Search This Blog

Monday, 14 October 2013

పంచ కోశ శరీరం

పంచ కోశ శరీరం :
The human body consists of two primary systems. The first is the “biological body,” - second system is known as the “Human Energy System,” and consists of a finer grade of matter called “anti matter.” You cannot perceive physically this body, because it has a higher frequency and wavelength (beyond the 3rd dimension). 
Our spirit bodies can be compared to radio waves:
§         they’re normally imperceptible,
§         they each have a unique frequency or vibration that keeps them distinct from each other,
§         the different frequencies let them coexist independently in the same space, and
§         we can learn to tune in to the various bodies separately with certain techniques and technologies.
In other words, we are made up of several bodies that are superimposed over each other. The physical body is the densest
మనలో ఉన్న ధ్వని ప్రధాన మైన శరీరం- ఆస్ట్రల్ శరీరం 
-జీవ కాంతి ప్రధానమైన శరీరం- కుండలినీ చక్ర నాడీ వలయం -ఈ ధర్ శరీరం . 
ధ్వని,కాంతి ద్వారా ఈ  రెండు శరీరాలను ప్రభావితం చేయ వచ్చు. 

మంత్రాలు,తంత్రాలు,భావనా మయ సజెషన్ లు  ఇవన్నీ ఆస్ట్రల్ , ఈ ధర్  శరీరం లను ప్రభావితం చే స్తాయి . 
 

Friday, 30 August 2013

why our own federal queen expelling 5 crore telugus from their capital city?

In the good olden days,if any body commits severe crime,the king punished by expelling the culprit from the capital city .
But, what grave mistake the telugus committed to be expelled from their capital city?
As far as one's knowledge,the telugus committed major blunder of electing the congress party to the federal throne.
They are the main culprits of not only for  degradation of indian economy but also for  failure of total system of the country.
1.unplanned or ill planned economical regulations.
2.sheer negligence of  farming & manufacturing industry.
3.ill conceived and vote bank centric welfare schemes.
4.failure in controlling the imports of unnecessary or luxury items.
5.utter failure in controlling  the large scale  corruption.

Monday, 26 August 2013

ధర్మ చక్రం

ధర్మానికి విరుద్దం గా నడిచే వారు  మిత్రులు,బంధువులు,శిష్యు లు ఎవరైనా సరే అదుపు చే యాలి.
అదే అహింస . దానికి విరుద్దం గా మీరు పలాయనం చేస్తే అది హింస అవుతుంది .
జీవులను చంపడం హింస కాదు . అది రాక్షసత్వం .
హింస  అంటే ధర్మాన్ని చంపడం , ధర్మాన్ని రక్షించ లేక పోవడం. 
అసలు ధర్మం అంటే ఏమిటి ?
మన బాధ్యత ని ఎలాంటి ప్రలోభాలకు  ,సోమరితనానికి ,భయాలకు తావివ్వ కుండా చే యడ మే ధర్మం  .
స్వ ధర్మం , పర ధర్మం, స్థూల ,సూక్ష్మ ధర్మం - ఇలా ఎన్నో స్థాయీ బేధాలు .
తల్లితండ్రులను ,భాగ స్వామిని , పిల్లలను ప్రేమతో సాకటం కర్తవ్యం .
ఇరుగు పొరుగు వారిని,జీవులను,ప్రకృతిని రక్షించడం బాధ్యత .
వ్యక్తి స్థాయి నుండి కుటుంబ స్థాయికి ,తద్వారా సంఘ స్థాయికి తమతమ బాధ్యతలను విస్తరింప చెయడ మే
మనిషి విధి.
ఈ  క్రమం లో తన శారీరక,మానసిక,ఉద్వేగ ,ప్రాణ ఆరోగ్యాన్ని కాపాడు కొంటూ ,తన హితాన్ని,సమాజ హితాన్ని ఆచరణ లో అమలు చేస్తూ ,తన కర్మలను భస్మం చేసుకొని,కొత్త కర్మలు అంట కుండా ఆత్మ  గత అనువర్తనం తో జీవనం సాగించడ మే , మనిషి స్వ ధర్మం . 

Sunday, 25 August 2013

భ వాఘ్ని ఆరామ ప్రారంభోత్సవ శుభా కాంక్షలు ...

