Search This Blog

Friday 2 May 2014

క్షత్రియ భారతం -మొదటి భాగం .

 సనాతన భారతావని లో  వేద కాలం లో 'కులము' అనే పదం లేదు . ఉన్నదల్లా వర్ణ మే . వర్ణ మనేది ఆయా మనుషుల గుణాలు , చేసే వ్రుత్తి ,ప్రవ్రుత్తి పైన ఆధారపడి యుండేది . అది కర్కశమ్ గా ఉండేది కాదు . శూ ద్ర వృత్తిలో ఉన్నా  వాడి సంతానం బ్రాహ్మణ్యం చేసుకోవచ్చు . వైశ్యుడు క్షత్రియుడి గా మార వచ్చు .
  • ప్రజలను కన్న  బిడ్డల మాదిరి పాలించి కాపాడే వాడు క్షత్రియుడు . 
  •  ఎలా బతికితే సుఖ సంతోషాలు ఉంటాయో  బుద్ది చెప్పి,పరానికి పనికొచ్చే ధర్మాలను చెప్పే వాడు బ్రాహ్మణుడు . 
  • అవసరాలకు కావలసిన వస్తు సామగ్రిని పైకానికి అందించే వాడు వైశ్యుడు . 
  • పాడి  - పంట పండించి , పనులు చేసే వాడు శూద్రుడు . 
  • పరం కోసం ,సత్య శోధనకి మౌనం గా తపం చేసుకొనే వారు మునులు . 
  • శాస్త్రాలను శోధించి , నిజాలను కనిపెట్టి సామాన్యులకు వాటి ఫలాలను అందించే వారు ఋషులు . 
  • విద్య అంగడి సరుకు కాదు . 
  • అన్నం అమ్మే వస్తువు కాదు . - ఇదీ వేద కాలం నాటి సంఘ స్థితి . 
భారత వర్షం అంటే అటు రష్యా లోని ఓల్గా నదీ తీరం నుండి ఇటు మధ్య ఆసియా లోని టైగ్రిస్ యూఫ్రటిస్ తీరాలను చుట్టి  మన గంగా సింధు సరస్వతీ మైదానాల మీదుగా గోదావరి,కావేరి దాటి అటు బ్రహ్మ పుత్రా , బర్మా లోని ఇరావతి , ఇండోనేసియా లోని బాలి ,కాలిమంతాన్ నదుల మీదుగా కంబోడియా లోని మెకాంగ్ నది వరకు వ్యాపించి ఉన్న మహా ప్రాంతం .

ద్వాపర యుగపు ఆఖరి రోజులు . కలియుగం ఆరంభం లో జరిగిన మహా భారత యుద్ధం లో సమస్త భూమండలమ్ లోని క్షత్రియులు నశించి  పోగా ,బతికిఉన్న సైనికులు ,దళపతులు చిన్న చిన్న జన పదాలను ఆక్రమించుకొని రాజులుగా చెలామణీ అయ్యారు . కానీ వారికి రాజ నీ తి లో గానీ , రాజ ధర్మం పై గానీ ప్రవేశము లేదు . పట్టు లేదు .
బలవంతుడే రాజు . తెలివున్న వాడే అధికారి . కాస్త కండ ఉన్నోడే బంటు . 

 ఎప్పుడైతే రాజ ధర్మం నశించి , ఒక ధర్మం , పద్దతి లేని మనుషులు రాజులుగా - పాలకులుగా మారి రాజ ధర్మం తప్పి నప్పుడు , అలాగే సంఘం లోని ఇతర  వర్ణాల వారు కూడ ఆయా సంఘ నియమాలు పాటించ నప్పుడు ,బ్రాహ్మణ వర్ణం వారు తిండికి మాడి పోయారు . అప్పుడు ,కొందరు బ్రాహ్మణులు పొట్టకోసం అనేక నియమ నిష్టలు , వేద ప్రామాణికం కాని  క్రతువులు , మూడ నమ్మకాలు ప్రచారం చేసి ,వేదము లోని మర్మాలను ,జ్ఞానాన్ని కప్పిపుచ్చడానికి అవాకులు చెవాకులు ప్రవేశ పెట్టారు .
బ్రాహ్మణులు తప్ప మరే ఇతర వర్ణం వారు వేదాలు చదవకుండా అలాగే జ్ఞాన విజ్ఞాన ధార అందరికీ అందకుండా ఎన్నో తప్పుడు పనులు చేశారు .
ఎప్పుడైతే జ్హ్నాన  ధార పది మందికీ అందకుండా పోయిందో అప్పుడే భారత జాతి జవజీవాలు ఉడిగిపోయాయి .
ఒక జాతిని నిర్వీర్యం చేయా లంటే వారిని చంప వలసిన పని లేదు . వారికున్న జ్ఞాన సంపదను వారి తర్వాతి తరాలకు అం ద కుండా చేస్తే చాలు . 
విద్య లేని వాడు వింత పశువు అనే సామెత అలా వచ్చిందే . 
బల వంతపు మత మార్పిడులు చేసి భుజాలు చరచు కొనక్కర లేదు . 
మత గ్రంధాలను  అంద  కుండా  చేస్తే చాలు -ఆ మతం క్రమేణా కనుమరు గవుతుం ది. 

