Search This Blog

Tuesday, 21 May 2019

Who will win general indian elections 2019. - దేశాన్ని భగవంతుడు రక్షించు గాక!


మోడీ మళ్ళీ వస్తాడా? తన అబద్దాల సామ్రాజ్యాన్ని అప్రతిహతం గా విస్తరిస్తాడా? ప్రాంతీయ పార్టీలను చిదిమేసి, ప్రతిపక్షనాయకులపై వ్యక్తిగత కక్షలకు తెర లేపుతాడా? తుగ్లక్ చేష్టలకు అదుపు ఉండదా?యోగ ధ్యానాల మాటున అరాచకం జూలు విదిల్చుతుందా?  దేశ్ ఆర్థికస్థితి ఇంకా దిగజారి పోతుందా? నిరుద్యోగ సమస్య మరింతగా జడలు విచ్చుకొంటుందా ? ప్రజాస్వామ్య రాజ్యాంగ వ్యవస్థలు మరింతగా కీలుబొమ్మలుగా మారిపోతాయా? ప్రజాస్వామ్యాన్ని రక్షించుకునే మార్గాలు మూసుకుపోతున్నాయా? పెట్రోల్,నిత్యావసర వస్తువుల ధరలు కొండెక్కి కూర్చుంటాయా? నల్లధనం మరింతపెరిగి ఎన్నికలలో ధనప్రవాహం మరింతగా పెరుగుతుందా? హిందూత్వ , మైనారిటీ ల మధ్య  అగాధం మరింత పెరిగి సమాజం విచ్చిన్నం అవుతుందా? ఆంతర ఉగ్రవాదం పేట్రేగుతుందా? ప్రాంతీయ అసమానతలు పెరిగి దేశం చీలిపోతుందా?
సత్యమేవ జయతే! ధర్మో రక్షతి రక్షిత: అనే నినాదం మారిపోతుందా? భగవాన్ శ్రీరామ్ మతాంధుల చేతిలో ఒక ఆట బొమ్మలా మిగిలిపోతాడా? పవిత్ర గంగానది మరింతగా చిక్కి వడలి పోతుందా? కాలుష్య కాసారాలు మరింతగా పెరిగిపోతాయా?

దేశాన్ని భగవంతుడు రక్షించు గాక!
2019 INDIAN ELECTIONS.
BJP is going to be single largest party(217) and may form govt with the help of SIVASENA,NITISH,PASWAN,BJD PATNAIK, TRS,JAGAN,AKALIDALAND 30 OTHER SMALL PARTIES.

CONGRESS MAY REACH 100 MARK.

HINDI BELT&east india
BJP
Others
Madhyapradesh 29
20
9
Rajasthan 25
15
10
Gujrat 26
20
6
Uttarapradesh80
35
45 (BSP20+SP20+CONGRESS 5
Bihar 40
18+10(ALLIES)
12
Punjab 10
4+1(SAD)
5
Haryana 10
6
4
DELHI 7
4
3
UTTARAKHAND 5
3
2
North east 25
12+5(ALLIES)
8
West Bengal 42
10
32      (TMC)
Orissa 21
10 + 11 BJD
0
Total 320
157
136 (CONGRESS 64)
South 130
15(Karnataka) +15TRS+7JAGAN
93( TDP18+DMK37+CONGRESS 27+JDS4+COMMUNIST 6
Maharashtra 48
20+15(sivasena)
13 (Congress7+NCP6)
Other states 45
25
20
Total 545
217+63 = 281
252.

who will win in andhra pradesh 2019 ? ఆంధ్రాలో గెలుపు ఎవరిది ?

ఆంద్ర రాష్ట్రంలో మొత్తం ఓటర్లు : సుమారు 4కోట్లు. కానీ అధికారుల లెక్క అనగా మార్చి 2019లో ప్రకటించిన కొత్త లిస్టు ప్రకారం మొత్తం ఆంధ్రా ఓటర్లు . 3. 91 కోట్లు. వీరిలో పురుషులు: 1. 93 కోట్లు; మహిళలు : 1.97కోట్లు.  పురుషులకంటే సుమారు 4లక్షలు ఎక్కువగా మహిళా ఓటర్లు ఉన్నారు. 

