Search This Blog

Tuesday 3 December 2013

తల వంచిన భారతీయుడు

పాలకులు అవివివేకులు గా ఉండి ప్రజా వ్యతిరేక  నిర్ణయాలు తీసుకొంటే ఆ సమాజం బాగుపడి పురోగతి చెందు తుందా ? ఉదాహరణ కు మన దేశం లో  తెలివితక్కువ వ్యక్తులు కేంద్రం లో  కీలక స్థానాల్లో ఉన్నా, కీలక నిర్ణయాలు తెలివి తక్కువగా తీసుకుంటున్నా ఈ ప్రభుత్వం, ప్రజాస్వామ్య వ్యవస్థ ఎలా ముం దుకు సాగుతున్నాయన్న అనుమానం ప్రతి ఒక్కరికీ కలుగుతుంది. "మానవ చరిత్రలో వేలాది సంవత్సరాలు కొనసాగిన రాచరిక వ్యవస్థలో, అత్యధిక శాతం రాజులు అవివేకులే అయి ఉండేవారు. అయినా ఆయా రాజ్యాల పురోగతికి ఆ రాజుల అవివేకం అడ్డుకాలేదు''. 

కించిత్ పరిజ్ఞానం లేని,ఏ అంశాన్నీ అవగతం చేసుకోలేని , పైగా భారత సమాజం గురించి కనీస అవగాహన లేని,ఎటువంటి విలువలకూ కట్టుబడి ఉండాలన్న నిబద్ధత లేని  వ్యక్తులు ఇప్పుడు మన దేశాన్ని నిరంకుశం  గా పాలిస్తున్నారు . 
నిరం కుశ పాలకులు,అభద్రతా భావం ఎక్కువగా ఉన్న వ్యక్తులు , తన గొప్పదనాన్ని నిర్ధారించుకోవడానికి  ఎప్పు డూ బలహీనమైన వ్యక్తుల్ని, సులభమైన లక్ష్యాలను ఎంచుకొంటారు. ఫలితంగా ఎక్కడా ఎదురుదెబ్బతగిలే అవకాశం ఉండదు. దేశం లో అత్యంత బలహీనులు తెలుగు వారు . తెలుగు వారిని చీల్చి చెందాడు తున్నా ఎవరూ ఎదిరించ డం లేదు . 
ఈ విశాల భారతదేశంలో, సంక్లిష్ట ప్రజాస్వామ్య వ్యవస్థలో వివిధ కీలక అంశాలపై కనీస  అభిప్రాయాలు, ప్రజల జీవన పద్దతులు , విశ్వసించే విధానాలు,సమాజ నిర్మాణానికి అవసర మైన  సిద్ధాంతాలు -వీటి గురించి  అసలేమీ అవగాహన లేని నిరక్షర కుక్షి  - సనాతన పురాతన వేద భూమిని , వివిధ భాషలతో ,సంప్రదాయాలతో అలరారుతున్న ఒక అభి వృద్ది చెందుతున్న  దేశాన్ని రాచరిక నిరమ్కుశ పద్దతి లో పాలిస్తున్నా రంటే ,భారతీయులు ఎంతటి చేవ లేని సోమరి పోతులో తేట తెల్లమవుతుంది"-అని ప్రతి విదేశీయుడు చెప్పుకొంటున్నారు . 
అశోకుడు ,చంద్ర గుప్తుడు ,కృష్ణ రాయలు , మహాత్మా గాంధీ ,సర్దార్ పటేల్ పాలించిన ఈ  భూమి కి మళ్ళీ   మంగోల్, ఆఫ్ఘన్  ,మొగలాయీ ,బ్రిటిష్ ముష్కర్ల మాదిరి విదేశీ అరాచక పాలన దుస్థితి కలిగి నందుకు ప్రతి భారతీయుడు సిగ్గుతో తల దించు కోవాలి . 

No comments:

Post a Comment