Search This Blog

Friday 10 January 2014

వైకుంట ఏకాదశి పర్వ దినం .

ఓం నమో నారాయణాయ ... 
భారతీయ సనాతన ధర్మ ధారలో ముఖ్యమైన తిధి ఏకాదశి . అందునా ధనుర్మాసం లో వచ్చే ఏకాదశి ని ఉత్తర ద్వార దర్శిని గా ,ఆధ్యాత్మిక  సాధన లో చివరి మెట్టు ఐన విష్ణు పదాన్ని చేరడానికి సరైన సమయం  గా చెప్పు కోవాలి .
  సూర్య ,  చంద్ర గమనం ఆధారం గా  కాలాన్ని విభజించి , మనిషిని అతి సున్నితం గా ప్రభావితం చేసే  --- భూ వాతా వరణం , పీడనం ,ఉష్ణోగ్రత , భూ ఐయస్కాంత  శక్తి  , అలాగే సముద్రాలు ,ఓజోన్ పోర , మనిషి మానసం ,బుద్ధి ,కణాలలో క్రియలు,రక్త ప్రవాహం , క్రోమోజోమ్ ల విభజన , ప్రాణ శక్తి , శక్తి చక్రాలు ,ఇడా - పింగళ - సుషుమ్న ప్రవాహాలు ---- ఏ ఏ సమయం లో  ఇవన్నీ ఎలా ప్రభావితం చెందుతాయో తెలుసుకొని , సామాన్యులు ఆ యా సమయాలలో ఏ విధం గా ప్రవర్తిస్తే ఆరోగ్యం ,ఆధ్యాత్మికత వృద్ది పొందు తాయో  అవగాహన చేసుకొని , పండుగలు , నోములు ,వ్రతాల రూపంలో మనకు ఆచారాలు ఏర్పరిచారు .

ఈ రోజు మనలోని సుషుమ్నా ప్రవాహం ఉత్తేజిత మయ్యె సమయం .ఇదే  సమయం లో మనం చేయ వలసిన  ప్రాణా యామం ,మంత్రం జపం, ధ్యానం ఇవన్నీ చక్కగా జరగా లంటే కడుపు ఖాళీగా ఉండాలి . ఈ  క్రియనే ఉపవాసం అని ఋషులు చెప్పారు .

సంవత్సరం లో వచ్చే 24 ఏకాదశి రోజుల్లో కూడా సుషుమ్నా ప్రవాహం ఉత్తేజిత మవుతుంది . కానీ ,ఈ వైకుంట ఏకాదశి నాడు  సుషుమ్నా ప్రవాహం ఉత్తేజిత మవ్వడ మే కాదు , దాని ప్రవాహ దిశ ఉత్తర మార్గం , అనగా సహస్రారం వైపు పరుగు తీస్తుంది . అంతే కాదు , ఈ రోజు సుషుమ్నా మార్గం ముక్కోటి శక్తుల సంచయం గా మారే రోజు . కాబట్టి ప్రతి మనిషీ  ఈ అవకాశాన్ని వృధా పోనీయక , శరణా గతి తో ,ఎలాంటి అహమూ లేకుండా , నిరంతరం భగ వ న్నామ స్మరణ చేస్తే ,   సుషుమ్నా ప్రవాహం అత్యంత ఉధృత మై సహస్రారం వైపు ఉరుకుతూ సాగే క్రమం లో మనలోని శక్తి చక్రాలు శుభ్ర పడి చెడు కర్మ వాసనలు అన్నీ భస్మ మై మన కారణ శరీరం పునీత మవ్ తుంది .
భక్తి  ,కర్మ ,రాజ యోగులు అందరూ చివరికి జ్ఞానం పొంద వల సిందే . జ్ఞానమే మోక్షం .
మనస్సు,చిత్తం, అహంకారం పూర్తిగా అధిగమించి నప్పుడే సాధకులు జ్ఞానాన్ని పొందటం అనేది జరుగుతుంది . అలా జరిగే అవకాసం ఎక్కువగా ఉన్న సమయ మే ఏకాదశి.

మానవులు  వ్యవహారక మైన సులువు కోసం సూర్య చంద్రుల ఉదయ అస్తమానాలను , అవి ఆకాశం లో తిరిగే క్రమాన్ని విభజించి వాటికి గంటలు, నిమిషాలు ,సెకన్ లు గా పిలుచు కొంటున్నారు .
కాలమానం మనిషి అలవాటు చేసుకొన్న లెక్క.
మనస్సు ఉన్నంత సేపే కా లం లె క్కలు ఉంటాయి .

సూర్య మానం ప్రకారం ,మార్గ శీర్షం  లేదా పౌష్య మాసం లో శుక్ల పక్షం లో వచ్చే ఏకాదశి ని వైకుంట లేదా ముక్కోటి ఏకాదశి గా చెబుతాము .
సూర్య గమనాన్ని ,నక్షత్ర ముల  ను బట్టి సూర్య మానం ( 27  నక్షత్ర ము లు + సూర్యుడు ).
చంద్రుని హెచ్చు తగ్గు లను బట్టి ,(వీటికే 15 తిదులని పేరు ) చంద్ర మానం .

మన దైనందిన జీవితం లో జరుపు కొనే శుభ కార్యాలకు శుక్ల పక్షం మంచిది .
భగవదా రాధనకు ,హోమ ,వ్రత , నోము , యజ్ఞ క్రతువులకు కృష్ణ పక్షం మంచిది .

అందరూ  గుర్తుంచు కోండి . మీ పిల్లలకి చెప్పడం మరవకండి . 
 - పంచ కోశ శుద్దీ కరణ, తద్వారా  నిరంతర  శాంతి ,ఆనందం --- ఇదే  సనాతన భారత సంప్రదాయం -
 ప్రతి పండుగా  పంచ కోశ   పునీత    పర్వ దినమే .

శుభం కరోతి కల్యాణం ఆరోగ్యం ధన - సం పదా |
శ త్రు- బు ద్ధి-వినాశాయ దీ ప- జ్యోతిర్ -నమో స్తుతే  ||

No comments:

Post a Comment