖరీఫ్ 150 రోజుల్లో  సుమారు  125 రోజులు, రోజుకి 50000 క్యూసెక్ ల చొప్పున సరాసరి ఏటా 3000 TMC ల వరద నీరు వృధాగా సముద్రం లోకి పోతున్నట్లు లెక్కలు చూపిస్తున్నాయి .  అంటే ,ఖరీఫ్ కాలం లో గోదావరి జిల్లాల    డెల్టా కి అవసరమైన దాని కంటే 20రెట్లు లభ్య మవుతుండగా ,రబీ కాలం లో మాత్రం అవసర మైన దాని కంటే 30 TMC ల నీరు తక్కువ లభ్య మవు తుంది . రబీ కాలం లో నీటిని వినియోగించు కోవడానికి వీలుగా గోదావరి నీటిని నిల్వ చేసుకోవడానికి  పోలవరం జలాశయం పనికి వస్తుంది .    ధవ ళే శ్వరమ్    ఆనకట్ట నుండి నీరు వరద రూపం లో బయటకు వచ్చిన ప్పుడు మాత్రమే పట్టిసీమ  ఎత్తిపోతల   టర్బైన్ లు పనిచేయడం మొదలెడ తాయి . కాబట్టి , గోదావరి జిల్లాల రైతులు  ఏ మాత్రం భయ పడ నక్కర లేదు .
సరే   ఇంతవరకు బాగానే ఉంది .  పోలవరం ప్రాజెక్ట్ 10 ఏళ్లలో పూర్తయ్యి నప్పుడు ,పట్టి సీమ ప్రాజెక్ట్ పై పెట్టిన 1400 కోట్లు వ్రుధా యే గదా ? 
సమ న్యాయం అనేది రాజ్యాంగ హక్కు . అదీ  గాక , ఇప్పటికే రాయలసీమ లో సాగు చతికిల పడి పోయింది . ఇంకా 10 ఏళ్ళు ఆలస్యం చేస్తే ప్రాంతీయ అసమానతలు పెరిగిపోయి మళ్ళీ రాష్ట్రం ముక్క చెక్క లవుతుమ్ది .

 దుర్మార్గపు రాజకీయం చేస్తున్న కొందరు చెబుతున్నట్లు ,పట్టిసీమ పధకం ముడుపుల కోసం కానే కాదు .
కృష్ణ -గుంటూరు ఆయకట్టు లో సకాలం లో నాట్లు వేసి నేల నాలుగు చెరగులా పచ్చని వరి ,అపరాల పంటలతో  ఏటా కోట్లాది రూపాయల విలువైన పాడి పంటలు , రాయలసీమ మెట్ట కి కనీసం నాలుగు తడులిచ్చి ఏపుగా పెరిగే శనగ ,జొన్న పంటలు, సీమ వాసుల దప్పిక తీర్చే కలుషితం కాని జలాలు- వీట న్నిం టికి విలువ కడితే పట్టిసీమ కి ఖర్చు పెట్టే 1400 కోట్లు ఏపాటి ?
జల యజ్ఞం పేరిట లక్షలాది కోట్ల ప్రజా ధనాన్ని నీరు చుక్క పారని కాలవ లు ,మట్టి పనులు ,మొబిలైజేషన్ ముడుపులు పేరిట యదేచ్చగా దొంగల దోపిడీ చేసినప్పుడు ఎవ్వరూ అరచి గోల చేయ లేదేం ?


