Search This Blog

Tuesday 20 March 2018

You can defeat Modi...!

3000కోట్లు మీవి కావనుకొంటే , మోడీ పార్టీకి వచ్చే ఎలక్షన్ లలో 150 సీట్లు కంటే ఎక్కువ రాకుండా కట్టడి చేయవచ్చు. ఆలా ఖర్చు పెట్టలేకపోతే ,మోదీపార్టీకి 2019 ఎన్నికలలో 200 సీట్లు వచ్చే అవకాశం ఉంది. 
 వివరంగా చూద్దాం 
సువిశాల భారతదేశం యొక్క ఆర్ధిక పెరుగుదల రేటు ఏటా  కేవలం 7% గా ఉంది. ఇంతజనాభా,ఇంతపెద్ద స్వదేశీ మార్కెట్ ఉన్నదేశం ఇంత  మెల్లగా తాబేలు లెక్క ఆర్థికస్థితి పెంచుకోవడం చాల దారుణం. నిజానికి మిగతా ప్రపంచం మొత్తం ఆర్ధిక మాంద్యం నుండి బయటపడి పరుగులు దీస్తుంటే మోడీ నాయకత్వంలో కేవలం 5 నుండి 7% పెరుగుదల అంటే ఎంత ఘోరమో ఆలోచించండి!
ఆయిల్ దిగుమతుల బిల్లు చాలా తగ్గి పోవడం వలన గత 4ఏళ్లలో మన మోదీ ప్రభుత్వం 4లక్షలకోట్లను సేవ్ చేసుకొంది.  అదంతా ఏమైపోయింది?
4ఏళ్ళు నిద్రపోయి, 5వబడ్జెట్ లో రైతు సంక్షేమ పధకాలు,ఆరోగ్యరక్ష పధకాలు పెట్టారు. ఆర్ధిక పెరుగుదల రేటు ఏటా  కేవలం 7%  మాత్రమే ఉన్నపుడు,వీటికి నిధులు ఎక్కడనుండి ఎలా తెస్తారో జైట్లీ గారు చెప్పలేదు. కేవలం  రాబోయే ఎన్నికల కోసం ప్రచార ఆర్భాటం తప్ప నిజమైన పధకాలు కావవి. 
గ్రామీణ భారతం ఇంతగా కుంటుబడటానికి కారణం మోడీ తీసుకొన్న అనాలోచిత నిర్ణయాలే. పెద్దనోట్ల రద్దు , వస్తుసేవల వినిమయ పన్ను  అలాగే ప్రభుత్వం తీసుకొన్న కొన్ని నిర్ణయాలు మార్కెట్ లో కరెన్సీ కి కటకట లేర్పరచి , సామాన్యుడికి ,అలాగే మధ్యతరగతి వారికీ చుక్కలు చూపించాయి. అంతేకాదు, ప్రజల యెక్క  ఆస్తుల విలువ , సంపద విలువ  బాగా తగ్గిపోయింది.కానీ వారు ఖర్చు పెట్టే వస్తువులు,సేవల ధరలు మాత్రం తగ్గలేదు. దీనివలన మధ్యతరగతి వారు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అప్పులతో సతమత మయ్యేవారు,ఆస్తులు అమ్మేసి తీర్చుదామంటే కొనేవాళ్ళు లేరు. 
కొనుగోళ్లు బాగా మందగించాయి. కొన్ని స్వదేశీ. విదేశీ సంస్థలు ఫార్వార్డ్ ట్రేడింగ్ చేయడం వలన రైతులకు మద్దతు ధర లభించడం కష్టమై పోయింది. బాంక్ లలో నిరర్ధక ఆస్తులు పెరిగిపోయి దివాళా తీయడానికి సిద్ధంగా ఉన్నాయి. బాంక్ లను లూటీ చేసేవాళ్ళని,ఏదేదో చేస్తానన్న  మోడీ ఏమీ చేయడం లేదు. క్రమేణా, మోడీ విశ్వసనీయత కోల్పోయాడు. అందుకే,  ఎన్నికల సంవత్సరంలో  కొత్త బడ్జెట్లో  మోడీ ఎలాంటి తాయిలాలు చూపించినా  ప్రజలు నమ్మడం లేదు. 
సాధారణంగా, ఎలక్షన్ సమయాల్లో బడ్జెట్ లు అలాగే జనాకర్షంగా కనబడతాయి తప్ప మేలు మాత్రం జరగదు. ఒకవేళ మోడీ  నిక్కచ్చిగా చేయాలనుకున్నా , రైతు పంట మద్దతు ధర 150% పెంచడానికి ,  10కోట్ల కుటుంబాలకు 5లక్షల ఖరీదైన ఉచితవైద్యం అందివ్వడానికి  అవసరమైన నిధులు  ప్రభుత్వ ఖజానా లో లేవు.  
మధ్యతరగతి వారు  ఇప్పటికే  మోడీకి దూరం జరిగారు . 
FCRA చట్టానికి సవరణ చేసి విదేశాలనుండి రాజకీయ పార్టీలకు  1976 నుండి వచ్చిన డొనేషన్ లను చట్టబద్ధం చేశాడు . ఇది ఎంత ఘోరమో చూడండి. 
On March 13, 2018, Parliament’s lower house, the Lok Sabha, passed without debate funding demands from 99 Indian government ministries and departments, including two bills and 218 amendments.
మన సొంత తయారీ తేజస్"కంటే తక్కువ సామర్ధ్యమున్న 1000  రాఫెల్ జెట్ లను  ఢసాల్ట్ కంపెనీ నుండి అత్యధిక ధరకు  కొన్నాడు. 
MINIMUM GOVERNMENT AND MAXIMUM GOVERNENCE" అని చెప్పిన మోడీ ఆ మాటను మరచిపోయి,కేవలం BJP పార్టీని దేశమంతటా ఎలాగైనా సరే వ్యాపింపచేసి , బలంగా ఉన్న ప్రాంతీయ పార్టీ లీడర్లను అణచివేసి రాష్ట్రాల అధికారాలను కాలరాచి భారతదేశాన్ని తన గుప్పెట్లో పెట్టుకొని నిరంకుశంగా చైనాకి చెందిన జిన్ పింగ్ లా పాలించాలని కుట్రపూరితంగా ఆలోచిస్తున్నాడు. తనకు తోచిందే రైట్" అనుకొంటున్నాడు. అంతేకాదు  పూర్వం 10 ఏళ్లపాటు పాలించి దేశాన్ని భ్రష్ట్టు పట్టించిన కాంగ్రెస్ పాలనలో ఎలాంటి  పధకాలు ఉన్నాయో , వాటినే పేర్లు మార్చి కొనసాగిస్తున్నాడు . దీనికి మూలకారణం ఆర్ధిక శాఖ లో ల్యూటిన్ కాలపు కార్యదర్సులను కొనసాగిస్తూ ఉండటమే!
చిదంబరం,మన్మోహన్ సింగ్,జైట్లీ,మోడీ వీలందరూ కేవలం బయటకు కనబడే బొమ్మలు.వీళ్లకు కిర్రెక్కించి ఆడించేది ల్యూటిన్ కాలపు మైండ్ సెట్ తో ఉండే  కార్యదర్సులు ,బ్యూరోక్రాట్ లు.  
మరి మనం ఏమిచేయాలి ?

