Search This Blog

Friday 4 December 2020

కేంద్రం ప్రవేశపెట్టిన మూడు వ్యవసాయ బిల్లుల్ని రైతులు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు?*

   * కేంద్రం ప్రవేశపెట్టిన మూడు వ్యవసాయ బిల్లుల్ని రైతులు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు?*

ప్రభుత్వం ఏమంటుంది ?
  • కొత్త చట్టాలప్రకారం, రాష్ట్ర సహకార మార్కెట్ అనే చిన్న స్థాయి నుండి ప్రపంచం మొత్తం ఒక మహా మండీ గా మారుతుంది.
  • కనీస మద్దతు ధర అనే బిచ్చమ్ పై ఆధారపడకుండా రైతులు సంఘటితమై తమ సరకులను ప్రపంచంలో ఎక్కడికైనా ఎగుమతి చేసుకోవచ్చు.
  • వ్యవసాయరంగం లోకి ప్రవేట్ పెట్టుబళ్ళు ఎక్కువగా వస్తాయి కాబట్టి రైతులకిష్టం ఉంటే ప్రవేట్ పెట్టుబడిదారులతో కౌలు అగ్రిమెంట్ చేసుకొని ఎక్కువ కౌలు పొందే అవకాశం ఉంటుంది.
  • అలాగే వాణిజ్యపరంగా ఏ వంగడానికి ఎక్కువ డిమాండ్ ఉంటే ఆ వంగడాన్ని పండించే అవకాశం ఉంటుంది.
  • విత్తనాలు, భూమిని తయారు చేయడం, ఎరువులు,పురుగుమందులు ,కోత మిషన్లతో మాసూలు తదితర ఖర్చులు కమ్యూనిటీ వ్యవసాయం ద్వారా తగ్గించుకోవచ్చు. రైతులే సంఘాలుగా ఏర్పడి సబ్సిడీలు, సాఫ్ట్ లోన్ లు తీసుకొని గిడ్డంగులు, సోలార్ డ్రయ్యర్ లు ,శీతల స్టోరేజీ లు నిర్మించుకొని డిమాండ్ పెరిగేవరకు సరకును నిల్వ చేసుకోవచ్చు.
  • ఇదే చట్టాన్ని కార్పోరేట్ వాళ్లకు అనుకూలంగా ఉందని కూడా చెప్పవచ్చు. ఒక విషయాన్ని చూసే దృక్పధం ను అనుసరించి మన అవగాహన ఉంటుంది. అలాగైతే ఇప్పటివరకు మన రైతులు కౌలు కిచ్చేది ప్రవేట్ వ్యక్తులకే గదా? ఇప్పుడు ఎక్కువ డబ్బు,మందీ మార్బలం ఉన్న పెద్ద ప్రవేట్ వాళ్లకి కౌలుకిస్తే ఎక్కువ కౌలు గిట్టుబాటవుతుంది గదా?
వ్యవసాయానికి, సరకు మార్కెటింగ్, సరకు నిల్వ కు సంబంధించి,కేంద్రప్రభుత్వం 3 రకాల చట్టాలకు సవరణచేసింది.
వ్యవసాయం లో కూడా ,రక్షణ రంగంలో మాదిరిగానే ప్రయివేట్ శక్తులను అనుమతిస్తే తప్ప వ్యవసాయం లాభసాటిగా మారదు . కానీ నిత్యావసరాల ధరలు అదుపుచేసే సిస్టమ్ ప్రభుత్వం చేతిలో ఉంచుకోకపోతే అమెరికా,యూరప్ దేశాలలో మాదిరిగా ఆహార వస్తువుల ధరలు చాల ఎక్కువగా పేరిగిపోతాయి. అంతేకాదు ప్రాసెస్ చేసిన ఆహార పదార్ధాలు ఇబ్బడిముబ్బడిగా పెరిగి ఆరోగ్యాన్ని కూడా పాడుచేసే ప్రమాదం ఉంటుంది.
మనదేశం లో చిన్న కమతాల వలన యాంత్రికత పెరగక పోవడం చేత, కూలీలపైనే ఎక్కువగా ఆధారపడటం వలన పంట ఖర్చు బాగా పెరిగిపోతుంది.
కమ్యూనిటీ ఫార్మింగ్ , కార్పొరేట్ ఫార్మింగ్ రావలసిన ఆవశ్యకత ఉంది.

