Search This Blog

Tuesday 3 June 2014

డబ్బు జబ్బు చేసిన ఎలచ్చన్ లు

రాజకీయాల్లో ఎంతో సులువుగా డబ్బు సంపాదించవచ్చునని 2004 తర్వాత రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం చేసి చూపించింది. ఒక రాష్ట్ర ముఖ్య మంత్రిగా ఇంత  భారీ స్థాయిలో అవినీతి ఊడ లు దింపి వ్యవస్థలను అల్లకల్లోలం చేయ వచ్చా అనేది అందరికీ అర్ధం కాని విషయం . భారత  దేశ అవినీతి చరిత్రలో ఓ రికార్డ్ . 
ఇప్పుడు  అదే అందరికీ ఆదర్శంగా మారింది. అధికారం ఉంటే విచ్చలవిడిగా డబ్బు సంపాదించవచ్చునన్న ఉద్దేశంతో ఎన్నికల్లో అంతే విచ్చలవిడిగా ఖర్చు చేశారు. 
తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాద్ పరిసరాల్లో ప్రభుత్వ భూములు దండిగా ఉన్నాయి. కనుక ఏవో దందాలు చేసి డబ్బు సంపాదించవచ్చునని తెలంగాణ నాయకులు ఆశ పడుతుండవచ్చు. ఆంధ్రప్రదేశ్‌లో అటువంటి అవకాశం లేదే? ప్రభుత్వ ఆదాయం చూద్దామా అంటే లోటు బడ్జెట్‌తో దినదిన గండంగా బండి నడపాల్సిన పరిస్థితి. 
మరి ఎందుకు సీమాన్ధ్రలో కూడా ఇంట భారీగా ఖర్చు పెట్టారు ? 

No comments:

Post a Comment