వీరిలో 2019 లో కొత్తగా ఓటు హక్కు పొందిన యువత అనగా 18 ఏళ్ళూనింది 19 లోకి అడుగుపెట్టినవారు: 5లక్షలు.
ఏ కారణం చేతనైనా గానీ, సుమారు 22లక్షలమంది కొత్తగా ఓటు నమోదు చేసుకొన్నారు. 
ఏ కారణం చేతనైనా గానీ,1. 5 లక్ష ఓట్లు తీసివేయబడ్డాయి. 
ఏప్రిల్ 11  పోలింగ్ జరిగింది. ఈ ఎన్నికలలో , నిష్పక్షపాతం గా పనిచేయవలసియున్న ఎన్నికల కమిషన్ ఆశ్రిత పక్షపాతము , నిరంకుశ వైఖరి,అప్రజాస్వామిక వ్యవహారశైలితో అభాసుపాలవ్వడమేకాక, తెలుగుదేశం పార్టీని ,ఆంధ్రప్రభుత్వాన్ని హీనంగా చూసి ,ఇష్టం వచ్చినట్లు, కేంద్రప్రభుత్వాధిపతులు చెప్పినట్లు చేసింది. 
సుమారు 50000 బూత్ లలో 80% ఓట్లు పోల్ అయ్యాయి. కొన్ని చోట్ల రీ పోలింగ్ జరిగింది. సుమారు 10000 కోట్లు ఇరు పార్టీలు, ఆయా  అభ్యర్థులు ఖర్చుపెట్టినట్లు అనధికార సమాచారం. 
కుల మతాల వారీగా కాకుండా , వయస్సు,వృత్తి, సాంఘిక హోదా ,లింగ ము ప్రకారం ఓటర్లను వర్గీకరించి , పోస్ట్ పోలింగ్ సర్వే చేసి రాబట్టిన సమాచారం ఈ విధంగా ఉంది. 
యువత,అనగా 18 నుండి 30 ఏళ్ల వయస్సు గల ఓటర్లు (సుమారు కోటి ) మెజారిటీ 50% జగన్ కి ఓటేశారు. ఆ తర్వాత 15% పవన్ కి వేస్తె,మిగతా 35% బాబు కి వేశారు. యువత లో బాబు పై తీవ్ర వ్యతిరేకత ను గమనించాం. తద్వారా జగన్ బాగా  బలపడ్డాడు. వీరే గట్టి గొంతు తో జగన్ వస్తాడని తీవ్ర ప్రచారం కూడా చేశారు. 

"యువత  తీరు తెన్నులను  సూక్ష్మంగా పరిశీలిద్దాం. 