భగవద్గీ త:

 ఎన్నో ఏళ్ళుగా సమాజం లోని బలాన్ని,బల హీనతని గమనించి మనిషి ఎలా జీవిస్తే ఆనందం గా ఉంటాడో  , తద్వారా  సమాజం ప్రశాంతం గా ఉంటుం దో ఆ జీవన మార్గా న్ని భోధించే పవిత్ర మార్గ దర్శక గ్రంధం .


సంకట పరిస్థితిలో మనిషికి కలిగే వైరాగ్యం,నిర్వేదం ,నైరాశ్యం మొదలగు తామస భావాలను ,
అత్యాశ,సుఖ లాలస, కీర్తి కాంక్ష,ధన వ్యామోహం  మొదలగు రాజస భావాలను,
క్రొధం,కార్పణ్యం,కక్ష,అసూయ,దురాశ,హింస,మొదలగు రాక్షస భావాలను,
మూడ భక్తి,మిధ్యా వాదం అనే పలాయన వాదం, మూడ నమ్మకాలు,సోమరితనం,మొదలగు అపరిపక్వ భావాలను,-----------మనిషి  అధి గమించి, అర్ధ,కామా లను ధర్మ బద్దం గా  సాధించి మోక్షం ఎలా పొందా లో తెలిపేది గీత.

మనిషికి గమ్యం : చతుర్విధ పురుషార్ధ సాధన, చావు పుట్టుకల చక్రం నుండి విముక్తి. 

భావాలను సాత్వికం గా మార్చు కొని,ఆ తర్వాత ఆయా భావాలకు పునాదిగా ఉన్న చిత్తాన్ని అధిగమించి సంకల్ప రహితం చేసుకోవడం,
మన అవగాహనను , మెట్టు మెట్టు గా కర్మ ఫల సన్యాసం ,ఇంద్రియాలను అధిగ మించే రాజయోగం ,శ్రద్ద-ఓర్పు -విశ్వాసం అనే నవ విధ భక్తి యోగం,సాక్షీత్వం -స్థిత ప్రజ్ఞత్వం-ప్రజ్ఞ అనే జ్ఞాన యోగం --- ఇలా సాధన చేస్తూ మనిషి భౌతిక పరంగా,భావ పరం గా,ఆత్మ పరం గా నిరంతర  ఆనంద స్థితి కి చేరడ మే మనిషి జీవన పధం.
ఇదే మనిషి ధర్మం.

ప్రశాంత మైన,సంతోష మైన జీవితం కావాలీ అనుకొంటే మనం ఎలా నడవాలో తెలిపే కర దీపిక, భగవద్గీ త. 

అందరూ  చదివి,ఆ సారాన్ని తమ తమ జీవితా ల్లో అన్వయించుకొని , పది మందికి తెలప వలసిన బాధ్యత భారతీయుల మైన మనందరి పై ఉంది . 

ఈ గురుతర బాధ్యత ని తమ భుజ స్కందాలపై వేసుకొని అమరావతి దగ్గరే ఉన్న వైకుంట పురం లో భ వాఘ్ని మర్మ యోగ విద్యాలయాన్ని, భ వాఘ్ని ఆరామాన్ని నిర్మించి, గీతా  చైతన్యాన్ని వ్యా పింప చేస్తున్న భ వాఘ్ని గురు దేవులకు,తమ జీవితాలను గీతా ప్రచారానికి అంకితం చేసిన గురుకుల ఆరామ భ వాఘ్నిసభ్యులకు   ఆయురారోగ్య భాగ్యాలు కలగాలని, ---
 నిరాకారుడు ,నిర్గుణో పేతు డు, గీతా కారుడైన శ్రీ కృష్ణుణ్ణి, 
గీతని గానం చేసిన వేద వ్యాస మహర్షిని ,
గీతని గ్రంధస్తం చేసిన గణేశుని - ప్రార్ధిద్దామ్ . 

Friday, 9 August 2013

ఇది తేలేది కాదు !

