Search This Blog

Monday 24 August 2015

ఆంధ్రా ఆలోచన


  • ఋణాల పై  90%గ్రాంట్ .... 
  • లోటు బడ్జెట్ ని పూడ్చడానికి ,  ప్రతి ఏ టా సాయం పొందడం .... 
  • పరిశ్రమలకు పన్ను రాయితీలు ... 
  • వీటన్నింటితో పాటు ప్రత్యేక హోదా !
1. ప్రపంచ బాంక్ తదితర విదేశీ బాంకులు , సంస్థలు మంజూరు చేసిన రుణాలకు రాష్ట్ర ,కేంద్ర ప్రభుత్వాలు హామీ ఇవ్వ వలసి ఉంటుంది . ఇలా మన రాష్ట్ర ము తెచ్చు కొనే రుణాల పై కేంద్ర ము  90% గ్రాంట్ అంటే ,ఉచితం గా ఇవ్వాలని ఆంద్ర ప్రభుత్వం కోరబోతుం ది . ఇలా విదేశీ రుణ ప్రాజెక్టుల్లో అధిక భాగం గ్రాంటుగా వచ్చేలా చూసుకోగలిగితే అది రాషా్ట్రనికి మేలు చేకూరుస్తుంది . 

2.  తక్షణ సాయంగా (అప్పుగా కాదు ) రూ.25 వేల కోట్లు కేంద్రం నుంచి తెచ్చుకోవాలని ,దానితో  రాష్ట్రంలో పెద్దఎత్తున మౌలిక వసతులు చేపట్టవచ్చని, తద్వారా పరిశ్రమలను ఆకర్షించడం వీలవుతుందని రాష్ట్ర ప్రభుత్వ ఆలోచన . ఇదే విధం గా  మరికొన్ని నిధులు ఏడాదికి కొంత చొప్పున మిగిలిన సంవత్సరాల్లో  రాబట్టు కో వచ్చని , వాటితో అభివృద్ధిపరంగా ముందడుగు వేయవచ్చని  ఓ ఆలోచన . 
ఒక నిర్దిష్ట కాలపరిమితితో కూడిన ప్యాకేజీని ప్రకటించాలని కేంద్రాన్ని కోరనుంది. 

3. పారిశ్రామిక రాయితీల ద్వారా  ఏపీలో కొత్తగా పరిశ్రమలు పెట్టే వారికి 15 శాతం అదనపు మూలధన రాయితీ, 15 శాతం అదనపు తరుగుదల రాయితీ  వస్తాయి . 

అంతే కాదు , ఇలా ప్రత్యేక ప్యాకేజీతోపాటు ప్రత్యేక హోదా కూడా సాధించాలనే పట్టుదలతో నవ్యాంధ్ర ఉన్నట్లు తెలుస్తోంది. 

No comments:

Post a Comment