18 -35 యువ వయస్సు గల వర్గం మొత్తం 4కోట్ల  ఓటర్లలో  సుమారు  33%ఉంటుంది. అనగా 1.3 కోట్లు ఉంటారు. వీరిలో 18 నుండి 25 వయస్సు ఉన్నవాళ్లు కనీసం 60 లక్షలుంటారు.వీరినే ఎక్కువగా యూత్ " అని పిలుస్తాం. వీరిలో 50% జగన్ గారికి ,30% పవన్ గారికి ,కేవలం 20% బాబుగారికి ఓటేశారని తెలుస్తుంది .  జగన్ గారే గెలుస్తారనే మౌత్ టాక్ ఎక్కువగా నడవడానికి కారణం ఈ "యూత్". అనగా విద్యార్థులుగా ఉన్నవీళ్ళలో - 30లక్షల ఓట్లు జగన్ కి , 18లక్షల ఓట్లు పవన్ కి , కేవలం 12 లక్షల ఓట్లు బాబు కి పడతాయి. 
25 నుండి 35 వయస్సు ఉన్నవాళ్లు ఏదో ఒక ఉద్యోగంలో స్థిరపడి కొద్దిగా మంచీ-చెడూ ఆలోచనచేయగల సత్తావున్నవాళ్ళు సుమారు 70 లక్షలు ఉన్నారు. వీరిలో 40%బాబుకి, 40% జగన్ కి ,20% పవన్ కి ఓటేసే అవకాశం ఉంది.  వీరు ఆలోచనాపరులే గానీ,కులాలరీత్యా పార్టీలకు మొగ్గు చూపే అవకాశముంది. అనగా, 28లక్షల ఓట్లు బాబు కి , 28లక్షల ఓట్లు జగన్ కి , 14 లక్షలు పవన్ కి పడతాయి. వెరసి ,ఈ 18 -35 వయస్సు వర్గం నుండి, బాబుకి 40లక్షల ఓట్లు , జగన్ కి 58 లక్షలు, పవన్ కి 32 లక్షల ఓట్లు పడతాయి. 
(18 నుండి 35 కాకుండా , 18 నుండి 30 ఏళ్ల వయస్సు అనగా కేవలం  విద్యార్థులు  సుమారు కోటిమంది ఉంటారు. సెఫాలజీ ఇంట్రస్ట్ తో  వీరిని ఒక వర్గం గా గమనిస్తే, వీరిలో 50%జగన్ కి వేశారు. అనగా అరకోటి ఓట్లు. బాబుకి కేవలం 35% అనగా 35లక్షల ఓట్లు,పవన్ కి 15 లక్షల ఓట్లు పడ్డాయి. ). 

రైతులు - రైతు కూలీలు (గ్రామీణులు ) :  
 మొత్తం రైతు ఓటర్లు 45 లక్షలు. వీరిలో 55% అనగా 25లక్షల ఓట్లు బాబుకి పడ్డాయి . 15 లక్షలు జగన్ కి , 5లక్షలమంది పవన్ కి వేశారు. 
రైతు కూలీలు  సుమారు 50 లక్షల  మంది ఉంటారు.వీరిలో 21 లక్షలు జగన్ కి, 20 లక్షలు బాబుకి వేశారు . 

మహిళా ఓటర్లు : 
మహిళలు మొత్తం సుమారు 1. 9 కోట్లు . వీరిలో ఉద్యోగులు,ఉద్యోగుల కుటుంబాలు,వ్యాపారులు,వారి కుటుంబాల మహిళలను,కాలేజీ యువతను తీసేస్తే సుమారు 1.3 కోట్లు సాధారణ గృహిణులు . వీరిలో 60% అనగా  75 లక్షల మంది  బాబుకే ఓటేశారు. 
జగన్ కి 55 లక్షలమంది వేశారు.

మహిళా ఓటర్లను ద్వాక్రా మరియు నాన్ ద్వాక్రా గా విడదీసి చూద్దాం. 
డ్వాక్రా మహిళల్లో (95 లక్షలు)  60% బాబుకి , 33% జగన్ కివేస్తారు. మొత్తం కోటి ద్వాక్రా మహళల్లో 58 లక్షలు బాబుకి , 32 లక్షలు జగన్ కి వేశారు. 
నాన్ ద్వాక్రా  గృహిణులు  మొత్తం 40 లక్షలు ఉంటారు. వీరిలో 40% బాబుకి ,అనగా 16 లక్షలు , జగన్ కి 50% అనగా 20 లక్షలు వేశారు . 

బాబు,ఉద్యోగులకు ఎంత చేసినా , పీఆర్సీ పెంచినా ,జీతాలు పెంచినా, వారికేది కావాలో అది చేసినా, విచిత్రంగా మెజారిటీ ఉద్యోగులు,టీచర్స్ బాబుకి వ్యతిరేకంగా ఓటేశారు. 
ఉద్యోగులు మొత్తం 6లక్షలు. వారి కుటుంబాలతో కలుపుకొంటే 18 లక్షల ఓటర్లు ఉంటారు. వీరిలో 60% అనగా 11 లక్షలమంది జగన్ కి , 7లక్షలమంది బాబు కి వేస్తారు. 

