Search This Blog

Saturday 10 May 2014

దరిద్ర దోపిడీ భారతం లో కొన్ని కోలా వెర్రి ప్రశ్నలు ...

మన దేశంలో  బంగార మే , కాదు బంగారు మనుషులున్నారు . అవును నల్ల బంగారం ,నల్ల నోట్లు అన్నీ కలిపి స్విస్ బాంక్ ల్లో దాచి దేశాన్ని అడ్డం గా నిలువు గా కోసుకు తింటున్నారు .
ఆదాయ పన్ను లెక్కల ప్రకారం , 120 కోట్ల భారత దేశం లో కేవలం 600 మంది కి మాత్రమే 100 కోట్ల పైబడి సంపద ఉంది .

మన దేశం లో 30కోట్ల మంది రైతులు పండించే పంటని ,అమెరికాలో కేవలం 9లక్షల రైతులు పండిస్తున్నారు .
రైతుకి కేజీ చె రకుకి 2/-రూపాయలు ఇచ్చి ,పంచదారని 40కేజీ /- కి అమ్ముతున్నా
ఎప్పుడో బ్రిటిష్ వాళ్ళు పెట్టిన భూ స్వాదీన చట్టముతో రైతుల భూమి లాక్కుం టున్నా
ఏటా అర లక్ష రైతులు ప్రాణాలు తీసుకొంటున్నా
రైతుల పేరు చెప్పి బాంక్ లకు, శీతల గిడ్డంగులకు లక్షల కోట్లు దోచి పెడుతున్నా ----
                    మన రైతులు, ప్ర భుత్వాలను ఎందుకు నిలదియ్యరు? 

 పనిచేసే సత్తువా ఉన్న 30కోట్ల మంది  పనీ, పాటా - ఉద్యోగం, సద్యోగం లేదు .
రోజు కి  కనీసం  10రూపాయలు సంపాదన లేని వాళ్ళు  ఇంకా 20కోట్ల మంది ఉన్నారు .
ప్రపంచ బాంక్ దృష్టి లో 75 కోట్ల మంది ఇండియన్స్ రోజు వారీ ఆదాయం 50 రూపాయలు కూ డా లేదు .
మురికి వాడ లలో ఇంకా 10కోట్ల మంది కునారిల్లు తున్నారు .
(As per Multi-dimensional Poverty Index (MPI), About 645 million people or 55% of India’s population is poor as measured by this composite indicator made up of ten markers of education, health and standard of living achievement levels.)

మరి , ఏటా 100 రోజుల ఉపాధి హామీ పధకం పేరుతో 50 వేల కోట్లు ,
ఉచిత ఆహార పధకం పేరుతో లక్ష కోట్లు -ఖర్చు పెడుతున్న ప్రభుత్వ సొమ్ము ఏమవు తుంది ? 

 మన దేశ రుణాలు ,జాతీయ స్థూల  ఉత్పత్తి ని మించి పోతున్నా ,
హవాలా ద్వారా   దేశం దాటి న  నల్ల డబ్బు పార్టిసి పేటరీ నోటు  రూపం లో తెల్లగా మారి షేర్ మార్కెట్  కి వస్తున్నా ---- 
స్విస్స్ బాంకు ల్లో మూలుగుతున్న భార తీయుల దొం గ  డబ్బు  సుమారు 1500 బిలియన్ డాలర్ లు ఎప్పు డ య్యా  స్వాధీనం చేసు   కొంటారు ? 


No comments:

Post a Comment