దేశ వ్యవసాయ ఉత్పత్తులలో 30 శాతం వృధాగా పాడవటానికి కారణం కోల్డ్ స్టోరేజీ ,సోలార్ డ్రయర్ లు సరిపడా అందుబాటులో లేకపోవడం.
కానీ,ఎప్పుడైతే కార్పొరేట్ సంస్థలు వ్యవసాయంలోకి ఎంటర్ అవుతాయో అప్పుడు జన్యు మార్పిడి సంకర వంగడాలు ,ఎరువులు,మందుల వినియోగం అదుపుతప్పి భూసారానికి ,దేశవాళీ విత్తన జన్యువులకు ప్రమాదం కలిగే అవకాశం కూడా ఉంటుందని మరచిపోకూడదు.

పాత చట్టాల ప్రకారం , నిత్యావసర సరకులను ఒక పరిమితికి మించి నిల్వ చేయ కూడదు.
కొత్త చట్టాల ప్రకారం ఎన్నైనా నిల్వ చేసుకోవచ్చు.
నల్ల బజార్ లెక్క నిల్వలు చేసేసి మార్కెట్ లో ధరలు పెంచేస్తే ?
ధరలు ఒక పరిమితి దాటి పెరిగినప్పుడు ప్రభుత్వం ఆంక్షలు విదిస్తుంది.
ఇది జరిగే పనేనా? కార్పొరేట్ కంపెనీల చేతిలో ప్రభుత్వాలు కీలుబొమ్మలు గదా?
ఇప్పుడు పంట చేతికి రాగానే ప్రభుత్వం సూచించిన మద్దతు ధరకు సరుకు ను అమ్మకొంటున్నారు.
కొత్త చట్టాల ప్రకారం , ప్రభుత్వ కనీస మద్దతు ధర అనేది లేకపోవడం వలన , తమ సరకును దాచుకొనే సాంకేతికత, ప్రాసెస్ చేసుకొనే వెసులుబాటు లేకపోవడం వలన బక్క రైతులు ఏదో ఒక ధరకు తెగ నమ్ము కోవలసి వస్తుంది. మీకు తెలుసుగా మనదేశం లో 86 శాతం బక్క రైతులే!

86% చిన్న సన్నకారు రైతులున్న దేశంలో రైతులు తమ పొలంలో పండిన వాటిని సొంతంగా స్టోర్ చేసుకోలేరు. ఎందుకంటే రైతులకు AC గోడౌన్లు లేవు. కాబట్టి ఎలాగైనా దళారీలకో, కంపెనీలకో ఉత్పత్తి అయిన పంట పాడు అవకుండా తొందరగా అమ్మేస్తారు. ఇక్కడ లాభం పొందేది దళారీలు, కార్పొరేట్ కంపెనీలు మాత్రమే. ఎప్పటిలానే రైతు మోసపోతాడు.*
కాబట్టి ఇక్కడ రెండు పరిష్కారాలు . గిడ్డంగులు,ప్రాసెస్ ప్లాంట్ లు రైతు సంఘాలు నిర్మించుకొనేటట్లు ప్రభుత్వాలు గ్రాంట్ ,సబ్సిడీ లివ్వాలి. అలాగే ప్రయివేట్ కంపెనీలు కూడా వీటిని నిర్మించడానికి సబ్సిడీ రుణాలివ్వాలి.


అదేమిటి సార్! కొత్త చట్టాల ప్రకారం రైతులు భారతదేశంలో ఎక్కడైనా సరే తమ పంట ఉత్పత్తులు అమ్ముకో వచ్చు గదా?
బక్క రైతులు అందరూ కలిసి ఒక సంఘం లా ఏర్పడి తమ సరకును బయట ప్రపంచం లో గిరాకీ బాగా ఉన్న చోట అమ్ముకొని లాభాలు గడించ వచ్చు గదా?
*ఒక చిన్న, సన్నకారు రైతు నిజంగా తన పంటను వేరే రాష్ట్రానికి వెళ్లి అమ్ముకుంటాడా? పక్క జిల్లాలోని మార్కెట్ యార్డులోనే అమ్ముకోవడానికి ట్రాక్టర్లు, లారీలకు బాడుగలు ఇచ్చుకోలేక నలిగిపోతున్నాడు. తీరా అక్కడికి వెళ్ళాక సరైన ధర లేక కొన్నిసార్లు అక్కడే పడేసి వస్తున్నాడు. కాబట్టి ఇది రైతులు తమ ఉత్పత్తులు అమ్ముకోవడానికి చేసిన చట్టం కాదు.*
మధ్య దళారీలు, కార్పొరేట్ కంపెనీలు దేశంలో & ప్రపంచంలో ఎక్కడ డిమాండ్ ఉంటే అక్కడ అమ్ముకోవడానికి వీలు కల్పించే చట్టం ఇది.
పరిష్కారం . రైతులు సంఘాలుగా ఏర్పడటం కనీస బాధ్యత. కనీస మద్దతు ధరను ప్రకటించడం ప్రభుత్వాల కనీస బాధ్యత.
కాంట్రాక్ట్ ఫార్మింగ్...చట్టం తెచ్చారు. అదేమీ నిర్బంధమేమీ కాదు. రైతుకి ఇష్టం ఉంటే నే కాంట్రాక్ట్ లోకి ఎంటర్ అవుతాడు.
కాంట్రాక్ట్ ఫార్మింగ్... వలన కలిగే నష్టాలు రైతులకు తెలుసు గదా? ఇందులో మభ్యపెట్టేదేమీ ఉండదు.