వ్యాపారులు మొత్తం 10 లక్షలమంది ఉంటారు. వీరి కుటుంబాల ఓట్లు మొత్తం కలుపుకొంటే 30 లక్షల మంది అవుతారు. వీరిలో 60% అనగా 18 లక్షలు బాబుకి , 10 లక్షలు జగన్ కి వేస్తారు. 


వెరసి 1. 85 కోట్ల ఓట్లు బాబుకి.1. 65కోట్లు జగన్ కి ,అనగా 20 లక్షల ఓట్లు తేడా ఉంటుంది. 80%పోలింగ్ కాబట్టి, తేడా 16 లక్షల ఓట్లుగా ఉండే అవకాశముంది. 
కాబట్టి తెలుగుదేశం మంచి మెజారిటీ సీట్లతో విజయం సాధిస్తుంది. 

Tuesday, 2 April 2019

2019 ఎన్నికలలో చంద్రబాబు విజయం సాధిస్తారా??

జ్యోతిష్యం అనేది ఒక శాస్త్రం.  ఇది సంక్లిష్ట గణితం తో , కఠినమైన సూత్రాలతో ఉండటం చేత, దీనిని అర్ధం చేసుకొని సత్యమేమిటో వివరించడం అంత తేలికైన పనికాదు. అందుకే అందరూ ఒకే రకమైన జ్యోతిష ఫలితాన్ని చెప్పరు .   శాస్త్రిదే తప్పు తప్ప శాస్త్రం తప్పుకాదు.

గ్రహాలనేవి మన కర్మ భారాన్ని సూచించేవే తప్ప, అవే మన సుఖదుఃఖాలకు  కారణం కాదు. మరి ఎందుకు నవగ్రహాలకు పరిహారాలు,శాంతులు చేస్తున్నారు? ఎందుకంటే ప్రతి పదార్ధానికి వెనుక ఒక శక్తి ఉంటుంది. ఆ శక్తినే దేవతగా భావన చేయమని మహార్హులు వాక్యం . అందుకే  గ్రహమనేది స్థూలపదార్ధ మైనా  దానిలోని శక్తి ని దేవత గా భావిస్తాము . మనం పూర్వజన్మలో చేసుకొన్న కర్మలో కొంత భాగం  ప్రారబ్ద కర్మగా  అనుభవించడానికి ఈ ప్రస్తుత జన్మ తీసుకొన్నాం.  జన్మ సమయంలో ఈ గ్రహాల స్థానం, గోచారరీత్యా  గ్రహాల చలనం అనేవి , కేవలం కర్మ సూచికలే  తప్ప అవి   కారణం కాదని గుర్తుపెట్టుకోవాలి. 
పంచభూతాలకు శాంతులు,పరిహారాలనేవి మన పూర్వజన్మల పాపపు కర్మలను కొంతైనా రద్దు చేస్తాయనే భావన, అంతేకాక, ఈ శాంతి విధానాల ద్వారా మనస్సు కొంతైనా పవిత్రమవుతుందనే భావనతో చేస్తాము. 

మరి మనిషికి స్వతంత్రం లేదా ?
 అకుంఠిత దీక్షాపరులకు, శ్రద్ధ,ఏకాగ్రత ,లక్ష్యం పై అనన్యమైన చింతన ఉన్నవారికి స్వతంత్రం ఉంటుంది తప్ప  సామాన్యులకు ఉండదు. కాబట్టి  ప్రారబ్ద కర్మ అనుభవించక తప్పదనే సామెత ఆలా వచ్చింది. 

చంద్రబాబు గారి జాతకం. 
ఇది పరాశర సిద్ధాంతాన్ని అనుసరించి గణించిన కుండలి. 
ఏప్రిల్ 20 1950 ఉదయం 6-43,కృత్తికా నక్షత్రం, శుక్లపక్ష తదియ ,గురువారం చిత్తూర్ లో జన్మించారు. 
లగ్నం : మేషం ; రాశి : వృషభం. 
నవాంశ లగ్నం : కన్య ; నవాంశ రాశి : కుంభం . 


