Search This Blog

Friday 24 June 2016

అమరావతి నగరం ఎలా ఉండ బోతుంది ?

గత దశాబ్దం లో మన దేశం లో ఏర్పడిన కొత్త రాష్ట్రాలు నిర్మించు కొన్న నూతన రాజధాని నగరాలు పెద్దగా ఎవ్వరినీ ఆకర్షించ లేక పోయాయి . కానీ ,ఆంధ్రుల రాజధాని  అమరావతి ' అని చంద్రబాబు ప్రకటించిన నాటి నుండి ఒక చారిత్రాత్మక ,సాంస్కృతిక హార్దిక భావన తెలుగు వారి లోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా  ... ముఖ్యం గా బౌద్ధ మత ప్రాచుర్యమున్న జపాన్ ,చైనా ,మొదలగు ఆగ్నేయాసియా దేశాల హృదయాలలో మెదిలింది . 

ఇది కేవలం పరిపాలనా భవనాల కూడలి కాదు . ఆర్ధిక ,ఉద్యోగ ,విద్యా ,వైద్య ,సేవా ,పారిశ్రామిక వాడ లతో  , లక్షల మందికి ఉద్యోగ ఉపాధిని కల్పించి , రాష్ట్ర ప్రగతికి చోదక శక్తి లా పనిచేసే అద్భుత నగరం గా తీర్చి దిద్దాలని ముఖ్యమంత్రి చంద్ర బాబు తపన . 

33000 ఎకరాల రైతుల నుండి ,మరో 20 000 ఎకరాల ప్రభుత్వ భూమిని సేకరించిన విధానం ,మనదేశం లో మును పెన్నడూ జరగని రీతిలో , రైతులను కూడా అభివృద్ధి పధకం లో ,నగర నిర్మాణం లో భా గ  స్వాములను  చేసిన తీరు  నభూతో ... న భవిష్యత్ . అందరూ బాగా స్వా ములు కావాలి . అందరూ అభివృద్ధి ఫలాలు పంచు కోవాలి ... ఇదే చంద్రబాబు నినాదం ! 

మనం ఓ చిన్న ఇల్లు  కట్టుకోవాలీ అంటే , ఎన్నో స్థలాలు పరిశీలించి ,వాస్తు ,ఇరుగు పొరుగు , పరిశుభ్రమైన వాతావరణం ,నీటి సదుపాయం ,దగ్గరలో విద్యా వైద్య సౌకర్యాలు , రవాణా సౌకర్యం ఇవన్నీ కూలం కుశం గా చూస్తాం కదా ? అదే విధం గా మన ప్రభుత్వం కూడా అనేక ప్రాంతాలను ,జిల్లాలను పరిశీలించి , అన్ని విధాలా ఈ అమరావతి ప్రాంతం ఒక రాజధానిగా మలచు కో వచ్చుఁ అనే ఒక శాస్త్రీయ మైన పరిశోధనా కార్యక్రమం పూర్తయిన తర్వాతే , అమరావతి ప్రాంతాన్ని రాజధానిగా ప్రకటించారు . 

ఒక చిన్న ఇంటిని కట్టు కోవడానికి ఎన్నో అనుమతులు , మౌలిక సౌకర్యాల కల్పన , డబ్బు ,  ప్రణాళిక , 
పనిచేసే  వాళ్ళు ,వీళ్ళంద రినీ పోగేసి నడుం వంచి పని మొదలు పెట్టడానికే ఎంతో సమయం పడుతుంది . 
కానీ ఏ ప్రభుత్వమూ చేయనంత వేగం గా ఇవన్నీ సాధించి అమలు చేయడం ఒక ఎత్తు అయితే , అమాయకపు కొండొకచో మూర్ఖపు  రైతులను , ఎలాంటి ఇంగిత జ్ఞానం లేని ప్రతిపక్షం వారిని ,గుంటకింద నక్క లా కాచు కొనే మీడియా వారిని , అనుమానం గా చూస్తూ అడ్డంకులు కల్పించ డా నికి సదా సిద్ధం గా ఉండే అధికార వర్గాలను , సోమరితనం తో వ్యవస్థ నంతా కుళ్లు ,కుతంత్రాలతో నింపేసిన ఉద్యోగులను , సాయం చేస్తామని మాట ఇఛ్చి వెన్ను పోటు పొడిచిన కేంద్రాన్ని తట్టుకొని చెప్పిన సమయానికి ప్రణాళిక  రచన పూర్తి చేయడమే కాదు , జరపవలసిన పనులన్నింటినీ సకాలం లో చేస్తూ ,ముఖ్యం గా రైతులకు ,చెప్పిన టైం కి  పట్టాలు ఇవ్వడం అనేది ఓ 
గొప్ప విషయం . చంద్ర బాబు ప్రభుత్వ పనితీరు ,ప్రవేటు సాఫ్ట్ వేర్ సంస్థల పనితీరుని మించి పోయింది . 



