Search This Blog

Tuesday, 28 June 2016

ఆంధ్రా ఆఫీసులు ... ఇప్పుడు మీకు మరింత చేరువలో ...

హైదరాబాద్ నుండి సుమారు 40 ప్రభుత్వ శాఖలు రాజధాని ప్రాంతం లో ఆఫీసులు ప్రారం భించాయి . 
ప్రజల కు మరింత చేరువ అవుతున్న పాలన వలన అధికారులలో జవాబుదారీ తనం పెరగడమే కాక , ప్రజలకు కూడా సౌకర్యం వంత మైన పాలన అందుతుంది . 
ఏయే ఆఫీసులు  ఏ ప్రాంతం లో ఉన్నాయో అందరికీ తెలియాలన్న ఉద్దేశ్యం తో ....... 



clip

Sunday, 26 June 2016

water ... water...every where!

నీరు మనందరికీ జీవాధారం . వర్షాలు కురవడం ,కురిసిన నీటిని వడిసి పట్టి భూమాత పొత్తిళ్ళలో కి ఇంకే టట్లు చేయడం ,మనిషి కనీస బాధ్యత .
కిందటి  నెలలో ఒక యజ్ఞం మాదిరి  లక్షలాది ఇంకుడు గుంతలు తీయడం వలన సాధారణ వర్షాలు కురిసినా ,భూగర్భ జల మట్టం సుమారు గజం లెక్క పెరిగిందీ అంటే, ఇది ఈనాడు మరియు ప్రజల భాగస్వామ్యం యొక్క అంకిత భావం తప్ప మరోటి కాదు .

Saturday, 25 June 2016

రైతు ,చేనేత, ద్వాక్రా మహిళ ల కు ఋణ మాఫీ . - రెండవ కిస్తీ .

అందరూ  మరచి పోయి ఉంటారు . రైతన్న ల కష్టానికి ఏదో ఉడత సాయం లెక్క  మన రాష్ట్ర ప్రభుత్వం చేసిన పథకాలలో అత్యంత ముఖ్యమైనది రైతు ,చేనేత, ద్వాక్రా మహిళ ల కు  ఋణ మాఫీ .
నేడు (25-6-2016), రెండవ కిస్తీ ని ప్రకటించి తగు పత్రాలను రైతులకిచ్చ్చి భుజం తట్టిన సందర్భం లో , ఒక్క సారి ఇది గమనించండి ...
AP Rythu Runa Mafi List Crop Loan and Gold Loan 1st and 2nd List Status

Friday, 24 June 2016

అమరావతి నగరం ఎలా ఉండ బోతుంది ?

గత దశాబ్దం లో మన దేశం లో ఏర్పడిన కొత్త రాష్ట్రాలు నిర్మించు కొన్న నూతన రాజధాని నగరాలు పెద్దగా ఎవ్వరినీ ఆకర్షించ లేక పోయాయి . కానీ ,ఆంధ్రుల రాజధాని  అమరావతి ' అని చంద్రబాబు ప్రకటించిన నాటి నుండి ఒక చారిత్రాత్మక ,సాంస్కృతిక హార్దిక భావన తెలుగు వారి లోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా  ... ముఖ్యం గా బౌద్ధ మత ప్రాచుర్యమున్న జపాన్ ,చైనా ,మొదలగు ఆగ్నేయాసియా దేశాల హృదయాలలో మెదిలింది . 

ఇది కేవలం పరిపాలనా భవనాల కూడలి కాదు . ఆర్ధిక ,ఉద్యోగ ,విద్యా ,వైద్య ,సేవా ,పారిశ్రామిక వాడ లతో  , లక్షల మందికి ఉద్యోగ ఉపాధిని కల్పించి , రాష్ట్ర ప్రగతికి చోదక శక్తి లా పనిచేసే అద్భుత నగరం గా తీర్చి దిద్దాలని ముఖ్యమంత్రి చంద్ర బాబు తపన . 

33000 ఎకరాల రైతుల నుండి ,మరో 20 000 ఎకరాల ప్రభుత్వ భూమిని సేకరించిన విధానం ,మనదేశం లో మును పెన్నడూ జరగని రీతిలో , రైతులను కూడా అభివృద్ధి పధకం లో ,నగర నిర్మాణం లో భా గ  స్వాములను  చేసిన తీరు  నభూతో ... న భవిష్యత్ . అందరూ బాగా స్వా ములు కావాలి . అందరూ అభివృద్ధి ఫలాలు పంచు కోవాలి ... ఇదే చంద్రబాబు నినాదం ! 