లగ్న కుండలి బలం -దశ బలం . 
కుండలి లో లగ్నాత్ శని 5 వ  స్థానం లో ఉన్నాడు . పాపగ్రహం ,5 లో ఉంటే అంతగా ఇబ్బంది పెట్టడు . కానీ శత్రు క్షేత్రం లో ఉన్నాడు, పైపెచ్చు వక్రంగా ఉన్నాడు  కాబట్టి,మరింత పాపి గా బిహేవ్ చేస్తాడు.  అనగా దుఃఖ కారకుడు. 
2003 ఏప్రిల్ నెలనుండి 2022  ఏప్రిల్ వరకు చంద్రబాబు కి  శని మహర్దశ. అందుకే ఆయనకు 2004 నుండి  10ఏళ్ళు అధికార భంగమై ప్రతిపక్షంలోనే ఉన్నాడు. కానీ ఎప్పుడైతే సూర్య,చంద్ర అంతర్దశలు వచ్చాయో ఆయనకు తిరిగి అధికారం దక్కింది. ఆయన జాతకం లో సూర్య చంద్రులు యోగ కారకులు. 
లగ్న కుండలి రీత్యా,రాహువు ఆయనకు యోగిస్తాడు . 2016 నుండి శనితో రాహు అంతర్దశ నడుస్తుంది . దీనివలన పెద్దగా ఇబ్బంది ఉండదు. 26 మార్చి 2019  నుండి శని-రాహు వులో సూర్య ప్రత్యాంతర దశ ,ఆ తర్వాత చంద్ర ప్రత్యాంతర దశ వస్తాయి.  ఎన్నికలు కూడా ఈ రెండు శుభగ్రహాల ప్రత్యాంతర దశలలో జరుగుతున్నాయి కాబట్టి అంతా  శుభమే జరుగుతుంది. 

ప్రస్తుత గోచారం : 


ఏప్రిల్ 1 నుండి గురువు ధనస్సులో ప్రవేశించి ,శని, కేతువులతో చేరడం అనేది చాల ముఖ్యమైన మలుపు.  ఇప్పటి వరకు పోటా పోటీ గా ఉన్న దనుకొంటున్న ఎన్నికల సమరం, ఇప్పటి నుండి ఏక పక్షంగా మారే సూచనలున్నాయి.  ఎందుకంటే లగ్నం నుండి రాజ్యస్థానం లోనూ , రాశి నుండి అష్టమ స్థానం లోనూ  ఉన్న శని ,కేతువులు   అశుభ ఫలితాలను ఇచ్చే సూచనలున్నాయి.  కానీ  సరిగ్గా 31 మార్చ్ నాడు గురువు శని, కేతువులతో కలిశాడు. 
గురువు పాపగ్రహాల అశుభత్వాన్ని కొంతమేర తగ్గించేస్తాడు. గురువు,ధనుస్సు రాశి నుండి  తన 5 వ దృష్టితో లగ్నాన్ని చూస్తున్నాడు.అలాగే 9 వ దృష్టితో  5 వ స్థానాన్ని  చూడటం చేత శత్రువులపైన ,పోటీదార్ల పైనా విజయం సిద్ధిస్తుంది. 
   

Thursday, 31 January 2019

చంద్రబాబు విశ్వరూపం

గత 4 ఏళ్లలో  కియా , ఇసుజు, టాటా, అశోక్ లేలాండ్, సినామాస్  వంటి బడా పరిశ్రమలు , పేరెన్నికున్న సాఫ్ట్ వేర్ కంపెనీలు , అదానీ,అంబానీ,జిందాల్  లాంటి దిగ్గజాలను,చైనా,కొరియా,జపాన్ ,ఇండోనేషియా లాంటి దేశాలనుండి  ధనాన్ని ఆంధ్రాకి రప్పించి సుమారు 100 పరిశ్రమలను స్థాపించి 12లక్షల ఉద్యోగాలను కల్పించిన ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. అదే మోదీ పాలన చూడండి. దేశాన్ని,నిరుద్యోగ యువత ను ఎంతగా కుంగదీశాడో అర్ధం అవుతుంది.
India's unemployment rate hit a 45-year high in 2017/18 . 
జాతీయ సర్వే NSSO-రిపోర్ట్ ఇది.

