Search This Blog

Thursday 5 June 2014

నూతన రాష్ట్ర నిర్మాణానికి నడుం కట్టిన ఆంద్ర జాతికి నమస్కారం .

సోనియా కాంగ్రెస్ చేసిన దుర్మార్గపు రాష్ట్ర విభజన వలన సీమాంధ్ర మొత్తం రగిలిపోయింది.

పచ్చని ఆంధ్ర రాష్ట్రాన్ని విడ దీయడం  భౌగోళికం గా ,వనరుల పరం గా చాలా కష్టం. ఆత్మ హత్యా సద్రుశ్యం.అభివ్రుద్ది పట్టాల పై దూసుకు పోతున్న రాష్ట్రాన్ని ఆపి అడ్డం గా నరికేసి మీ చావు మీరు చావండని ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసింది సోనియా కాంగ్రెస్.

విడదీస్తే ఎవరికి వారు ఇంకా బాగా బతుకుతారనే వాదం ఉంది.అలాగే ఎక్కువ మంది రాజకీయ నాయకులకు మంచి అధికార అవకాశాలు  వస్తాయనే దురాశ ఉండనే ఉంది .

రాష్ట్ర విభజన సోనియా కాంగ్రెస్ కల్పిత ఉత్పాతం .
ఆస్తులు అప్పులు,ఉద్యోగులు,విద్యుత్,నీళ్ళు,విద్యా - వైద్య సంస్థలు,ప్రాజెక్ట్ లు ఎలా పంచాలో కూడ తెలీని కేంద్ర వ్యవస్థ, తమ బుర్ర తక్కువ చేష్టలతో తెలుగు జాతి మధ్యన చిచ్చు పెట్టింది.

ఆక్రోశంతో ,అభద్రతా భావంతో రగిలిపోతున్న ఆంధ్ర యువత పెడ దారి పట్టి బ్రష్ట్టు పట్టకుండా కాపాడ గలిగే నాయకుడు చంద్ర బాబే అని నమ్మి తెలుగు ప్రజలు ఇచ్చిన తీర్పు చారిత్రాత్మకం.

సమయానికి తెలుగుదేశం పార్టీ నాయకుడు చంద్రబాబు సమన్యాయం అనే ఒక సకారాత్మక ద్రుక్పధం వలన ఆంధ్ర జాతి యువత  లొ చిచ్చు రేగిన  దేశ విచ్చిన్న వాదం,వేర్పాటు భావం సద్దుమణిగి  మరల దేశ జన జీవన స్రవంతి లో కలిసిపోయి,జరిగిన అన్యాయాన్ని దిగమింగి,సార్వత్రిక ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ ఒక్కటే కాంగ్రెస్ చేసిన అరాచకాన్ని అరికట్టగలదు,అభివ్రుద్దికే అంకితమైన చంద్రబాబు ఒక్కడే సమర్ధ మైన నాయకత్వం తో నడిపించ గలడు అని అనుకొని, తమ సొంత రాష్ట్ర పునర్నిర్మాణం పై ద్రుష్టి పెట్టారు.
ఈ సందర్భం గా మనందరమూ సంఘీభావం తో ఉండి రాష్ట్రాన్ని నిర్మించు కొందాం .


No comments:

Post a Comment