కాంట్రాక్ట్ ఫార్మింగ్..గురించి నెగిటివ్ దృక్పధం తో వెలిబుచ్చిన అభిప్రాయాలను చూడండి ---
రైతు ముందుగానే ఏ పంట వేయాలో, ఏ ఎరువును వాడాలో అని నిర్దేశించి ఈ కార్పొరేట్ కంపెనీలు రైతులతో 5 సంవత్సరాల వరకూ అగ్రిమెంట్ చేసుకోవచ్చు. ఈ అగ్రిమెంట్ లో ఎంత ధర ఉంటే అంతే రైతు తీసుకోవాలి. రాబోయే 5 ఏళ్ల కాలంలో ధరలు పెరిగినా రైతు మాత్రం అగ్రిమెంట్ ప్రకారమే డబ్బు పొందుతాడు కానీ మార్కెట్ రేటు ప్రకారం కాదు. ఈ కార్పొరేట్ కంపెనీలతో కాంట్రాక్ట్ వ్యవసాయం చేసిన 5 సంవత్సరాల తర్వాత భూమిని చూస్తే పనికిరాని విధంగా రసాయనాలతో నిండిపోయి సారం కోల్పోతుంది. గ్రౌండ్ వాటర్ మొత్తం అయిపోగొట్టేస్తారు. భవిష్యత్తులో కొన్ని సంవత్సరాల దాకా వ్యవసాయానికి పనికిరాకుండా తయారు అయిపోతుది భూమి. *అలాంటి భూమి ని ఏమీ చేసుకోలేక చివరకు ఆ దళారీలకో, కంపెనీలకో భూముల్ని అమ్ముకోవాల్సిన పరిస్థితి వస్తుంది.*
ఇవన్నీ పూర్తిగా నెగిటివ్ దృక్పధం తో వెలిబుచ్చిన అభిప్రాయాలు. కాంట్రాక్ట్ లో షరతులు ఇష్టం లేకపోతె ఆ రైతు కాంట్రాక్ట్ లోకీ ఎంటర్ అవ్వడు .

కొన్ని పరిష్కారాలు .
1. కాంట్రాక్ట్ ఫార్మింగ్ చేసే కంపెనీ, MS స్వామినాథన్ చెప్పినట్టు, రైతు పెట్టుబడికి 50% అదనంగా సొమ్మును కలిపి మద్దతు ధరగా చెల్లించాలి.
2. రైతు ఉత్పత్తులు కొన్న కంపెనీ ఫారిన్ కి ఎక్స్పోర్ట్ చేయడానికి వీలు కల్పించకూడదు. లేదా భారతదేశంలో ఖచ్చితంగా 70% సేల్ చేయాలి అని నిబంధన తేవాలి.
3. కాంట్రాక్ట్ ఫార్మింగ్ కేవలం సేంద్రీయ ఎరువులు లేదా జీరో బడ్జెట్ నాచురల్ ఫార్మింగ్ ద్వారానే చేయాలి. రసాయనాలు వాడడం బ్యాన్ చేయాలి. లేదంటే కార్పొరేట్లు పిప్పి పీల్చేసిన భూమి రైతులకు దేనికీ పనికిరాదు.
5. ప్రతి గ్రామంలో శీతల గిడ్డంగులు, గోదాముల కట్టించాలి. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు పెంచాలి.
6. రైతు ఉత్పత్తి సంఘాలను బలోపేతం చేసే వ్యవస్థను ఏర్పాటుచేయాలి.
*ఇవన్నీ ఏమీ చేయకుండా కార్పొరేట్లకు లాభం చేకూర్చే బిల్లులు పాస్ చేయడం వల్ల రైతులు ఎంతో నష్టపోతారు. రైతు నష్టపోతే సామాన్యుడికి తిండి కూడా దొరకని పరిస్థితి వస్తుంది.*

Tuesday 9 June 2020

మోడీ పాలనలో మెరుపు లేవైనా ఉన్నాయా?