  • India's jobless rate shot up to 45-year high during 2017-2018.
  • NSSO showed unemployment rate at 6.1%, the highest since 1972-73.
  • Joblessness stood at 7.8% in urban areas compared with 5.3% in the countryside.
  • This was the first comprehensive assessment of India's employment situation post DeMo.


  • చంద్రబాబు  సారధ్యంలో దండుగ మారి వ్యవసాయం ఎలా పండుగగా మారిందో చూడండి. కేవలం 4ఏళ్లలో వ్యవసాయం, ఉద్యానవనాల నుండి రైతులు,రాష్ట్రం ఎంతగా లబ్దిపొందిందో ఈ క్రింది  చార్ట్ చూస్తే అర్ధం అవుతుంది. 3. 5శతం నుండి 18 శాతానికి పెరిగింది.





    వ్యవసాయమే కాదు, పారిశ్రామిక ప్రగతి ని గమనించండి.  ఏయే జిల్లాలలో ఏయే పరిశ్రమలు వచ్చాయో అర్ధం అవుతుంది. ఇందులో కొన్ని ప్రారంభోత్సవాలు జరుపుకొని ఉత్పత్తులు చేస్తుంటే, మరికొన్ని నిర్మాణదశలో ఉన్నాయి.
    అక్కడ లభ్యమయ్యే వనరులను బేస్ చేసుకొని  ప్రతి జిల్లాకి ప్రాముఖ్యతనిచ్చిన తీరు చూస్తే భారతదేశంలో ఏ నాయకుడూ చేయలేని ఘనకార్యం చేశాడు చంద్రబాబు అని తెలుసుకొంటాం.  పాలనలో పారదర్శకత, అభివృద్ధిలో వికేంద్రీకరణ , యువతకు ఉద్యోగాలు, రైతుకి భరోసా, మహిళకు దన్ను , వెనకబడిన వర్గాలకు చేయూత , పేదలకు మూడు పూటలా కడుపు నిండా అన్నం , విద్యార్థులకు ఉచిత  విదేశీ విద్య , బాలికలకు సైకిళ్ళు, తల్లీబిడ్డ రక్షణకు ఎక్స్ ప్రెస్ సౌకర్యాలు, మనిషి జననం నుండి మహాప్రస్థానం వరకు అడుగు అడుగునా తోడూ నీడగా మారిన తీరు చూస్తే, ఇలాంటి నాయకుడు దొరకడం ఆంధ్రుల అదృష్టం.
    ఇదిగో ...ఇదే చంద్రబాబు విశ్వరూపం ... 

    Wednesday, 28 November 2018

    వ్యవసాయం భారతీయ జీవన విధానం.

    భారతదేశం అనాదిగా వ్యవసాయాధారిత దేశం. పల్లెల్లో ప్రజలు భూమిని నమ్ముకొని గొడ్డు గోదా పిల్లామేకలతో ఉన్నదాంట్లోనే సర్దుకొంటూ సంసారం సాగించేవారు. 90 వ దశకం వరకు పారిశ్రామిక రంగానికి,వ్యవసాయ రంగానికి ఉత్పార్దకత లో పెద్దగా అంతరం లేకపోవడం చేత ఈ రెండురంగాలలోని ప్రజల జీవితాలలో  చెప్పుకోదగ్గ అసంతృప్తులు లేవు. 

    ఎప్పుడైతే పారిశ్రామిక సంస్కరణలు మొదలయ్యాయో , వ్యాపార రంగానికి బాంకులు విచ్చలవిడిగా లోన్స్ ఇవ్వడం మొదలు పెట్టాయో ,అప్పటి నుండి పారిశ్రామిక ,ఆ తర్వాత సేవారంగాలలో ఉత్పా దకత  బాగా పెరిగిపోయి, వ్యవసాయ రంగం లోని ఉత్పాదకత తగ్గిపోవడం జరిగింది. 
    విద్యారంగం కూడా కేవలం సేవారంగానికి పనికొచ్చే పౌరులను తయారు చేసే కర్మాగారాలుగా మారిపోయాయి. 