ప్రక్రుతి వనరుల పరంగా, భౌగోళికం గా,  నదీ ప్రవాహ పరంగా ,  సాంస్కృతిక  పరంగా ,జన సాంద్రత పరంగా, జిల్లా విభజన పరంగా ,రాజధాని లో కేంద్రీకృత  అభివృద్ధి  పరంగా - ఇలా ఏది చూసినా ,ఏ రకం గా  చూసినా,   చీల్చడానికి వీలు లేని ప్రాంతం ఏదైనా మన దేశం లో ఉందీ అంటే  అది ఆంద్ర ప్రదేశ్ .
ఒక ప్రాంతాన్ని చీల్చి తే ఎన్నో కష్టాలు వస్తాయని అందరికీ తెలుసు.
సుమారు 30 సంవత్సరాలు, అంటే రెండు తరాల ప్రజలు కష్టాలు పడా లసిందే .

దేశం ఆర్ధికం గా చాలా క్లిష్ట స్థితి లో ఉంది . కొత్త పరిపాలనా యంత్రాంగానికి, ఎన్ని కోట్లు కావాలో? నిధుల కొరత,వనరుల అసమతుల్యత , ఇచ్చి పుచ్చు కోలేని ధోరణి ,కొద్ది గా కూడా త్యాగాలు చేయలేని స్వార్ధం - ఇవన్నీ
కొత్త రాష్ట్ర ఏర్పాటుకు ప్రతి బంధ కాలు.

యువత ఉద్యోగాలకు హామీ ,ఉద్యోగులకు భద్రత ,నదుల పంపకం,ప్రాంతాల పంపకం, ఆస్తులు అప్పుల పంపకం,వనరుల పంపకం -ఇవన్నీ చాల శ్రమ తో త్యాగాలతో ముడిపడ్డ విష యాలు.
నేటి కాలపు మనస్తత్వాలతో ,కుహనా నాయకులతో జరిగే పని కాదు .
అందరి మనోభావాలను  నమ్మాలి ,గౌర వించాలి.
కానీ , అంత  కన్నా ముందు సమాజ భద్రతా, కనీస అవసరాల  సరఫరా,  ,దేశ  సమగ్రత చాలా ముఖ్యమ్.
సుఖం గా అభివృద్ధి పధం లో దూసుకు పోతున్న సమాజాన్ని నిర్ధా క్షిణ్యమ్ గా సమస్యల కూపం లోకి తోసి వేయడం మంచిది కాదు.
నిజం చెప్పా లంటే ఇది తెలంగాణ ప్రజల సమస్య కానే కాదు. కొన్ని ప్రాంతాల వెనక బాటును ఎరగా చూపించి ఆత్మ గౌ రవం,ఆత్మాభిమానం, అనే రంగుటద్దా లలో ప్రాంతీయాభిమానం అనే సంకుచితాన్ని మెల్లగా మనస్సు ల్లోకి జొప్పించి, ప్రజలను ముఖ్యం గా  యువత ని తప్పు దారి పట్టించి తద్వారా సమాజ ఆర్ధిక స్థితిని కునారిల్ల చేస్తున్న రాజ కీయ పార్టీల అధికార  సమస్య.
తెలంగాణ నాయకుల సమస్యలకు సరైన పరిష్కారం ,వారికి రాష్ట్ర పగ్గాలు అప్ప చెప్ప డ మే . 

Monday, 3 June 2013

మత సామ ర స్యం అంటే ఇదేనా ?

భారతీయులకి, ముఖ్యం గా హిందూ మతాన్ని ఆచరించే వారికి పరమత సహనం ,అలసత్వం , కర్మ సిద్దాంతం , అలవి మాలిన ఓర్పు  చాల ఎక్కువ .
తమ మనోభావాలను హేళన చేసినా , తమ ప్రార్ధనా వాటికలను ,దేవాలయాలను , వాటీ ఆస్తులను నాశనమ్ చేస్తున్నా ,  ఏమీ చేయ లేని  బద్ధకం ,సోమరితనం ,స్వార్ధ పరత్వం నర  నరాల్లో జీర్ణిం చు కొన్న ప్రజలు
ఈ  భూమండలం లో  మరెక్కడా ఉండరు.