ఇన్సూరెన్స్ చట్టాల సవరణ బిల్లు ద్వారా ఆ రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు 26 శాతం నుంచి 49 శాతానికి పెరిగాయి.
 ఎనకమిస్టులు, విధానకర్తలు... డీజిల్ ధరలపై నియంత్రణ వద్దని కోరినట్లు గా  ప్రధాని మోదీ అధికారంలోకి వచ్చిన వెంటనే అమల్లోకి తెచ్చారు.

 జనధన్ బ్యాంక్ అకౌంట్ల మొదలు... ప్రతీ గ్రామానికీ కరెంటు వరకూ,
ఉజ్వల స్కీమ్ మొదలు... ఆయుష్మాన్ భారత్ వరకూ...
 ముద్ర రుణాల మొదలు... స్వచ్ఛ భారత్ వరకూ... ప్రతీదీ బలంగానే అమలు చేయడానికి ప్రయత్నీమ్చినా సరిగ్గా అమలుచేయలేక పోయారు.ప్రచారంలోకనబడిన హడావిడి క్షేత్రస్థాయిలో లేనేలేదు.  నమో గంగా పధకం కూడా విజయవంతం గా అమలుచేయలేదు.
మోదీ మొదటి ఐదేళ్ల కాలంలో కొన్ని సంస్కరణలు తెచ్చారు. అవి GST, IBC, పారదర్శక పాలన, చట్టప్రకారం పాలన, సహజ వనరుల వేలం, RERA, సరిహద్దుల గుండా వ్యాపార సంస్కరణలు, DBT విధానం తేవడం ఓ విప్లవాత్మక అడుగు.

 రెండోసారి అధికారంలోకి వచ్చాక బ్యాంకుల విలీనం, కార్మిక చట్టాల్లో మార్పులు (నాలుగు రకాల లేబర్ కోడ్స్ అమలు), కార్పొరేట్ టాక్స్ తగ్గింపు, (ప్రపంచంలోనే తక్కువ కార్పొరేట్ టాక్స్), ఇక మేలో ఆత్మ నిర్భర భారత్‌తో మరిన్ని సంస్కరణల కు తెర తీశారు.

అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ మార్కెట్ కమిటీ (APMC) ఏర్పాటైంది. నిత్యవసర సరుకుల చట్టాన్ని సవరించారు. ఇప్పుడు రైతులు తాము ఏం పండించాలనుకుంటే అది పండించగలరు. ఏ రేటుకి అమ్మాలనుకుంటే, ఆ రేటుకి అమ్మగలరు. కాంట్రాక్ట్ పార్మింగ్ అనేది వాస్తవ రూపంలోకి వచ్చింది. వ్యవసాయంలో మోడ్రన్ టెక్నాలజీ అమలవుతోంది. దేశవ్యాప్తంగా వ్యవసాయ మార్కెట్లు ఏకమవుతున్నాయి.
కోల్ మైనింగ్ మళ్లీ ప్రారంభమైంది. చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు మేలు చేసే నిర్ణయాలు తీసుకున్నారు. రక్షణ రంగంలోకి FDIలను ఆటోమేటిక్ రూట్ ద్వారా 74 శాతానికి పెంచారు. ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రైవేటీకరిస్తున్నారు. అంతరిక్ష రంగంలో కూడా ప్రైవేట్ సంస్థలకు డోర్లు తెరిచారు. వన్ నేషన్ వన్ రేషన్ కార్డు కూడా వాస్తవ రూపు దాల్చింది.

Saturday 2 May 2020

5 లక్షల వైరస్ మరణాలా ? 10కోట్ల ఆకలి చావులా?

