సనాతన భారతీయం
"వర్ణ వ్యవస్థ మూలాన మనదేశం 2వేల యేండ్లు వెనక్కి వెళ్ళింది. దాదాపు 80% ప్రజలకు విద్య లేకుండా చేసింది మనుస్మృతి ". - ఇలా ఎన్నెన్నో అబద్దాలను మిషనరీలు, ఫాస్టర్లు ప్రచారం చేస్తూ మనలోమనకే కయ్యం పెడుతున్నారు.
బ్రిటిష్ మరియు క్రైస్తవ మిషనరీలు సృష్టించిన తప్పుడు దురాగత సాహిత్యం ఆధారంగా మాట్లాడకండి.
హిందూ నాగరికత ప్రపంచంలో అన్ని నాగరికతల కంటే కూడా అన్ని విధాలుగా అభివృద్ధి చెందింది. మనది వెనకబడిన నాగరికత అయితే ప్రపంచంలోని ఎక్కడెక్కడి నుండో ఎన్నో శతాబ్దాలుగా ఇక్కడికి ఎందుకు వస్తారు? బెల్లం ఉన్న చోటికే కదా ఈగలు ముసురుతాయి. లండన్లోని బ్రిటిష్ ప్రభుత్వానికి ఆనాటి బ్రిటిష్ అధికారుల నివేదికల ప్రకారం, 18వ శతాబ్దంలో హిందువులలో అక్షరాస్యత 70% మించి ఉంది, ఇది ఆ సమయంలో బ్రిటన్ కంటే ఎక్కువ. దీనికి కారణం మన గుడులు మరియు బ్రాహ్మణులు. ప్రతి గుడి ఒక పాఠశాల. కులాతీతంగా అందరికి చదువు చెప్పే వారు. ఆ విద్యా వ్యవస్థను క్రైస్తవ మిషనరీల ప్రోద్బలంతో మెకాలే మరియు బ్రిటిష్ వారు నాశనం చేశారు. ధర్మపాల్ గారు రాసిన ది బ్యూటిఫుల్ ట్రీ చదవండి. అంగస్ మాడిసన్ రాసిన ది వరల్డ్ ఎకానమీ: హిస్టారికల్ స్టాటిస్టిక్స్ ప్రకారం, ఇస్లామిక్ పాలనకు ముందు భారతదేశం శతాబ్దాలుగా అత్యంత ధనిక దేశంగా ఉంది. 1 CE నుండి 10వ శతాబ్దం CE వరకు మన ప్రపంచ GDPలో మన దేశం యొక్క వాటా 28% నుండి 31% వరకు ఉంది. ఇదంతా కేవలం వర్ణ వ్యవస్థ వల్లనే సాధ్యమైంది. వర్ణ వ్యవస్థ అనేది మానవుల నైపుణ్యాలను , వ్యక్తిత్వాలను ఆధారం చేసుకొని సమాజంలో సమతుల్యత సాధించ డానికి ఉపయోగపడిందని ఆంథ్రో పాలజిస్ట్ లు కూడా ఒప్పుకొన్నారు. ముస్లింలు , ఆ తర్వాత క్రైస్తవులు మన నాగరికతను ధ్వంసం చేశారు. మన నాగరికతను ధ్వంసం చేసిన వారిని నిందించకుండా ఆత్మ నింద చేయడం సబబు కాదు.మన సనాతన ధర్మం పరబ్రహ్మ గురించి చెబితే, ఇతరమతాలు పరబ్రహ్మ అనే పదాన్ని అ + బ్రహామ్ (అబ్రహం) అని అపభ్రంశం చేశారు. ఇలా ప్రతిదీ అపభ్రంశం చేసుకొని వారి జీవితాలను ఎడారి పాలు చేసుకొన్నారు.
వాస్తవానికి సనాతన వేద కాలం లో ధర్మం తప్పిన వాళ్ళను వెలి వేసే వాళ్ళు. అలా వెలి వేయబడి సమాజం నుండి, రాజ్యం నుండి బహిష్కరింప బడినవాళ్లు వేరే ప్రాంతాలకు పోయి ఇలా వారికీ తెలిసిన వేద ధర్మాన్ని అప భ్రంశం చేసుకొని ధర్మానికి ,న్యాయానికి దూరంగా బతకడం అలవాటు చేసుకొన్నారు. వీరినే కాలక్రమేణా మ్లేచ్చులు " అనేవారు.
సనాతన ధర్మంలో స్త్రీ కి అత్యున్నత విలువ ఇస్తారు. కానీ ఈ ఎడారి మతాల లో స్త్రీని భోగ వస్తువుగా ,బానిస గా చూస్తారు.
వేద ధర్మం లో విగ్రహారాధన, మంత్ర సాధన, యోగ విద్య , శరణాగతి భక్తి , సత్య శోధన , ధర్మ విచారణ ఇలా పలువిధాలుగా ఎవరి మానసిక స్థాయిని బట్టి , అభిరుచిని బట్టి దైవారాధన జరుగుతుంది . అంతేకాదు, సహేతుకమైన ప్రశ్నలు,సమాధానాలు , శాస్త్రీయమైన సిద్ధాంతాలు, ఆయా సిద్ధాంతా లలో నిజమెంతో కనుక్కోవడానికి అన్వేషణలు, తపస్సులు , విశ్వం గురించిన ఉత్సుకత, ఇలా పరి పరి విధాలుగా వైదిక జీవనం ప్రశాంతంగా ఉండేది. లోకా సమస్తా సుఖినో భవంతు అనేదే వైదిక నినాదం .
వైదిక ధర్మం లో విధానాలు ఏవైతే ఉన్నాయో వాటికి పూర్తి వ్యతి రేకమైన జీవన విధానాన్ని ఆ మ్లేచ్చులు ఎంచుకొన్నారు. ధర్మం వదిలేసి అధర్మాన్ని పాటించడం అలవాటు చేసుకొన్నారు. అర్ధ ,కామాదులను కూడా మనిషిలా కాకుండా పశువులా సాధించుకొని అనుభవించడమే వీరి విధానం. మోక్షం అనే పదమే లేదు. ఊహా జనితమైన , మానసిక వికారాలైన స్వర్గ-నరకాలే వారికి పరమావధి .
ధర్మ బద్ధంగా జీవిస్తారో, అధర్మ విధానాలతో మ్లేచ్చ జీవి తాన్ని ఎంచు కొంటారో , ఆ స్వేచ్ఛ మనిషికి ఉంది.
No comments:
Post a Comment