మనం ఓ చిన్న ఇల్లు  కట్టుకోవాలీ అంటే , ఎన్నో స్థలాలు పరిశీలించి ,వాస్తు ,ఇరుగు పొరుగు , పరిశుభ్రమైన వాతావరణం ,నీటి సదుపాయం ,దగ్గరలో విద్యా వైద్య సౌకర్యాలు , రవాణా సౌకర్యం ఇవన్నీ కూలం కుశం గా చూస్తాం కదా ? అదే విధం గా మన ప్రభుత్వం కూడా అనేక ప్రాంతాలను ,జిల్లాలను పరిశీలించి , అన్ని విధాలా ఈ అమరావతి ప్రాంతం ఒక రాజధానిగా మలచు కో వచ్చుఁ అనే ఒక శాస్త్రీయ మైన పరిశోధనా కార్యక్రమం పూర్తయిన తర్వాతే , అమరావతి ప్రాంతాన్ని రాజధానిగా ప్రకటించారు . 

ఒక చిన్న ఇంటిని కట్టు కోవడానికి ఎన్నో అనుమతులు , మౌలిక సౌకర్యాల కల్పన , డబ్బు ,  ప్రణాళిక , 
పనిచేసే  వాళ్ళు ,వీళ్ళంద రినీ పోగేసి నడుం వంచి పని మొదలు పెట్టడానికే ఎంతో సమయం పడుతుంది . 
కానీ ఏ ప్రభుత్వమూ చేయనంత వేగం గా ఇవన్నీ సాధించి అమలు చేయడం ఒక ఎత్తు అయితే , అమాయకపు కొండొకచో మూర్ఖపు  రైతులను , ఎలాంటి ఇంగిత జ్ఞానం లేని ప్రతిపక్షం వారిని ,గుంటకింద నక్క లా కాచు కొనే మీడియా వారిని , అనుమానం గా చూస్తూ అడ్డంకులు కల్పించ డా నికి సదా సిద్ధం గా ఉండే అధికార వర్గాలను , సోమరితనం తో వ్యవస్థ నంతా కుళ్లు ,కుతంత్రాలతో నింపేసిన ఉద్యోగులను , సాయం చేస్తామని మాట ఇఛ్చి వెన్ను పోటు పొడిచిన కేంద్రాన్ని తట్టుకొని చెప్పిన సమయానికి ప్రణాళిక  రచన పూర్తి చేయడమే కాదు , జరపవలసిన పనులన్నింటినీ సకాలం లో చేస్తూ ,ముఖ్యం గా రైతులకు ,చెప్పిన టైం కి  పట్టాలు ఇవ్వడం అనేది ఓ 
గొప్ప విషయం . చంద్ర బాబు ప్రభుత్వ పనితీరు ,ప్రవేటు సాఫ్ట్ వేర్ సంస్థల పనితీరుని మించి పోయింది . 



అమరావతి నగర పరిధిలోని 217 చదరపు కిలోమీటర్లలోని 53000ఎకరాలలో నివాస ప్రాంతం మొత్తం 17వేల ఎకరాలు. ప్రస్తుతం ప్రభుత్వం అనుమతించిన నిర్మాణ ప్రదేశం (ఎఫ్‌ఎస్ఐ) 2 నుంచి 2.8 వరకు ఉంది. అంటే సరాసరి 2.5 ఎఫ్‌ఎస్‌ఐ అనుకుంటే ఎకరాకు 1,09,125 చదరపు అడుగులు కట్టవచ్చు.
దీనిని సరాసరి వంద నివాస గృహాలుగా లెక్కించవచ్చు. అంటే,ఎకరానికి 100 ఇళ్ళు (అపార్టుమెంట్ లు ) వస్తాయి . 