అమరావతి నగర పరిధిలోని 217 చదరపు కిలోమీటర్లలోని 53000ఎకరాలలో నివాస ప్రాంతం మొత్తం 17వేల ఎకరాలు. ప్రస్తుతం ప్రభుత్వం అనుమతించిన నిర్మాణ ప్రదేశం (ఎఫ్‌ఎస్ఐ) 2 నుంచి 2.8 వరకు ఉంది. అంటే సరాసరి 2.5 ఎఫ్‌ఎస్‌ఐ అనుకుంటే ఎకరాకు 1,09,125 చదరపు అడుగులు కట్టవచ్చు.
దీనిని సరాసరి వంద నివాస గృహాలుగా లెక్కించవచ్చు. అంటే,ఎకరానికి 100 ఇళ్ళు (అపార్టుమెంట్ లు ) వస్తాయి . 

ఈ లెక్కన 17 వేల ఎకరాల్లో 17 లక్షల గృహాలు నిర్మించడానికి అవకాశం వుంది. ఇంటికి సగటున 3.5 వ్యక్తులు అనుకుంటే 60లక్షల జనాభా అవుతుంది. 217చదరపు కిలోమీటర్లకు సరాసరిన చదరపు కిలో మీటర్ కి   26,650 జన సాంద్రత అవుతుంది.
ఇది చాలా ఎక్కువ .దీనివలన డ్రైనేజీ సమస్య ,మంచి నీటి కొరత , త దితర సమస్యలు ఎక్కువై తాయి . 
మొక్కల పెంపకం  ,హరిత వనాల విస్తరణ ఆగిపోయి ,నగరం విష పూరితమై పోతుంది . 
దీనిని ప్రభుత్వం నియంత్రిమ్చాలీ అంటే  FSI ని 1:1 గా తగ్గించాలి .  అక్రమ కట్టడా లను నియంత్రిమ్చే కఠిన మైన చట్టాన్ని తేవాలి . 
లేకుంటే , అమరావతి కూడా మామూలు కాలుష్య నగరాల వలె మారి పోతుంది . 
ఆదర్శ నగరం అంటే  చదరపు కిలో మీటర్ కి  10000 లోపు జనాభా ఉండాలి . 

1 comment:

  1. క్రింద మీరు చెప్పిన విషయం తప్పు అని నా అభిప్రాయం..
    "అదే విధం గా మన ప్రభుత్వం కూడా అనేక ప్రాంతాలను ,జిల్లాలను పరిశీలించి , అన్ని విధాలా ఈ అమరావతి ప్రాంతం ఒక రాజధానిగా మలచు కో వచ్చుఁ అనే ఒక శాస్త్రీయ మైన పరిశోధనా కార్యక్రమం పూర్తయిన తర్వాతే , అమరావతి ప్రాంతాన్ని రాజధానిగా ప్రకటించారు."
    > అమరావతిని రాజధానిగా ఒక్కసారిగా ప్రకటించారు .
    >రేపు కూడా తామే అధికారంలోకి వస్తామనే అహంతో ఎవర్నీ కలుపుకోకుండా నిర్ణయం తీసుకున్నారు
    > "ముఖ్యం గా బౌద్ధ మత ప్రాచుర్యమున్న జపాన్ ,చైనా ,మొదలగు ఆగ్నేయాసియా దేశాల హృదయాలలో మెదిలింది" అన్మేది కూడా తప్పు .. వారు వ్యాపార దృష్టితోనే ఆలోచిస్తున్నారు అనేది సత్యం

    ReplyDelete