Search This Blog

Thursday 13 August 2015

డబ్బు డబ్బు ..........

మన రాజ్యాంగం లోని 7 వ షెడ్యుల్ -ఆర్టికల్ 246 ద్వారా సంక్రమించిన అధికారం ద్వారా కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు నిరాఘాటం గా పన్నులు వసూల్ చేసు కోవచ్చు . 
కేంద్రం పార్లమెంటు ద్వారా చట్టాలు చేసి -  ప్రజల  సంపాదన , వారి ఆస్తులు , ప్రజల కొనుగోళ్ళు , అలాగే పరిశ్రమల ద్వారా వస్తూత్పత్తి  ,ఎగుమతి -దిగు మతులు , వ్యాపార సంస్థల టర్నోవర్  ,వ్రుత్తు లు ,సేవలు ,  ప్రజలు ఇచ్చి పుచ్చు కొనే బహుమతులు ,వారసత్వపు ఆస్థులు - వీటన్నింటి పైనా పన్నులు -కొన్ని డైరెక్ట్ గా (ఆదాయపు పన్ను , వ్యాపార సంస్థల పై పన్ను , సంపద పన్ను ,వారసత్వపు ఆస్థి పై పన్ను ,బహుమతుల పై పన్ను ); మరికొన్ని పరోక్షం గా  వేసి వసూల్ చేస్తాయి . 
ఇవికాక సర్ చార్జి ,సెస్స్ ఉండనే ఉన్నాయి . 
రాష్ట్రాలు  విధాన సభల ద్వారా చట్టాలు చేసి - ఆస్థుల లావాదేవీలు , సేల్స్ టాక్స్ ల ద్వారా  పన్ను వసూల్ చేస్తాయి . 

వీటన్నింటి ద్వారా (సేల్స్ టాక్స్  & VAT  తప్ప ) కేంద్రానికి ఏటా సుమారు 10 లక్షల కోట్లు పోగవుతుంది . 
కేంద్రం , ఇందులో 42% రాష్ట్రాలకు తిరిగి పంచి పెడుతుంది .  

దేశం లో వస్తువుల ఉత్పత్తి ,వనరుల నుండి ఖనిజాల ఉత్పత్తి ,భూమి నుండి ఆహార ఉత్పత్తి ,అలాగే ప్రజలు కష్ట పది చేసే పని విలువ -ఇవన్నీ కలిస్తే ,దీనినే దేశ ఆర్ధిక ఉత్పత్తి అంటారు . దీని విలువ ఆధారం గానే మన రిజర్వ్ బాంక్ కరెన్సీ నోట్లను ముద్రణ చేస్తుంది . 
దేశ ఆర్ధిక ఉత్పత్తి విలువ కన్నా అధికం గా ముద్రణ చేస్తే ఆ కరెన్సీ విలువ పడిపోతుంది . అనగా మన కరెన్సీ విలువ ను పడిపోకుండా కాపాడు కోవా లంటే మనం ఉత్పత్తి చేస్తున్న సరకుల కు నిరంతర మార్కెట్ , డిమాండ్ ఉండాలి . 
దేశం లో ప్రజల కొను గోలు శక్తి పెరగాలి . లేదా మన సరకులకు ,సేవలకు విదేశాల లో డిమాండ్ పెరిగి  అమ్ముకొనే అవకాశం ఉండాలి .కానీ మనకు ఆ భాగ్యం ఉందా ? విదేశీ మార్కెట్ లో డిమాండ్ ఉండాలంటే వస్తువుల నాణ్యత బాగుండాలి. కానీ మన వస్తూత్పత్తి ,నాణ్యత నాసిరకం గానే ఉన్నాయి . 
( ఇక్కడ ఒక్కటి గుర్తు పెట్టుకోవాలి . కరెన్సీ విలువ పడిపోవడం ,సరుకుల ఎగుమతులు -దిగుమతులు '  అనేది గ్లోబల్ వ్యవస్థ వచ్చిన తర్వాత పుట్టిన పదాలు) . 
 ఉత్పత్తి చేస్తున్న సరకులన్నీ మన జనాభా నే మింగేస్తే అదీ సంక్షేమ పధకాల రూపేణ ఉచితం గా వాడేసు కొంటూ ఉంటే ,మన అధికారులు ,రాజకీయ నాయకులు అవినీతి తో హాంఫట్  అంటూ సామాన్యులకు అంద వలసిఉన్న వనరులను మింగేస్తూ ఉంటే, ఎగుమతుల మాట అటుంచి దిగుమతులు చేసుకొన్నా సరిపోవడం లేదాయె ! 

డబ్బుని , లెక్కకు అందకుండా దాచి పెట్టుకొని భూముల కొనుగోళ్ళు  ,హవాలా ద్వారా విదేశాలకు తరలింపు ,
 కేవలం లక్ష మంది వ్యాపార వాణిజ్య చట్టాలలోని లొసుగుల ద్వారా  వెనకేసు కొంటున్న సంపద ,
రోజు రోజుకీ పడిపోతున్న మన డబ్బు విలువ , 
130 కోట్లలో కేవలం 2కోట్ల మందికి మాత్రమే 5అంకెల సంపాదన ,
దేశం లో ఉన్న సంపదలో 70% కేవలం లక్ష మంది దగ్గరే పోగు పడి పోవడం - ఇవన్నీ మనిషిలో రంకె లేస్తున్న స్వార్ధం ,మోసం ,కోరికలకు అలాగే కొంత మంది భాగ్య వంతుల తెలివికి ,తెంపరి తనానికి పరాకాష్ఠ . 

 నల్ల ధనం అంటే ప్రభుత్వానికి  లెక్క చెప్పని కరెన్సీ ఒక్కటే కాదు, ప్రభుత్వానికి  తెలియ చేయని లేదా లెక్క చెప్పని ఆస్తులు -భూములు ,ఇళ్ళు ,ఫాక్టరీలు , సంస్థలు , బంగారం ,జాతి రత్నాలు ---  ఇవన్నీ  దొంగ  సంపదే !
మన రిజర్వ్ బాంక్ ముద్రణ చేస్తున్న కరెన్సీ లో , ఏటా సుమారు 60 ట్రిలియన్ లు దొంగ డబ్బు గా మారుతుంది . ఇందులో 10% అనగా 6 ట్రిలియన్ లు  మాత్రమె ప్రతి ఏటా విదేశాలకు జారు కొంటుంది . 

భారత్ అత్యంత 10 పేద దేశాలలో ఒక్కటి . 
భారత్ అత్యంత 10 అవినీతి దేశాలలో  ఒకటి . 
కారణం, సోమరితనం ,స్వార్ధం ,అలసత్వం ,అవినీతి తో పుచ్చి పోయిన ప్రజలా ?
కుల బలం , ధన బలం ,మంది బలం తో పులిసి పోయి , తెలివి ,కరడు కట్టిన స్వార్ధం తో జిత్తులమారి మోసాలు , రంగులు మార్చే రాజకీయాలు చేస్తున్న కొంత మంది నాయకులా ?
ఎవరు ?

No comments:

Post a Comment