Search This Blog

Friday 7 August 2015

పప్పు భారత్

మనది వ్యవసాయ దేశం . ఐనా పప్పు ధాన్యాలను సరిపడా ఉత్పత్తి చేయ లేక పోతున్నాము . అందుకే పప్పుధాన్యా లు  దిగుమతి చేసుకుంటూ  వేల కోట్ల రూపాయల విదేశీ మారకద్రవ్యం 
నష్టపోతు న్నాం .  
మనం ఏం చేయాలి ?
1. మొదటి పంట వరి, మొక్కజొన్న, వేరుశనగ వేసిన తర్వాత సాగునీటి అవకాశం ఉన్న చోట రెండో పంటగా పప్పుధాన్యాలను వేయించాలి. 
2. తొలకరిలో పప్పుధాన్యాలు వేసి పంట వచ్చిన తర్వాత ఖరీఫ్‌ పంటలు వేసే విధంగా ప్రణాళిక రూపొందించాలి. 
ఈ విధంగా ఖరీఫ్‌ పంట వేయడానికి ముందు, వేసిన తరువాత కూడా పప్పుధాన్యాలు పండించవచ్చు. 
ఈ పంటల  వల్ల విదేశీ మారకద్రవ్యం ఆదా అవ్వడమే కాక ,యూరియా  దిగు మతులను కూడా తగ్గించు కోవచ్చు . ఎందుకంటే ,  పప్పుధాన్యాల సాగు వల్ల ,భూమికి నత్రజని చేకూరుతుంది. పప్పుధాన్యాల తరువాత వేసే పంటకు నత్రజని తక్కువగా వినియోగించవచ్చు. 

No comments:

Post a Comment