Search This Blog

Tuesday 12 August 2014

వ్యవసాయ భారతం

స్వాతంత్రం వచ్చిన ప్పటి  నుండి ఇప్పటి వరకు  గణాంకాలు పరిశీలిస్తే , రైతులు(అనగా అంతో ఇంతో భూమి ఉన్న వారు) జనాభా లో 50% నుండి  25% కి తగ్గిపోయారు .
అంటే సంఖ్యా పరం గా 7 కోట్ల నుండి 12 కోట్ల కి  రైతులు పెరిగినా జనాభా పరం గా చూస్తే వారి శాతం సగానికి పడిపోయింది .

ఇదే కాలం లో ,రైతు కూలీలు అనగా వ్యవసాయ పై ఆధార పడి  పని చేసే వారు 20% నుండి క్రమం గా పెరుగుతూ ఇప్పుడు 30% ఉన్నారు . అంటే  రైతు కూలీలు సుమారు 3 కోట్ల నుండి 14 కోట్లకు పెరిగారు .

అంటే మన దేశం లో రైతులు క్రమం గా తమ భూములను కోల్పోయి , రైతు కూలీలుగా ఆర్ధిక నిచ్చెన లో క్రిందకు జారి పోతున్నారు .

గడిచిన దశాబ్దం లో ముఖ్యం గా కాంగ్రెస్ పాలించిన 10 ఏళ్లలో  కొత్తగా 4 కోట్ల మంది, ఆర్ధిక స్థితులు దిగజారి రైతు కూలీలు గా మారారు .
మొత్తం మన రైతు మరియు రైతు కూలీల సం ఖ్య 26 కోట్లు మాత్రమే . అంటే జనాభా లో కేవలం 22% వ్యవసాయ రంగం లో పని చేస్తున్నారు .

వ్యవసాయం రంగం తో పాటు అనుబంధ శాఖ లైన పౌల్ట్రీ ,చేపలు ,డైరి ,పూలు పండ్ల  రంగం కూడా లెక్కిస్తే 60 కోట్ల మంది వీటి పై ఆధార పడి  ఉన్నారు .

No comments:

Post a Comment