ఎవరైనా ధనవంతుడు, అతనికి ఉన్న విదేశీ సంపద నుండి 3000 కోట్లు ఖర్చు పెడితే మన స్టాక్ మార్కెట్ కుప్ప కూలిపోతుందని ఒక ఆర్థికవేత్త చెప్పాడు. ఎన్నికలకు ముందు స్టాక్ మార్కెట్ పడిపోతే మధ్యతరగతి ఓట్లు మోడీకి పడవు. ఇది ఒక అంచనా మాత్రమే సుమా ! నిజానికి అంత ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు. 2019 ఎన్నికలలో ఓటర్లు ఎలాంటి ప్రలోభాలకు, కులమత పోలరైజేషన్ కు లొంగ కుండా కాస్త దేశాభిమానం తో ఉంటే చాలు. 
హిందుత్వ ను భారతదేశంలో స్థాపన చేసే ది మోడీ కానే  కాదు. విదేశీ తొత్తులు ఆ పని ఎందుకు చేస్తారు?
విదేశీ బాంక్ లే మన రాజకీయపార్టీలకు నిధులు, డొనేషన్ లు  బాహాటం గా ఇచ్చే రోజు వస్తుంది. అలంటి చట్టాన్ని నిస్సిగ్గుగా మొన్న పాస్ చేశారు. అపుడు మన పార్లమెంట్ లో ఉండేది విదేశీ తొత్తులు తప్ప భారతీయులు కాదు. ఎన్నికలలో ఎవరు గెలిస్తే మాత్రం ఏమిటి లాభం? వాళ్ళను  విదేశీ తొత్తు లుగా మార్చే డబ్బు మూటలతో విదేశీ కంపెనీలు సదా సిద్ధంగా ఉంటాయి. 
ఏది ఏమైనా  ఇపుడు మోడీ ని దేశ భక్తులు ఎవరైనా  ఓడించవచ్చు. తప్పనిసరిగా ఓడించాలి కూడా !ఎందుకంటే మోడీ నమ్మకాన్ని నిలబెట్టుకో లేకపోయాడు. ప్రజావిశ్వాసాన్ని రోజు రోజుకీ కోల్పోతున్నాడు . భారతీయుల ముఖాలలో నవ్వుని తీసేసిన మోడీ ని ఎవరుమాత్రం ఎలా బలపరుస్తారు?


No comments:

Post a Comment