    నేటికీ, దేశంలో 80కోట్లమందిని వ్యవసాయరంగమే పోషిస్తుంది.  దేశంలోఉన్న అనేక రకాల  ఉద్యోగాలలో 50శాతం వ్యవసాయ కూలీ అనే  ఉద్యోగమే!
    మనకుతెలుసు, వ్యవసాయం అనేది పరిశ్రమ కాదు. వ్యవసాయం అనేది సేవారంగమూ కాదు. వ్యవసాయం ట్రేడింగ్ వ్యాపారం కానే కాదు. అందుకే  మనం చెప్పుకొంటున్న భౌతికపరమైన సంపద లెక్కల్లో వ్యవసాయం లాభసాటి కాదు. ఆర్థికవేత్తలు లెక్కలిలా ఉంటాయి. 50శాతం ఉద్యోగులు దేశ  జా తీయ ఉత్పత్తి కి  కేవలం 16శాతం మాత్రమే ఇస్తున్నారని వారంటారు. వారికి తెలియదా?వ్యవసాయం వ్యాపారం కాదు,లాభాపేక్షలు చూసి చేసేది కాదు. వ్యవసాయం భారతీయ జీవన విధానం. 

    దేశంలోని 30కోట్ల ఎకరాల లో వ్యవసాయం,వ్యవసాయ అనుబంధ రంగాలైన డైరీ,ఆక్వా, పౌల్ట్రీ , ఉద్యానవన,అరణ్య ,మెడిసినల్ హెర్బల్స్ ద్వారా ఏ టా సుమారు 20 లక్షలకోట్ల రూపాయల విలువైన ఉత్పత్తు లు- అనగా 30 కోట్ల టన్నుల ధాన్యాలు , 15కోట్ల టన్నుల పాలు, 30కోట్ల టన్నుల పండ్లు, కాయగూరలు ,7మిలియన్ టన్నుల మాంసం ఉత్పత్తి అవుతున్నాయి. 

    ఏది ఏమైనా వ్యవసాయ రంగంలో ఉన్న 10కోట్ల రైతులు (భూమి యజమానులు) గానీ, దీనిపై ఆధారపడిఉన్న 15కోట్ల కూలీలు గానీ సంతోషంగా లేరు. ఎందుకంటే బతుకు పరుగులో  ,ఎవరైతే పరిశ్రమలు,సేవారంగాన్ని వెదుక్కుంటూ పట్టణాల బాట ప ట్టారో వారి బతుకులు మరింత రంగులమయంగా కనబడుతుంది. 
    భూమి వారికీ అన్నంపెట్టే తల్లి లా కనబడం మానేసి అప్పుల భారంతో కుంగదీసే వ్యధ భూమిగా కనబడటం మొదలైంది.  ఈ సంకెళ్లనుండి తెంచుకొని పోవాలంటే ఉన్న ఒకే ఆయుధం చదువు. 

    తరాలు పెరుగుతున్న కొద్దీ వ్యవసాయానికి గుండెకాయ గా ఉండే   ఉమ్మడి కుటుంబాలు విఛ్చిన్నమై న్యూక్లియర్ కుటుంబాలు పెరుగుతున్నకొద్దీ కమతాల సైజు తరతరానికి తగ్గిపోతుంది. జనాభాతో పాటు  భూమి పెరగదు గదా?
    కమతాల సైజు సరాసరి ఒక్కో వ్యవసాయదారుడికి కేవలం 1ఎకరా గా ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో పెట్టుబడిలేని ప్రక్రుతి వ్యవసాయం ,  రసాయన ఎరువులు,పురుగుమందులను తగ్గించి గోవు ఆధారిత సేంద్రియ ఎరువులు , మూలికలనుండి తీసిన పురుగుమందులను వాడించి , సూక్ష్మ బిందు తుంపర సాగుతో దిగుబళ్లను సాధించే పద్ధతులను ప్రవేశ బెట్టారు చంద్రబాబు. ఇది ఎంతో ముందు చూపుతో తీసుకున్న నిర్ణయం. 