ఈ లెక్కన 17 వేల ఎకరాల్లో 17 లక్షల గృహాలు నిర్మించడానికి అవకాశం వుంది. ఇంటికి సగటున 3.5 వ్యక్తులు అనుకుంటే 60లక్షల జనాభా అవుతుంది. 217చదరపు కిలోమీటర్లకు సరాసరిన చదరపు కిలో మీటర్ కి   26,650 జన సాంద్రత అవుతుంది.
ఇది చాలా ఎక్కువ .దీనివలన డ్రైనేజీ సమస్య ,మంచి నీటి కొరత , త దితర సమస్యలు ఎక్కువై తాయి . 
మొక్కల పెంపకం  ,హరిత వనాల విస్తరణ ఆగిపోయి ,నగరం విష పూరితమై పోతుంది . 
దీనిని ప్రభుత్వం నియంత్రిమ్చాలీ అంటే  FSI ని 1:1 గా తగ్గించాలి .  అక్రమ కట్టడా లను నియంత్రిమ్చే కఠిన మైన చట్టాన్ని తేవాలి . 
లేకుంటే , అమరావతి కూడా మామూలు కాలుష్య నగరాల వలె మారి పోతుంది . 
ఆదర్శ నగరం అంటే  చదరపు కిలో మీటర్ కి  10000 లోపు జనాభా ఉండాలి . 

Wednesday, 22 June 2016

crop loan waiver -2nd phase

రాష్ట్రంలో మొత్తం 55 లక్షల రుణ ఖాతాలకు మాఫీ వర్తింపచేయాలని గతంలోనే నిర్ణయించింది. ఇందులో భాగంగా రూ.50వేల లోపు రుణాలను ఒకేసారి మాఫీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించడంతో... ఇరవై మూడున్నర లక్షల ఖాతాలకు ఒకేసారి పూర్తిగా రుణ ఉపశమనం కలిగింది. మిగిలిన ముప్పై ఒకటిన్నర లక్షల ఖాతాలకు ఇప్పుడు ఈ సర్టిఫికెట్లు అందచేస్తున్నారు. 

ఆ రైతుకు సంబంధించి ఇంకా ఎంత రుణం మాఫీ కావాల్సి ఉంది, ఇప్పుడు ఎంత అవుతోందన్నది దీనిపై ముద్రించారు. ఆ రైతు రుణం ఉన్న బ్యాంకు ఖాతాల వివరాలు, ఆ రైతు ఆధార్‌ నెంబర్‌ కూడా దానిపై ముద్రించారు. 

ఈ సర్టిఫికెట్లను రైతులు ఆయా బ్యాంకులకు తీసుకెళ్లి అందచేస్తే అక్కడి అధికారులు ఆ వివరాలు నమోదు చేసుకొని రాష్ట్ర ప్రభుత్వ రైతు సాధికార సంస్థకు పంపిస్తారు. వివరాలు వచ్చిన రెండు మూడు రోజుల్లో సంబంధిత బ్యాంక్‌ శాఖకు ప్రభుత్వం ఆ డబ్బు పంపిస్తుంది. ఆ విషయాన్ని రైతులకు ఒక ఎస్‌ఎంఎస్‌ ద్వారా తెలియచేస్తారు

Sunday, 8 May 2016

సంజాయిషీ ఇచ్చుకోవలసిందే!

" పన్ను మినహాయింపు లేవీ ఇవ్వము , ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వము,   ప్రత్యేక హోదా ఇవ్వం ....    మీ చాత నైన్ది  చేసు కోండి  అని కుక్కనికొట్టినట్టు చెప్పాక కూడా  మనం ఏమీ చే యలేక  పోతున్నాం !
కేవలం ఆంధ్రాకి వెల్లువెత్తు తున్న పరిశ్రమల కు అడ్డు కట్ట వేయడానికి మోడీ ప్రభుత్వం ఎత్తిన
దుర్మార్గపు ఎత్తుగడ  ఇది"........ అని ప్రజలు తిరుగుబాటు చేయక ముందే మోడీ మేల్కోవాలి .

అటు రాజధాని లేదు . ఇటు ఆదాయం లేదు .ఏపీ ఇప్పుడు దీనస్థితిలో ఉంది. ఇలాంటి స్థితిలో ఉన్న ఏ రాష్ట్రాన్నైనా నిబంధనల పేరిట ఆదుకోకపోవడం దుర్మార్గమే అవుతుంది. అంతేకాదు... సమాఖ్య వ్యవస్థపైనే ప్రజలకు నమ్మకం పోతుంది.
మమ్మల్ని ఏమి చేద్దామని విడగొట్టారు?’ అని ఏపీ ప్రజలు సంధించే ప్రశ్నకు అటు కాంగ్రెస్‌, ఇటు బీజేపీ రెండూ సంజాయిషీ ఇచ్చుకోవలసిందే!