 ముఖ్యమైన విషయాలు  మరో రెండు ఉన్నాయి :
1. పట్టిసీమ ప్రాజెక్ట్ వలన లభ్య మయ్యే  నీటితో, నాగార్జున సాగర్ నీటి పై ఆధార పడ నక్కర లేకుండా    కృష్ణా డెల్టా కి సరైన సమయం లో నాట్లు పడే అవకాశం ఉంది . శ్రీశైలం నీటిని పోతి రెడ్డి పాడు రెగ్యు లేటర్ ద్వారా నియమిత విధానం లో వదులు కొంటూ ,హంద్రినీవా కాలువల ద్వారా  రాయలసీమ నాలుగు జిల్లాలకు సాగునీరు ,త్రాగు నీరు అందించ వచ్చు .  అంటే ,పోలవరం పూర్తయ్యే వరకు వేచి చూడ కుండా , కృష్ణా ఆయకట్టు స్థిరీకరణ , సీమ పొలాలకు నీరు అందించే పట్టిసీమ ప్రాజెక్ట్ అత్యంత అవసరం .
 ఫ్లోరైడ్ కాలుష్యం నుండి సీమ బతుకు లకు విముక్తి కలుగుతుంది .
సీమ వాసుల ఆరోగ్య సంపద , రాయలసీమ రైతాంగం పండించే పంటల విలువ ముందు 1400 కోట్లు ఏపాటి ?
2.  పోలవరం ప్రాజెక్ట్ పూర్తయిన తర్వాత , పట్టిసీమ ప్రాజెక్ట్  లో వాడే మోటార్ లు , పంపులు మళ్ళీ ఎక్కడైనా వినియోగించు కోవచ్చు .

ఇలా భిన్న కోణాలలో తరచి తరచి చూసినా  పట్టిసీమ ప్రాజెక్ట్  ఇటు కృష్ణా డెల్టా కి ,అటు రాయలసీమ కి పెద్ద వరం . అలాగే ఇది  చంద్ర బాబు దార్సనికతకు నిజమైన సరిఐన రూపం . 

Thursday 13 August 2015

డబ్బు డబ్బు ..........

మన రాజ్యాంగం లోని 7 వ షెడ్యుల్ -ఆర్టికల్ 246 ద్వారా సంక్రమించిన అధికారం ద్వారా కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు నిరాఘాటం గా పన్నులు వసూల్ చేసు కోవచ్చు . 
కేంద్రం పార్లమెంటు ద్వారా చట్టాలు చేసి -  ప్రజల  సంపాదన , వారి ఆస్తులు , ప్రజల కొనుగోళ్ళు , అలాగే పరిశ్రమల ద్వారా వస్తూత్పత్తి  ,ఎగుమతి -దిగు మతులు , వ్యాపార సంస్థల టర్నోవర్  ,వ్రుత్తు లు ,సేవలు ,  ప్రజలు ఇచ్చి పుచ్చు కొనే బహుమతులు ,వారసత్వపు ఆస్థులు - వీటన్నింటి పైనా పన్నులు -కొన్ని డైరెక్ట్ గా (ఆదాయపు పన్ను , వ్యాపార సంస్థల పై పన్ను , సంపద పన్ను ,వారసత్వపు ఆస్థి పై పన్ను ,బహుమతుల పై పన్ను ); మరికొన్ని పరోక్షం గా  వేసి వసూల్ చేస్తాయి . 
ఇవికాక సర్ చార్జి ,సెస్స్ ఉండనే ఉన్నాయి . 
రాష్ట్రాలు  విధాన సభల ద్వారా చట్టాలు చేసి - ఆస్థుల లావాదేవీలు , సేల్స్ టాక్స్ ల ద్వారా  పన్ను వసూల్ చేస్తాయి . 

వీటన్నింటి ద్వారా (సేల్స్ టాక్స్  & VAT  తప్ప ) కేంద్రానికి ఏటా సుమారు 10 లక్షల కోట్లు పోగవుతుంది . 
కేంద్రం , ఇందులో 42% రాష్ట్రాలకు తిరిగి పంచి పెడుతుంది .  