దేశం లో ని గుళ్ళ ఆదాయాలను దారి మళ్ళించి నా ,
కోట్లాది విలువైన దేవాలయ ఆస్తులను అమ్మివేసినా ,
లక్షలాది గుళ్ళను పాడు పెట్టినా ,
వైదిక సాహిత్యాన్ని ,వైదికులను ,వేద ఘనా పాటీలను ఆకలితో మాడ్చినా ఏమీ అనని మతస్తులు వీరు.

తమ గుళ్ళ  బాగోగుల కోసం , పురోహితుల యోగ క్షేమాల కోసం ప్రజలు  ముడుపులుగా చెల్లించు కొన్న ధనాన్ని
మరో ప్రయోజనానికి దారి మళ్లిస్తూ ఉంటే ఏమీ అనలేని మీడియా వారు ,గుడిలో జరిగే  చిన్న చిన్న పొ ర  పాట్లను
భూ తద్దాలలో చూ పిస్తారు .

మన భారతీయులెవ్వరూ కనిపెట్టి చెప్ప  లేని నగ్న సత్యం , ఒక అమెరికా పరిశోధకుడు ( steeven knapp ) ద్వారా వెలుగు లోకి వచ్చిన కొన్ని పచ్చి నిజాలు వింటున్నప్పుడు మన మతం పై , ప్రజల పై జాలి వేస్తుంది .
--- ఎందుకు ఇవన్నీ చెప్పుకొని  భాద పడుతున్నా  మంటే ,  మతం అంతరిస్తే దానిని నమ్ముకొన్న జాతి అంతరిస్తుంది . అలా జరగా కూడదు అంటే , ప్రతి భారతీయుడు నడుం బిగించ  వలసిన సమయ మిదే .

ఆంద్ర రాష్ట్రం లో  ఎండో మెంట్ శాఖ పరిధిలో ఉన్న 45000    గుళ్ళ ఆదాయం ( 4000 కోట్లు ) లో 85 శాతం దారి మళ్ళిస్తున్నారు .
కర్ణాటక రాష్ట్రం లో 79 కోట్ల  దేవాలయాల ఆదాయం లో 60 కోట్లు మసీదులకు , 13 కోట్లు చర్చిలకు ధారాదత్తం చేసి
మిగతా 6 కోట్లను గుళ్ళకి ఎంగిలి పడేస్తున్నారు . ఈ దోపిడీ వలన 50000 గుళ్ళు మూత పడ్డాయి .
ఒడిశాలో జగన్నాధుని 70000 ఎకరాల భూమిని   అమ్మటానికి  ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది .
అలాగే కేరళ , మహారాష్ట్ర లో కూడా  దేవాలయాల ఆస్తుల  లూటీ జరుగుతుంది .
సనాతన మత  ప్రియులు , ముఖ్యం గా క్షత్రియులు మేలుకొని ఈ అరాచకా న్ని ఆ పాలి.


Saturday, 11 May 2013

వైశాఖం ...

అన్ని మాసాలు పవిత్రమైన వైనా , వైశాఖ -మాఘ -కార్తీకాలు అత్యంత శ్రేష్ట మైనవి . 
ముఖ్యం గా విష్ణారాధన ,జల దానం ( చలి వేం ద్రాలు ) ,మొక్కలు నాటి పోషించడం ,ఈ మాసం లో తప్పక ఆచరించాలని రుషి వాక్యం . 
అక్షయ తృతీయ ,ఆదిశంకర జయంతి ,నరసింహ జయంతి ,బుద్ద  జయంతి , స్కంద జయంతి , దత్త 
జయంతి - ఈ  నెల లోని పవిత్ర మైన పండుగ రోజులు . 
శరీర శుద్ది తో పాటు చిత్త  శుద్దిని అలవాటు చేయడ మే మన పర్వ దినాల విశిష్టత  . 

చిత్త శుద్ది తో చేసే పూజలు మనస్సుకి ప్రశాంతత ను , బుద్దికి వివేకాన్ని  ఇచ్చి 
అహంకార నిర్మూలనకు తోడ్పడ తాయి . 
ఎప్పుడైతే అహంకారం తగ్గుతుందో , అప్పుడు  మానవ సంబంధాలు 
మెరుగవుతాయి. తద్వారా మనిషి భౌతికం గా ఎదగడానికి అవకాశం  ఉంటుంది .