శాస్త్రాలు , వేదాలలోని నిజాలను మరుగు పరిచి కర్మ కాం డలు ప్రవేశ పెట్టి ఆనాటి జీవ సంపదను -గోవులు,మేకలు,బర్రెల ను -దానము రూపమ్ లో లేదా హోమ క్రతువుల బలి రూపం లో స్వీకరించే వారు .
సంఘ శాంతికి తోడ్పడ వలసిన వారి జ్ఞానం పక్క దారి పట్టి మొత్తం సంఘాన్ని బ్రష్టు పట్టించింది . విద్యని అమ్మకానికి పెట్టినది అప్పుడే .

మహా భారత యుద్ధం మొత్తం జాతిని, అప్పటికే బ్రష్టు పట్టిన వ్యవస్థను నాశనమ్ చేసింది .

పాలించే వారి ఆకృత్యాలు మితి మీరినప్పుడల్లా  భగ వంతుడు ఏదో ఒక రూపమ్ లో వచ్చి లెక్క సరిచేస్తాడు .

వేద కాలం నుండి క్షత్రియ ,బ్రాహ్మణ వర్ణాల మధ్య జరుగుతున్న ఆధి పత్య  పోరులో జరిగిన  సంఘటనలు భారత దేశ చరిత్ర ని రకరకాలుగా మార్చి వేశాయి .
సమాజం లో రెండు వర్గాల మధ్య పోరు నాడు ఉంది . నేడు ఉంది .ఎప్పుడూ ఉంటానే ఉంటుంది .
వేద కాలంలో  మొదటి స్థానం లో ఉన్న క్షత్రియులు క్రమం గా రెండో స్థానానికి జారారు . ఋగ్వేద కాలం లో పుట్టుకతో కాక , గుణాలను బట్టి వర్ణం ఉండేది .

త్రేతా యుగం లో పరశురాముడు క్షత్రియ వంశాలను సమూలము గా నిర్మూ లించిన తర్వాత ఏర్పడిన అరాచకాన్ని అరికట్టే టందుకు చేసిన హోమాగ్ని నుండి 4 రాజపుత్ర వంశాలు -పరమార్ ,చౌహాన్ , ఉద్భ వించాయి . వీరే రాజపుట్ క్షత్రియులు లేదా అగ్ని వంశ క్షత్రియులు .

ఆం ధ్ర  క్షత్రియులు :

క్రీస్తుశకం 2వ శతాబ్దం లో శాతవాహనుల  తర్వాత  ఉత్తరా పధ మునకు చెంది కాలక్రమం లో దక్షిణా పదానికి వలస వచ్చిన  ఇక్ష్వాకులనే వారు, వారి  రాజ్యాలను  కృష్ణా నదీతీరమైదానాలలో స్థాపించారు . నాగార్జున కొండ రాజధానిగా భట్టిప్రోలు ,జగ్గయ్య పేట ,అమరావతి ప్రాంతాలను పాలించారు .
వాయు పురాణమ్ ప్రకారం ఇక్ష్వాకు 100 మంది సంతానం లో 48 మంది దక్షిణా పదానికి వలస వచ్చి చిన్న చిన్న రాజ్యాలు స్థాపించు కొన్నారు .
 బౌద్ద జైన సాహిత్యాన్ని తిరగేసినా ,అస్మక ,ములక,వేంగి రాజ్యాలు, వీరు స్థాపించిన వే .

ఇక్ష్వాకుల తర్వాత శాలంకాయనులు పల్లవ సామంతులుగా కృష్ణా గోదావరి ప్రాంతాన్ని పెదవేగి రాజధానిగా పాలించారు . వీరి తర్వాత విష్ణుకుండినులు, మిగతా క్షత్రియ వంశా లైన పరిచేది ,కోట , చాళుక్యలు గుంటూరు గోదావరి ,కృష్ణా సీమలను 300 ఏళ్ళ  పాటు పాలించారు .(5 నుండి 7 శతాబ్దం వరకు ).

చంద్ర వంశ క్షత్రియులైన తూర్పు చాళుక్యులు నే వేంగి చాళుక్యులు గా  పిలిచే వారు . వీరు పూర్వమ్   శాతవాహనులకు సామంతులు గా ఉండే వారు . వీరు ఎలమంచిలి , పిఠాపురం , ముదిగొండ ప్రాంతాలను పాలించారు .

మత్స్య రాజులు ముఖ్యం గా మత్స్య ప్రాంతం అనగా నేటి ఒరిస్సా కి చెందినా వారు .

చేది రాజులు కోణ ప్రాంతం అనగా నేటి కోన సీమ ని పాలించారు . తర్వాత కాలం లో చాళుక్య చోళ రాజులకు సామంతులుగా మారి చోడ రాజులుగా వ్యావహ రింప బడ్డారు . వీరి గోత్రం కాశ్యపస .

కాలచూరి,హైహేయ రాజులు మధ్య భారతానికి చెందినవారు .

ధనంజయ గోత్రీకులైన కోట వంశపు రాజులు ధరణికోట ని రాజధానిగా చేసుకొని 11,12 శతాబ్దం లో పాలించారు .

చాగి లేదా సాగి వంశ రాజులు చాలా కాలం చాళుక్యులకు సామంతులుగా ఉండి పోయారు .
ఆ తర్వాత కాకతీయులు , తర్వాత విజయనగర రాయలు పెద్ద రాజ్యాలు పాలించారు . కానీ వీరు క్షత్రియ వర్ణం నకు చెందినవారు కాదు .

No comments:

Post a Comment