దేశం లో వస్తువుల ఉత్పత్తి ,వనరుల నుండి ఖనిజాల ఉత్పత్తి ,భూమి నుండి ఆహార ఉత్పత్తి ,అలాగే ప్రజలు కష్ట పది చేసే పని విలువ -ఇవన్నీ కలిస్తే ,దీనినే దేశ ఆర్ధిక ఉత్పత్తి అంటారు . దీని విలువ ఆధారం గానే మన రిజర్వ్ బాంక్ కరెన్సీ నోట్లను ముద్రణ చేస్తుంది . 
దేశ ఆర్ధిక ఉత్పత్తి విలువ కన్నా అధికం గా ముద్రణ చేస్తే ఆ కరెన్సీ విలువ పడిపోతుంది . అనగా మన కరెన్సీ విలువ ను పడిపోకుండా కాపాడు కోవా లంటే మనం ఉత్పత్తి చేస్తున్న సరకుల కు నిరంతర మార్కెట్ , డిమాండ్ ఉండాలి . 
దేశం లో ప్రజల కొను గోలు శక్తి పెరగాలి . లేదా మన సరకులకు ,సేవలకు విదేశాల లో డిమాండ్ పెరిగి  అమ్ముకొనే అవకాశం ఉండాలి .కానీ మనకు ఆ భాగ్యం ఉందా ? విదేశీ మార్కెట్ లో డిమాండ్ ఉండాలంటే వస్తువుల నాణ్యత బాగుండాలి. కానీ మన వస్తూత్పత్తి ,నాణ్యత నాసిరకం గానే ఉన్నాయి . 
( ఇక్కడ ఒక్కటి గుర్తు పెట్టుకోవాలి . కరెన్సీ విలువ పడిపోవడం ,సరుకుల ఎగుమతులు -దిగుమతులు '  అనేది గ్లోబల్ వ్యవస్థ వచ్చిన తర్వాత పుట్టిన పదాలు) . 
 ఉత్పత్తి చేస్తున్న సరకులన్నీ మన జనాభా నే మింగేస్తే అదీ సంక్షేమ పధకాల రూపేణ ఉచితం గా వాడేసు కొంటూ ఉంటే ,మన అధికారులు ,రాజకీయ నాయకులు అవినీతి తో హాంఫట్  అంటూ సామాన్యులకు అంద వలసిఉన్న వనరులను మింగేస్తూ ఉంటే, ఎగుమతుల మాట అటుంచి దిగుమతులు చేసుకొన్నా సరిపోవడం లేదాయె ! 

డబ్బుని , లెక్కకు అందకుండా దాచి పెట్టుకొని భూముల కొనుగోళ్ళు  ,హవాలా ద్వారా విదేశాలకు తరలింపు ,
 కేవలం లక్ష మంది వ్యాపార వాణిజ్య చట్టాలలోని లొసుగుల ద్వారా  వెనకేసు కొంటున్న సంపద ,
రోజు రోజుకీ పడిపోతున్న మన డబ్బు విలువ , 
130 కోట్లలో కేవలం 2కోట్ల మందికి మాత్రమే 5అంకెల సంపాదన ,
దేశం లో ఉన్న సంపదలో 70% కేవలం లక్ష మంది దగ్గరే పోగు పడి పోవడం - ఇవన్నీ మనిషిలో రంకె లేస్తున్న స్వార్ధం ,మోసం ,కోరికలకు అలాగే కొంత మంది భాగ్య వంతుల తెలివికి ,తెంపరి తనానికి పరాకాష్ఠ . 

 నల్ల ధనం అంటే ప్రభుత్వానికి  లెక్క చెప్పని కరెన్సీ ఒక్కటే కాదు, ప్రభుత్వానికి  తెలియ చేయని లేదా లెక్క చెప్పని ఆస్తులు -భూములు ,ఇళ్ళు ,ఫాక్టరీలు , సంస్థలు , బంగారం ,జాతి రత్నాలు ---  ఇవన్నీ  దొంగ  సంపదే !
మన రిజర్వ్ బాంక్ ముద్రణ చేస్తున్న కరెన్సీ లో , ఏటా సుమారు 60 ట్రిలియన్ లు దొంగ డబ్బు గా మారుతుంది . ఇందులో 10% అనగా 6 ట్రిలియన్ లు  మాత్రమె ప్రతి ఏటా విదేశాలకు జారు కొంటుంది . 

భారత్ అత్యంత 10 పేద దేశాలలో ఒక్కటి . 
భారత్ అత్యంత 10 అవినీతి దేశాలలో  ఒకటి . 
కారణం, సోమరితనం ,స్వార్ధం ,అలసత్వం ,అవినీతి తో పుచ్చి పోయిన ప్రజలా ?
కుల బలం , ధన బలం ,మంది బలం తో పులిసి పోయి , తెలివి ,కరడు కట్టిన స్వార్ధం తో జిత్తులమారి మోసాలు , రంగులు మార్చే రాజకీయాలు చేస్తున్న కొంత మంది నాయకులా ?
ఎవరు ?

