Search This Blog

Sunday 31 August 2014

మోడీ మాజిక్

తొలి 100 రోజు ల్లో కొత్త ప్రధాన మంత్రి మన దేశానికి చేసిన పని ,
 దిశా నిర్దేశం ఎలా ఉంది ?

1. ఇంతదాకా చిన్న చిన్న ఉద్యోగులకే పరిమిత మైన  అనగా కేవలం  రూ.6,500 లోపు జీతం ఉన్న ఉద్యోగుల కే అవకాశ మున్న EPF, ఇప్పుడు ప్రభుత్వ తాజా నిర్ణయం వల్ల ఈ పరిమితి రూ.15,000కు పెరుగుతుంది. దీనివల్ల పదవీ విరమణ చేసిన ఉద్యోగుల నెలవారీ పెన్షన్‌లో కూడా పెరుగుదల ఉంటుంది.  EPF అంటే పదవీ విరమణ సమయానికి కొంత డబ్బు చేతికి వచ్చి, ఆ తర్వాత నెలవారీ పించన్ సౌకర్యం పొందడానికి ప్రతి ఉద్యోగీ తన జీతం లో కొంత భాగం మరియు యజమాని కూడా అంతే మొత్తాన్ని ప్రతి నెలా ప్రభుత్వ భవిష్య నిధి అనే పొదుపు ఖాతా లో పెడతారు . ఉదాహరణకు , 6500/- జీతం ఉన్న ఉద్యోగి తన వాటా గా  రూ.780 + అంతే మొత్తాన్ని యజమాని తన వాటాగా EPF  లో జమ చేస్తున్నారు. ఇప్పుడు 15000/జీతగాడు 1800/- + అంతే మొత్తాన్ని యజమాని తన వాటాగా EPF  లో జమ చేస్తారు . 

2. ఉ ద్యోగుల డిపాజిట్‌ మొత్తంతో అనుసంధానించిన బీమా (ఈడీఎల్‌ఐ) పథకం కింద ప్రస్తుతం అందిస్తున్న ప్రయోజనం సైతం ఇకపై రూ.1.56 లక్షల నుంచి రూ.3.6 లక్షలకు పెరగనుంది . 

3. ఇ న్నాళ్లూ చాలీ చాలని పింఛనుతో కాలం వెళ్లదీస్తున్న బడుగు కుటుంబాలకు పెద్ద ఊరట. చిరుద్యోగులుగా రిటైరై, కేవలం మూడు నాలుగు వందల పింఛనుతో అష్టకష్టాలు పడుతున్న మాజీలకు ఇకపై నెలకు కనీసం వెయ్యి రూపాయల మొత్తం పింఛనుగా అందనుంది. అలాగే భర్తను కోల్పోయిన వారికీ ఇకపై వెయ్యి రూపాయల గౌరవప్రదమైన పింఛను మొత్తం చేతికి రానుంది.
4. జన ధన యోజన :సామాన్యుడిని కూడా ఆర్ధిక ప్రగతిలో కలుపు కొని పోవడానికి ,ప్రతి భారతీయుడికీ ఒక బాంక్ ఖాతా ఉండాలని ,దానిద్వారా ప్రభుత్వ సంక్షేమ పధకాలకు సంబంధించిన నగదు బదిలీ ,ఉపాధి కూలీ, ఇంకా ఇతరత్రా సదుపాయాలూ , అలాగే కనీసం 5000/- అప్పు ,1లక్ష ప్రమాద భీమా ,ముందు ముందు ఆరోగ్య భీమా ,ఇంకా అనేక సదుపాయాలను ఎలాంటి దళారీల ,అధికారుల బెడద లేకుండా కల్పించ బడతాయి . 
   ఈ పధకం ద్వారా బాంక్ ఖాతాలు ,అలాగే ఎలాంటి బాంక్ అప్పులకు అర్హత లేని 
50 కోట్ల మందికి   కొత్తగా బాంక్ ఖాతాలు ఏర్పరు స్తారు . 

5.స్వచ్చ్ భారత్ :  దేశం లో సగం మంది అంటే  సుమారు 60 కోట్ల మంది  టాయిలెట్ లు వాడటం లేదు . సెల్ ఫోన్ లు మాత్రం వాడ తారు .  5ఏళ్లలో వీరందరికీ ప్రభుత్వ మే ఉచితం గా టాయి లెట్ లు కట్టాలని సంకల్పిం చింది . 
స్వచ్చ మైన శుద్ద మైన దేశమే  ఆరోగ్య ప్రదం  గా అభి వృద్ది చెందుతుంది . 

6.  వాణిజ్యం మె రుగుదలకోసం,ఐక మత్య అభివృద్ధి కోసం  పొరుగు దేశాలతో సఖ్యత . 

7. అగ్ర రాజ్యాలతో ముఖ్యం గా బ్రిక్స్ దేశాల సమాఖ్య లో కీలక పాత్ర, బ్రిక్స్ బాంక్ ఆవిష్కారం . 

8. ఫాస్ట్ ట్రాక్ పై వాణిజ్య ,పారిశ్రామిక ఉత్పాదకత అభివృద్ధి. 

9. ఉల్లి,ఆయిల్ , అలాగే అన్ని వస్తువుల రిటైల్ ధరల స్థిరీకరణ అతి పెద్ద విజయం . దీ ర్ఘకాలంలో ధరలను అదుపులో ఉంచేం దుకు ధరల స్థిరీకరణ నిధి.  

10.  కాశ్మీర్ పండిట్ ల కు పునరావాసం . 

11. డిజిటల్ భారత్ , 100 స్మార్ట్ సిటి పధకం, నల్ల ధానం వెలికి తీతకు సిట్ ,24/7 విద్యుత్ సరఫరా, 
జల,రోడ్,రైల్ పబ్లిక్ రవాణా  మెరుగుదల , రక్షణ పరికరాల ,రైలు వాగన్ ల తయారీలో విదేశీ పెట్టుబడుల కు స్వాగతం . 

12. మంత్రుల శాఖల పై ప్రధాన మంత్రి మంత్రి ఆఫీస్ కి పూర్తి  పట్టు . 

13.అనవసర దుబారా తగ్గించి నిర్ణయాలను వేగిర పరచడానికి మంత్రిత్వ శాఖల కుదింపు , మంత్రుల కమిటీల(GoM) రద్దు , ప్రణాలికా సంఘ రద్దు , ఆఫీస్ పని వేళ లను కటినం గా అమలు చేసి దస్త్రాలు త్వరగా కదిలే టట్లు చేయడం . 

14. అన్నింటి కంటే అతి ముఖ్యం -ప్రజలు అప్ప చెప్పిన బాధ్యతా ను ఎక్కడా ఎలాంటి తొందర లేకుండా ,హడావిడీ గందర గోళం కనబడ కుండా , సుక్షితుడైన సైనికుడిలా పధకాలను రచిస్తూ సాగిపోతున్న విధానం,గారంటీగా దేశానికి మంచి రోజులోచ్చాయనే నమ్మకం  కలిగిస్తుంది . 

No comments:

Post a Comment