లాక్ డౌన్ విధించకపోతే మన భారతదేశం లో ఎంతమందికి వైరస్ సోకేది ? సుమారు కోటి మందికి సోకేదా? ఏమో ? ఓ పని చేద్దాం. ప్రపంచంలోనే బాగా దెబ్బతిన్న అమెరికా జనాభా ,అక్కడ వ్యాపించిన పాజిటివ్ కేసులు ,వాటి మధ్యనున్న నిష్పత్తిని ఒక మోడల్ గా తీసుకొని దానిని మన దేశానికి అప్లై చేద్దాం. 
 35కోట్ల అమెరికాలో ఓ 15 లక్షలమందికి సోకిన కరోనా ఇండియాలో ఎంతమందికి సోకుతుంది? రేషియో లో అమెరికా జనాభాకి 4 రెట్లున్న  138కోట్ల ఇండియాలో 4రెట్లు అనగా 60 లక్షల మందికి సోకే అవకాశం ఉంది. ఇలా జరగడానికి సుమారు ఏడాది పట్టేదాలేదూ 6నెలల్లో నే కోటిమందికి సోకేదనుకొందాం . 


వాస్తవానికి మనదేశంలోని 730 జిల్లాలలో కేవలం 300 జిల్లాలలోనే వైరస్ ఆక్టివ్ గా ఉంది. అంతేకాదు, 60 శాతం జనాభా ఉన్న రూరల్ ఏరియాలలో వైరస్ ఆక్టివ్ గా వ్యాపించలేదు. అంటే, దేశం లో 40 % ప్రాంతం లోనే ముఖ్యంగా నగరాలు, పట్టణాలలోనే వైరస్ ఎక్కువగా వ్యాపిస్తూ ఉంది. 

సరే,కోటి మందికి సోకితే అందులో 15శాతం అనగా 15 లక్షలమందికి హాస్పిటల్ అడ్మిషన్ అవసరమయ్యేది.  సుమారు ఒక్కో రోగికి 15రోజుల చొప్పున మనదేశం లో ఉన్న ఉన్న 2 లక్షల ఐసోలేషన్  బెడ్స్ సరిపోయేవి కావు. ఆక్సిజన్ సరిపోయేది కాదు. అన్నింటి కంటే ముఖ్యం హెల్త్ వర్కర్స్ సరిపోయేవారు కారు.     సుమారు 5లక్షలమంది చనిపోయేవారు . 
ఆక్సిజన్ యంత్రాలు గానీ, కనీసం ఆక్సిజన్ గొట్టాలు కూడా తయారు చేయలేని దుస్థితి లో మన దేశం ఉంది. దీనికి కారణం మన నాయకుల హ్రస్వ దృష్టి అని గానీ, ఆరోగ్యమే మహాభాగ్యమనే ఇంగితం లేకపోవడమనీ నేను విమర్శించబోవడం లేదు.


మనదేశం లోఉన్న అర లక్ష వెంటిలేటర్లు , 25000 అత్యవసర చికిత్స బెడ్స్ , 2 లక్షల ఐసోలేషన్ బెడ్స్ , 5 లక్షల ఆక్సిజన్ సిలిండర్లు, లక్ష మంది  వైద్య నిపుణులు , 5 లక్షలమంది నర్సింగ్ సిబ్బంది సరిపోరు. అత్యవసర చికిత్స లో నైపుణ్యం తక్కువ ఉన్న వైద్యులు , చాలీ చాలని మౌలిక సదుపాయాల తో ఈ కోవిడ్  తో యుద్ధం చేస్తే మరణాలు ఎక్కువగా నమోదు అవ్వడం లో ఆశ్చర్యం లేదు. ఎందుకంటే మన నాయకులు గత 70 ఏళ్లుగా పబ్లిక్ హెల్త్ ను ఏ మాత్రం పట్టించుకోలేదు. బిచ్చ మేసినట్లు వైద్యులకు, నర్సింగ్ సిబ్బందికి  జీతాలు ఇస్తున్నారు. సెకండరీగ్రేడ్ టీచర్లకు లక్షల  జీతమిస్తున్న ప్రభుత్వాలు,వైద్యులకు కేవలం 50 వేలు విదిలిస్తున్నాయ్. ఆరోగ్యరంగం లో మౌలిక సదుపాయాలను ఏమాత్రం అభివృద్ధి చేయలేదు. అత్యవసర చికిత్సకు ప్రామాణికమైన హాస్పిటల్స్ లేవు. నిపుణులు లేరు. ప్రభుత్వాలు ఇకనైనా మారాలి. కనీసం మన జి డి పి లో 5 % ఆరోగ్యరంగానికి కేటాయించకపోతే తగిన మూల్యం చెల్లించుకోవాలనే గుణపాఠాన్ని  ప్రభుత్వాలు నేర్చుకోవాలి.   

నాన్ కోవిద్ జబ్బులు- ఆకలి ఆక్రన్దనలు. 