Wednesday 12 August 2015

Special status to state? what it means??

 



  

ప్రత్యేక హోదా ? !

రాష్ట్రానికి ప్రత్యేక హోదా అనేది ఇప్పుడు ,అటు తెలుగు దేశం ,ఇటు బిజెపి కి సంకటం గా మారింది .
దీ నిని కాష్ చేసు కోవడానికి మిగతా పార్టీలు కండువాలు దులుపుకొంటూ ముందుకు దూకుతున్నారు .
 మీడియా ఎలా కలర్ ఇస్తే ప్రజలు అలాగే నమ్మేసి ఆవేశ పడిపోతారు .
కానీ మేధావులు ,పారిశ్రామిక వేత్తలు ,పార్టీలకతీతం గా ఆలోచించే దార్సినికులు చేయ వలసింది ఒక్కటుంది .
ప్రత్యేక హోదా వలన రాష్ట్రానికి ఎంత లాభం వస్తుంది ? ప్రత్యేక హోదా ఇవ్వడానికి కేంద్రానికి వీలు పడనప్పుడు,అంతే లభ్యత కలిగించే  ఏదైనా  ఇతర మార్గాలున్నాయా ?
ఉదాహరణకు , ప్రత్యేక హోదా వలన రాష్ట్రానికి ఏటా 1500 కోట్లు రావచ్చు .
అలాగే ప్రత్యేక హోదా వలన  ఏటా పరిశ్రమ పై తరుగు 15% వస్తుంది .
వీటికి ప్రత్యామ్నాయం గా విదేశీ సాయం పై కట్టే ప్రాజెక్ట్ లపై 70%గ్రాంట్ రూపం లో , 30% అప్పు రూపం లో  ఉండేటట్లు కేంద్రాన్ని ఒప్పించ గలిగితే , 25000 కోట్ల లాభం వచ్చే అవకాశం ఉంది .
అలాగే వె నకబడిన  ప్రాంతాల లో ని పరిశ్రమలకు మాట్ పన్ను(MAT tax) పై రాయితీ ని డిమాండ్ చేస్తే 15% తరుగు ద్వారా వచ్చే లాభం కంటే ఎక్కువ లాభం వస్తుంది .
 లేదా ప్రత్యేక హోదా పై  మళ్ళీ ఒక కమిటీ ని వేయమని డిమాండ్ చేయ వచ్చు . 
అలాగే సుప్రీం కోర్టు లో మన రాష్ట్ర హక్కుల గురించి ,జరుగుతున్నా అన్యాయం గురించి కేస్ ఫైల్ చేయ వచ్చు . 


Friday 7 August 2015

పప్పు భారత్

మనది వ్యవసాయ దేశం . ఐనా పప్పు ధాన్యాలను సరిపడా ఉత్పత్తి చేయ లేక పోతున్నాము . అందుకే పప్పుధాన్యా లు  దిగుమతి చేసుకుంటూ  వేల కోట్ల రూపాయల విదేశీ మారకద్రవ్యం 
నష్టపోతు న్నాం .  
మనం ఏం చేయాలి ?
1. మొదటి పంట వరి, మొక్కజొన్న, వేరుశనగ వేసిన తర్వాత సాగునీటి అవకాశం ఉన్న చోట రెండో పంటగా పప్పుధాన్యాలను వేయించాలి. 
2. తొలకరిలో పప్పుధాన్యాలు వేసి పంట వచ్చిన తర్వాత ఖరీఫ్‌ పంటలు వేసే విధంగా ప్రణాళిక రూపొందించాలి. 
ఈ విధంగా ఖరీఫ్‌ పంట వేయడానికి ముందు, వేసిన తరువాత కూడా పప్పుధాన్యాలు పండించవచ్చు. 
ఈ పంటల  వల్ల విదేశీ మారకద్రవ్యం ఆదా అవ్వడమే కాక ,యూరియా  దిగు మతులను కూడా తగ్గించు కోవచ్చు . ఎందుకంటే ,  పప్పుధాన్యాల సాగు వల్ల ,భూమికి నత్రజని చేకూరుతుంది. పప్పుధాన్యాల తరువాత వేసే పంటకు నత్రజని తక్కువగా వినియోగించవచ్చు.