Search This Blog

Friday 30 May 2014

రాజధాని పరం గా ,ఆదాయం పరం గా ,కాలేజీ సీట్ల పరం గా ,ఉద్యోగాల పరం గా ,విద్యుత్ కేటా యింపుల పరం గా ,ఆస్తులు అప్పుల పంపకాల పరం గా సీమాంధ్ర రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని సరిదిద్దండి ...

  • సెక్రటేరియట్ లో రాష్ట్ర కేడర్ పోస్ట్ లు ఎన్ని ఉన్నాయి ? కేవలం 4417 పోస్ట్ లు .
  • మొత్తం సంయుక్త రాష్ట్రం లో  రాష్ట్ర కేడర్ పోస్ట్ లు ఎన్ని ఉన్నాయి ? 90000 పోస్ట్ లు .
  • అన్ని పోస్ట్ ల లో ఉద్యోగులు ఉన్నారా ? లేరు . 27000 పోస్ట్ లు ఖాళీగా ఉన్నాయి .నికరం గా 47186 రాష్ట్ర కేడర్ ఉద్యోగులున్నారు . 

  • రాష్ట్ర కేడర్ ఉద్యోగులను ఎలా విభజించారు ? 24838 ఉద్యోగులను ఇప్పుడు ఎక్కడ ఎలా పనిచేస్తూ న్నారో అలాగే ఉంచారు . 12,361 మందిని కొత్త ఆంధ్రా కి , మిగతా  9,987 మందిని తెలంగాణా కి పంచారు . అంటే జనాభా ప్రాతి పధికన 58:42 నిష్పత్తిలో పంచారు . అనగా సుమారు 25000 మంది రాష్ట్ర కేడర్ ఉద్యోగులకు కొత్త ఆంధ్ర రాజధానిలో నివాస సౌకర్యాలు ఏర్పరచాలి . 

  • మొత్తం సంయుక్త రాష్ట్రం లో  ఎంత మంది ఉద్యోగులు ఉన్నారు ? 11 లక్షలు .
  • లోకల్ -నాన్ లోకల్  అని ఎలా నిర్ణ యిస్తారు ? వరుసగా 4 ఏళ్ళు ప్రాధమిక విద్య ( 4 నుండి 10 క్లాస్ వరకు) ఎక్కడ చదివితే ఆ ప్రాంతానికి చెందినా వారిగా గుర్తిస్తారు .
  • నేటివిటి -స్వస్థలం ఎలా నిర్ణ యిస్తారు ? పుట్టిన ప్రదేశాన్ని బట్టి . తెలంగాణా ఉద్యోగులు నేటివిటి ని బేస్ చేసుకొని విభ జించ మంటుంటే ,సీమాంధ్ర ఉద్యోగులు లోకల్ స్టేటస్ ని బట్టి విభ జించ మంటున్నారు .
  • రాజధానిలో ఎన్ని రకాల రాష్ట్ర కేడర్ పోస్ట్ లు / ఉద్యోగులు ఉంటారు ? 
సెక్రటేరియట్ , డైరెక్టరేట్ ,కార్పోరేషన్ లకు సంబంధించిన వారు .
  • సీమాంధ్ర ఉద్యోగులు ఎందుకు బాధ పడుతున్నారు ?
10ఏళ్ల పాటు హైదరాబాద్ లో ఉండే అనుమతి ఉన్నా , కొత్త సీమాంధ్ర ముఖ్య మంత్రి వేరే చోట రాజధాని నిర్మాణం చేస్తే , సొంత ఇళ్ళు వదిలేసి కొత్త రాజ ధాని కి  వెళ్లి పోవలసిందే అని .

జనాభాని బట్టి ఆస్తులు అప్పులు పంచారు . కానీ విద్యుత్ ని మాత్రం వాడకాన్ని బట్టి పంచుతున్నారు ! ఇదెక్కడి న్యాయం ? 
ప్రస్తుతం ఉత్పత్తి అవుతున్న 16000 MW విద్యుత్ మరియు కొత్తగా రాబోయే విద్యుత్ ప్రాజెక్ట్ ల ద్వారా ఉత్పత్తి అయ్యే 4000 MW ల విద్యుత్   లో 54 % తెలంగాణ కి ,46% ఆంద్ర కి ఇస్తున్నారు .
అలాగే అంతర్ రాష్ట్ర కరెంటు సరఫరా ని ఏ  విధం గా ఆజమాయిషీ చేయాలో కేంద్రం చెప్పడం లేదు . ఇది ఇరు రాష్ట్రాల మధ్య గొడవలకు దారి తీస్తుంది . 

అటు విద్యా సంస్థ ల పంపకాలలో కూడా ఆంద్ర కి అన్యాయం జరుగుతుంది . 

ఇప్పటికే తెలంగాణా లో ఉన్న అంతర్జాతీయ   స్థాయి   విద్యా సంస్థలు - ISB,NALSAR,NIFT ,ICFAI  -లాంటివి కొత్త సీమాన్ధ్రలో ఏర్పరచా లంటే ఎంతో  సమయం,డబ్బు కావాలి .

కాంగ్రెస్ పార్టీ చేసిన దుర్మార్గపు తప్పుకి చెల్లించిన మూల్యం అధికారం కోల్పోవడమే . కానీ రెండు రాష్ట్రాల తెలుగు ప్రజల మధ్య రాచేసిన రావణ కాష్టం కారణం గా , త రతరాల తెలుగు సోదరుల బతుకు బండ లవుతుం ది.
ఇది రాజకీయ నాయకుల వికృత క్రీడ . 

No comments:

Post a Comment