    • మార్కెట్టులో ఏ పంటలకు నిలకడైన మద్దతు ధర ఉంటుందో, ఏపంటలకు డిమాండ్ ఉంటుందో, ఏ పంటలను ఎక్కువకాలం పాడవకుండా నిల్వ  చెయవచ్చొ అలాంటి పంటలను మాత్రమే సాగుచే యించాలి.  
    • పంట దిగుబడిని కోల్డ్ స్టోరేజీ లలో నిల్వ చేసుకొనే సదుపాయాలు , సోలార్ ఆధారిత డ్రయ్యర్ లు ప్రతి పంచాయితీలో ఉండాలి. 
    • మెకానికల్ వ్యవసాయ  వ్యవస్థను అనగా ట్రాక్టర్లు , కోత నూర్పిడి యంత్రాలు, కలుపుతీత యంత్రాలు, నాట్లు వేసే యంత్రాలు సమస్తం ప్రతి పంచాయితీలో  అందుబాటులో ఉండాలి.  
    • ఇవన్నీ కూడా  డబ్బు చెల్లింపులు లేకుండా పండినపంట ను  బార్థర్ ఇచ్చే విధంగా ఉండాలి. అపుడు అప్పులు చేయవలసిన అవసరం ఉండదు. 
    • పంట భీమా నిర్బంధంగా అమలుచేయాలి. 
    • ఏదైనా ఒక జిల్లాలో ప్రయోగాత్మకంగా ప్రభుత్వమే సొంతంగా వ్యవసాయం చేసి పండిన పంటను ఎకరాకి ఇంతని కవులుగా రైతులకి ఇస్తే  మరింత బాగుంటుంది. 
    • వ్యవసాయంలో యాంత్రికత ఎంతపెరిగితే అంతగా కూలీలు వేరే రంగానికి మారతారు . కాబట్టి ప్రతి పంచాయితీలో నైపుణ్యాభివృద్ధి తరగతులు నిర్వహించాలి. 
    • కమ్మరి , కుమ్మరి,చాకలి, యానాది ,చేనేత,కల్లుగీత ,టైలర్,కంసాలి లాంటి  చేతిపని వారికి  నైపుణ్యాభివృద్ధి తరగతుల తోపాటు ఆధునిక పనిముట్లు అందించాలి. 
    • తక్కువ మనుషులు,ఎక్కువ ఉత్పద కత ఉంటేనే వ్యవసాయం లాభసాటి గా ఉంటుంది.  
    • భూమిని,పంటను ,తేమశాతాన్ని పరీక్షించే సాంకేతికత ప్రతి పంచాయితీలో ఉండాలి. 
    • ప్రభుత్వం  తన పధకాలను ప్రజలకు ఎంత అవినీతి రహితంగా ,, లబ్దిదారులకు ఎలాంటి కష్టం లేకుండా  ఎంత త్వరగా అందించగలదో ,అంతగా ప్రజామోదాన్ని పొందుతుంది. కేవలం పధకాలు ప్రకటించేసి అవినీతి, బంధుప్రీతి, పార్టీ ప్రీతి తో అసలైన లబ్దిదారులకు అందించకుంటే  మరింత తిరస్కారాన్ని ఎదుర్కొంటుంది. 
    • పంచాయితీ ల చేతిలోనే ప్రాధమిక అధికారాలు అనగా పంచాయితీ స్థాయిలో పనిచేసే వారికి ఆయా పంచాయతీలే జీతాలు,ఇతరత్రా సంక్షేమం చూడాలి. అలాగే పంచాయితీ వనరుల ఆదాయం లో 70శాతం ఆయా పంచాయతీలకే దక్కాలి. అపుడే గ్రామ సురాజ్యం బలపడుతుంది.