Search This Blog

Wednesday 3 September 2014

తస్మాత్ జాగ్రత్త

   అందరూ ఉహిస్తు న్నట్లు విజయవాడ ప్రాంతం హైదరాబాద్ లాగా భూమికి సమాంతరం గా వ్యాపించదు .
ఎందు కంటే కొత్తగా  భారీ పరిశ్రమలు వచ్చే అవకాశం లేదు .
నదీ తీరానికి ఎదురుగా ప్రభుత్వ భూము లున్న చోట ,బహుళ అంతస్తుల ప్రభుత్వ పరిపాలనా భవనాలు,
రాష్ట్ర స్థాయి ఉద్యోగులకు ఇళ్ళు ,కొన్ని విద్య, విద్యాలయాలు వస్తాయి .

గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం గా అభివృద్ధి చెందా  లంటే డబ్బు ఒక్కటే సరిపోదు ,
సరిపడా ప్రయాణికుల డిమాండ్ ఉండాలి .
అంతర్జాతీయ స్థాయి సంస్థలు ఉన్నప్పుడే అది సాధ్య పడుతుంది .

అటు రాయల సీమ,ఇటు విశాఖ ప్రాంతాలు ఉద్యోగ కల్పనలో ,పరిశ్రమల స్థాపనలో  దూసుకు పోతాయి .
ముఖ్యం గా ఐ. టి .,ఫార్మా ,సినీ పరిశ్రమలు విశాఖ లోనూ ; హార్డ్ వేర్ ,సాఫ్ట్ వేర్ ,ఇతర భారీ పరిశ్రమలన్నీ బంగలొర్ కి ,మద్రాస్ కి దగ్గరున్న అనంతపురం , చిత్తూర్ ,తిరుపతి,కర్నూల్ ప్రాంతాలలో స్థా పించే అవకాశాలు హెచ్చు గా ఉన్నాయి .
విజయవాడ ,గుంటూరు ప్రాంతాలు కేవలం పరిపా లనా విభాగాల కే పరిమితమవుతుంది . అంటే నివాస స్థలాలకు డిమాండ్ పెరుగుతుంది . సుమారు 10వేల మంది ఉద్యోగులు కొత్తగా రాజధానికి వస్తారు ,కాబట్టి అపార్ట్మెంట్ ల కు అద్దెలు పెరుగుతాయి .
ఏది ఏమైనా ,హైదరాబాద్ మాదిరి వత్తిడి ఉండదు .
అనవసర మైన స్పెక్యు లేషన్ తో దళారులు  రియల్ ఎస్టేట్ బుడగ ని అమాంతం గా
పెంచు  కొంటూ పో తున్నారు .
విజయవాడ కి 20 కిలోమీటర్ ల దూరం లో  ఎకరా భూమి సుమారు
6 నుండి 10 కోట్లకి పెంచి చెబుతున్నారు . అంటే ,గజం 25000/-లెక్కన
అమ్ముదామని చూస్తున్నారు .
ఇలాగే ప్రజలు వ్యవహరిస్తే ,ఇప్పుడు భూములపై  పెట్టుబడి పెట్టే వాళ్ళు నిండా మునుగుతారు . 

No comments:

Post a Comment