Search This Blog

Monday 12 May 2014

రైతన్న లారా ఏకం కండి

మనదేశం బాగు పడా లన్నా , మన రైతు సుఖ పడా లన్నా రైతులందరూ గ్రామీణ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు సంఘటితం అవ్వాలి . 

గ్రామీణ రైతు సంఘం తో , ప్రభుత్వమూ ,ప్రైవేట్ సంస్థలు కలిసి  చేయవలసన కనీస విధి విధానాలు . 

1గ్రామీణ  విత్తన శుద్ది ,విత్తన విక్రయ కేంద్రాలు
2. గ్రామీణ ధాన్యం గిడ్డంగులు
3. గ్రామీణ ధాన్యం నాణ్యతా పరీక్ష మరియు రాష్ట్ర వ్యాప్త మార్కెట్ ధర వరలు తెలిపే అంతర్జాల కేంద్రం
4. మొబైల్ ధాన్య విక్రయ వాహనం  - రైతు కల్లం వద్ద కే విక్రయ వాహనం వచ్చి ,అక్కడే ధాన్య నాణ్యత  పరీక్ష చేసి , రైతుకి మార్కెట్ ధర ,ప్రభుత్వ ధర గురించి అవగాహన కలుగ చేసి చెల్లింపులు కూడా అక్కడే పూర్తీ చేయాలి .
5. ఆయా గ్రామాలలో ఏ రైతు దగ్గర ఎంత ధాన్యం ఏ ఏ ధరకి కొనుగోలు చేసిందీ పూర్తీ వివరాలు ఎప్పటికప్పుడు రాష్ట్ర సర్వర్ కి ఫీడ్ చేయాలి .
6. ప్రక్రుతి సేద్యం , ఆర్గానిక్ సేద్యం , సాగునీటి పొదుపు ,జీవాల పెంపకం , పంట మార్పిడి ,వాణిజ్య పంటల సాగు ,సమగ్ర వ్యవసాయ పద్దతులు మొదలగు ప్రక్రుతి సమతుల్యతా విధానాలను (cost effective and ecosafe methods) ప్రతి రైతుకి చేలోనే శిక్షణ ఇచ్చే వ్యవస్థని ఏర్పాటు చేయాలి .
7. రైతు పండించే పంటలో 30శాతాన్ని ఇతర దేశాలకు ఎగుమతి చేసు కొనే వెసులు బాటు ప్రభుత్వం , ప్రైవేట్ సంస్థల భాగ స్వామ్యం తో కలుగ చేయాలి .
8. ప్రతి గ్రామంలో ఆయా పంటల ఉత్పత్తులకు విలువ జోడించే(value addition) కుటీర పరిశ్రమలు - కారం,ధాన్యం ,పిండి ,పప్పుల మిల్లులు ,బెల్లం ,ఖండసారి , ప్రత్తి జిన్నింగ్ ,మొక్కజొన్న వలిచే యంత్రాలు , తృణ  ధాన్యాలను శుభ్రం చేసి ప్యాక్ చే యడం .
9. ప్రతి విద్యార్ధి 30రోజులు వ్యవసాయంలో ప్రత్యక్షం గా పాల్గొనాలి .
10.ప్రతి  కాలేజీ ఒక గ్రామాన్ని దత్తత తీసుకొని పై న చెప్పుకొన్న విధి  విధానాలు సవ్యం గా అమలు అయ్యే టట్లు మానిటర్ చేయాలి .

No comments:

Post a Comment