కోవిద్ పైనే గురిపెట్టి నాన్ కోవిద్ వ్యాధులను గాలికి వదిలేయడం వలన ఏడాదిలో కనీసం   10లక్షలమంది చనిపోయే అవకాశం ఉంది. 
 55 రోజులపాటు లాక్ డౌన్ విధించడం వలన ఏమి జరిగిందో తెలుసా?
అనధికారిక ఆర్థిక వ్యవస్థలో  వ్యవసాయ కూలీల ను పక్కనబెట్టినా , దాదాపు 20 కోట్లమంది  కార్మికులు అంటే దేశ  శ్రామికశక్తిలో దాదాపు సగం మంది జీవితాలు ప్రమాదంలో పడ్డాయని, వారి జీవనోపాధి ధ్వంసమైందని  అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్‌ఓ) అధ్యయనంలో వెల్లడైంది.అదృష్ట వశాత్తు  పల్లె ల్లో వ్యవసాయరంగం పై లాక్ డౌన్ పెద్దగా దుష్ప్రభావం చూపెట్టలేదు. కేవలం అర్బన్ జీవనాన్ని మాత్రమే అతలా కుతలం చేసింది. 
  మనదేశం లో ఉన్న 5000 మీడియం సైజు, 3 లక్షల చిన్న సైజు, 6కోట్ల మైక్రో పరిశ్రమలలో పనిచేసేవారిలో 50% అనగా 10కోట్లమంది భవిష్యత్ అగమ్యగోచరమైపోతుంది. ఎందుకంటే పోస్ట్ లాక్ డౌన్ కాలం లో ఈ పరిశ్రమలు నిలదొక్కుకో గలవా ? అనే సందేహం నిజం కా కూడదని అనుకొందాం. ప్రభుత్వం స్టమ్యులస్ పాకేజీ ఇచ్చి ఈ రంగాన్ని ఆదుకోకుంటే 10 కోట్ల కుటుంబాలు వీధినపడతాయి. 
ఆర్ధిక మాంద్యం అంటే  ప్రజల కొనుగోలు శక్తి తగ్గిపోవడం చేత డిమాండ్ తగ్గిపోవడం. కానీ ఇప్పుడేమైందంటే, డిమాండ్ తోపాటు సప్ప్లై కూడా(ఉత్పత్తి) తగ్గిపోయింది.  

కరోనా మహమ్మారి సృష్టించిన ఆర్థిక సంక్షోభం ఫలితంగా 10కోట్ల మంది (ఇన్ఫార్మల్ ఎకానమీ వర్కర్స్) సంపాదన కోల్పోతున్నారని పేర్కొంది. ఇదంతా లాక్‌డౌన్ చర్యల ఫలితమని వివరించింది.   
   
హోల్‌సేల్, రిటైల్ రంగాలు, తయారీ రంగం ,వసతి, ఆహార  సేవల రంగం, రియల్ ఎస్టేట్, ఇతర వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తున్న సంస్థలు , చిన్న చిన్న హాస్పిటల్స్ అన్నీ ఇబ్బందుల్లో కూరుకు పోతాయి. 
 10కోట్ల కుటుంబాలు అంటే సుమారు 40కోట్లజనాభా !వీరి జీవన ప్రమాణాలు దారుణంగా పడిపోయి మరింత పేదరికం ,అనారోగ్యం ,మరిన్ని నేరాలు దేశ వ్యాప్తంగా పెరిగిపోయే అవకాశం ఉంది. 
దీనికి బాధ్యులెవరు ? 
కరోనా వైరస్సా ?
 ముందు చూపు లేని కరడుగట్టిన నాయకత్వమా ?
ఎప్పుడు లాక్ చేయాలో,ఎప్పుడు వదిలివేయాలో లెక్క వేయలేని  మేధావి వర్గమా?
ఏ మాట కామాట చెప్పుకోవాలి. వాతావరణం, పర్యావరణం, నదులు,సముద్రాలు , రోడ్లు అన్నీ స్వచంగా మారాయి. మరి,మనిషి మనస్సు మారిందా?అలవాట్లు శాశ్వతం గా  మారతాయా ? 
ఏది ఏమైనా ఈ క్రింది వాటిలో ఏదో ఒక టి సెలెక్ట్ చేసుకోవాలి!
5 లక్షల వైరస్  మరణాలా ? 
40 కోట్ల ఆకలి ఆక్రంద న లా? 
10కోట్ల ఆకలి చావులా?
మీరేది కోరుకొంటారు?!