Search This Blog

Thursday 10 April 2014

మతాన్ని రక్షించు కోవలసిన అవసరం ఉందా?

మతాన్ని రక్షించు కోవలసిన అవసరం ఉందా?
ఈ భౌతిక ప్రపంచం లో మనిషికి రక్షణ ఇచ్చే ది గుంపు . ఆ గుంపు  అనేది  కులం వల్లో , రంగు వలనో , ప్రాంతం వల్లో ఎలా వస్తుందో అంత  కన్నా బలం గా మతం ద్వారా వస్తుంది .
కాబట్టి పారమార్ధిక చింతన మీద శ్రద్ద నమ్మకం లేని వారు , మానవత్వాన్ని మతం తో ముడి పెట్టే వారు తమ మతమే గొప్పదని , అన్య మతాలు  ఒట్టి బోగస్ అని,తమ మత  సిద్దాంతాలను ప్రచారం చేసుకొంటూ ఇతర మతాలను తెగ నాడుతూ ఉంటారు .

నేటి కాలానికి మనిషిని ఒక బలమైన సమూహం గా పట్టి ఉంచేది మతం .
ఆక్రోశం లో , ఆపదలో ప్రార్ధన ,
కోరికలు తీరడానికి  చేసే క్రతువులు --- ఇవన్నీ మనిషికి అత్యంత అవసరం .
ఒక  జాతి జీవన విధానం, వారు అనుసరించే మతం  పై ఆధార పడి ఉంటుంది .
   ఎన్ని విషయాలలో ఏకాభిప్రాయం ఉంటే అంత  ప్రశాంతం గా సంఘం ఉంటుంది .
ఒక సామూహిక  సమ్మతిని ప్రోత్సహించేది మతం.
కాబట్టి మతాన్ని రక్షించు కోవలసిందే . అలాగని అన్య మతాలను ఈసడించు కొనక్కర లేదు .
భిన్న మతాల మధ్య ఆరోగ్య కర పోటీ అన్ని విషయాలలో అవసరమే .
మతం మనిషిని ఓదా ర్చుతుం ది .
ప్రాధమిక అవసరాలైన కూడు ,గుడ్డ ,నీడ , రక్షణ కరువైన వారికి ఆలంబన గా నిలిచే మతాన్ని ఎక్కువ మంది ఆదరిస్తారు,  అనుసరిస్తారు .
ఇవన్నీ తీరిన తర్వాతే మనిషి పరమార్ధ చింతన చేయ గలడు .
హిందూ మతం ఆధ్యాత్మిక తకు  ఎక్కువ ప్రాధాన్యత నిస్తుంది. 

No comments:

Post a Comment