Search This Blog

Friday 19 September 2014

తల్లి తెలంగాణా కూడా భరత మాత బిడ్డే

 9 జిల్లాల తెలంగాణ లో 80 లక్షల కుటుంబాలు , 3కోట్ల జనాభా ఉన్నారు . 
ఉమ్మడి రాజధాని హైదరాబాద్ లో 20 లక్షల కుటుంబాలు ,75 లక్షల జనాభా ఉన్నారు . 
శ్రీ కే .సి . ఆర్ . గారు ఆంద్ర సెట్లర్స్ పట్ల వివక్ష, ఆంధ్ర పెట్టుబడి దారుల పట్ల వైముఖ్యం ,
అలాగే దేశ రాజ్యాంగం పట్ల హేళన , అలుసు -- ఇలాగే కొ న సాగిస్తే హైదరాబాద్ ని కేంద్ర పాలిత ప్రాంతం గానో  లేదా ప్రత్యేక రాష్ట్రం గానో  మార్చమని హైదరాబాద్ వాస్తవ్యులందరూ ముక్త కంటం  తో గళం విప్పే రోజు  అతిత్వరలో నే వస్తుంది .

తెలంగాణా ప్రజలందరూ మేల్కొని తమ నాయకులను అదుపులో పెట్టు కోవలసిన అవసరం చాలా ఉంది .
మనం భారతీయులమని,మన ఫెడరల్ వ్యవస్థ లో జెండాని , రాజ్యాంగా న్ని గౌర వించాలని  మరిచి పోతే అంత  కన్నా దౌర్భాగ్యం ఉండదు .

నిజాం నవాబులు దేవుళ్ళని , రజాకర్ల వలనే తెలంగాణా అభివృద్ధి చెందిందని ,
తెలంగాణా పోరాటం ఎంత సబబో కాశ్మీర్ పోరాటం అంతే సబబని --- డంకా వాయించి చెబుతున్నా కేంద్రం నిమ్మకు నీరెత్తి నట్లు గా మిన్న కుండటం చాలా ప్రమాదకరం .
దేశానికి ,ప్రపంచానికి తప్పుడు సంకేతాలు వెళ్ళకుండా అదుపు చేయ వలసిన బాధ్యత కేంద్రానిదే . 

No comments:

Post a Comment