Search This Blog

Thursday 20 August 2015

ఊరంతా ఒక దారి -ఉలిపికట్టదొక దారి

2013-భూసేకరణ చట్టం ప్రకారం ,ఏదైనా ప్రజోప యోగ కరమైన ప్రాజెక్ట్ ల కోసం భూమిని తీసుకోవాలీ అనుకుంటే , ఆయా భూ యజమానులలో 80శాతం మందిని ఒప్పించి  మాత్రమె తీసుకోవాలి .
అమరావతి  ఆంధ్రుల రాజధాని గా చట్ట సభలో తీర్మానం చేయడ మైనది . 
దీని నిర్మాణానికి  ప్రభుత్వం ప్రతిపాదించిన ప్రతిఫలం  నచ్చి , భూమిని "సేకరణ"రూపం లో కాకుండా భూ సమీకరణ ప్రాతిపదికన  ఇప్పటికే 98శాతం మంది భూ యజమానులు తమ భూములను  స్వచ్చందం గా ప్రభుత్వానికి స్వాధీనం చేశారు . ఆ విధం గా వారు కూడా చారిత్రాత్మక బృహత్తర రాజ ధాని నిర్మాణం లో భాగ స్వామ్యులు అయ్యారు .
కానీ , కేవలం 2శాతం మంది మాత్రమే ప్రభుత్వ ప్రతిపాదనలను వ్యతిరే కించి రాజధాని నిర్మాణం అనుకొన్న రీతిలో జరగా కుండా అడ్డు పడుతూ , 5కోట్ల మంది ఆంధ్రుల ఆశలే కాకుండా , భూములిచ్చి రాజధానిలో భాగ స్వామ్యులైన 98శాతం మంది రైతుల ఆశలను కూడా  వమ్ము చేయడానికి రక రకాలుగా ప్రయత్నం చేస్తున్నారు .
కొంతమంది మేధావులు ,దయార్ద్ర హృదయులు ఆ 2శాతం వారికి ఎలాంటి కష్టం కలగ కుండా చూడ మంటున్నారు . అదెలా సాధ్యమో కూడా వారు వివరిస్తే రాజధాని నిర్మాణానికి వారి వంతు పాత్ర  పోషించి నట్లు అవుతుంది .
ప్రస్తుతం ఉన్న కేంద్ర ప్రభుత్వ ఆర్డి నెన్స్ ప్రకారం చూసినా ,  2013-భూసేకరణ చట్టం ప్రకారం పరి శీలిమ్చినా భూసేకరణ చట్ట ప్రయోగం న్యాయమే !

No comments:

Post a Comment