Search This Blog

Wednesday, 22 June 2016

crop loan waiver -2nd phase

రాష్ట్రంలో మొత్తం 55 లక్షల రుణ ఖాతాలకు మాఫీ వర్తింపచేయాలని గతంలోనే నిర్ణయించింది. ఇందులో భాగంగా రూ.50వేల లోపు రుణాలను ఒకేసారి మాఫీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించడంతో... ఇరవై మూడున్నర లక్షల ఖాతాలకు ఒకేసారి పూర్తిగా రుణ ఉపశమనం కలిగింది. మిగిలిన ముప్పై ఒకటిన్నర లక్షల ఖాతాలకు ఇప్పుడు ఈ సర్టిఫికెట్లు అందచేస్తున్నారు. 

ఆ రైతుకు సంబంధించి ఇంకా ఎంత రుణం మాఫీ కావాల్సి ఉంది, ఇప్పుడు ఎంత అవుతోందన్నది దీనిపై ముద్రించారు. ఆ రైతు రుణం ఉన్న బ్యాంకు ఖాతాల వివరాలు, ఆ రైతు ఆధార్‌ నెంబర్‌ కూడా దానిపై ముద్రించారు. 

ఈ సర్టిఫికెట్లను రైతులు ఆయా బ్యాంకులకు తీసుకెళ్లి అందచేస్తే అక్కడి అధికారులు ఆ వివరాలు నమోదు చేసుకొని రాష్ట్ర ప్రభుత్వ రైతు సాధికార సంస్థకు పంపిస్తారు. వివరాలు వచ్చిన రెండు మూడు రోజుల్లో సంబంధిత బ్యాంక్‌ శాఖకు ప్రభుత్వం ఆ డబ్బు పంపిస్తుంది. ఆ విషయాన్ని రైతులకు ఒక ఎస్‌ఎంఎస్‌ ద్వారా తెలియచేస్తారు

Sunday, 8 May 2016

సంజాయిషీ ఇచ్చుకోవలసిందే!

" పన్ను మినహాయింపు లేవీ ఇవ్వము , ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వము,   ప్రత్యేక హోదా ఇవ్వం ....    మీ చాత నైన్ది  చేసు కోండి  అని కుక్కనికొట్టినట్టు చెప్పాక కూడా  మనం ఏమీ చే యలేక  పోతున్నాం !
కేవలం ఆంధ్రాకి వెల్లువెత్తు తున్న పరిశ్రమల కు అడ్డు కట్ట వేయడానికి మోడీ ప్రభుత్వం ఎత్తిన
దుర్మార్గపు ఎత్తుగడ  ఇది"........ అని ప్రజలు తిరుగుబాటు చేయక ముందే మోడీ మేల్కోవాలి .

అటు రాజధాని లేదు . ఇటు ఆదాయం లేదు .ఏపీ ఇప్పుడు దీనస్థితిలో ఉంది. ఇలాంటి స్థితిలో ఉన్న ఏ రాష్ట్రాన్నైనా నిబంధనల పేరిట ఆదుకోకపోవడం దుర్మార్గమే అవుతుంది. అంతేకాదు... సమాఖ్య వ్యవస్థపైనే ప్రజలకు నమ్మకం పోతుంది.
మమ్మల్ని ఏమి చేద్దామని విడగొట్టారు?’ అని ఏపీ ప్రజలు సంధించే ప్రశ్నకు అటు కాంగ్రెస్‌, ఇటు బీజేపీ రెండూ సంజాయిషీ ఇచ్చుకోవలసిందే!

Monday, 2 May 2016

130 కోట్ల మంది జనాభాలో కేవలం 1% ప్రజలు ... అనగా కేవలం 1.5  కోట్ల మంది మాత్రమె ఆదాయపు పన్ను 
కడుతున్నారు . 
 కాగితాలలో ఏడాదికి 4లక్షల లోపు ఆదాయం చూపుతున్న వారు 25లక్షలు . 
అలాగే ,5 నుండి 10 లక్షల ఆదాయం చూపుతున్న వారు 25 లక్షలు . 
ఇంకో 2కోట్ల మంది పన్ను రిటర్నులను దాఖలు చేస్తున్నారు గానీ , వీరు ఒక్క పైసా కూడా పన్ను కట్టరు . 
ఆదాయపు పన్ను రూపేణా ప్రభుత్వానికి సుమారు 3లక్షల కోట్లు రాబడి వస్తుంది . 

Friday, 22 April 2016

News - april 2016

1. దాదాపు రూ. 9,600 కోట్లకు విస్తరించిన భారత ఐటీ పరిశ్రమ ఈ సంవత్సరం 2.75 లక్షల మందికి ఉపాధి కల్పించ బోతుంది . అయినా , ఆటోమేషన్ ఎక్కువ అవుతుంది కాబట్టి , ఉద్యోగాలు తగ్గడానికి అవకాశం ఉంది . కాబట్టి ఇంజనీరింగ్ లో  90%, కమ్యుని కేషన్ నైపున్యాలలో  మంచి పట్టు ఉన్నవారికి డోకా లేదు . 

2. మోడీ పాలనకి మరో కితాబు ...  2015లో చైనా, అమెరికాలకు వచ్చిన విదేశీ నిధుల(FDI) కంటే, ఇండియాకు అధిక నిధులు వచ్చాయని 'ఎఫ్డీఐ ఇంటెలిజెన్స్' తన తాజా రిపోర్టులో వెల్లడించింది. చేపట్టిన ప్రాజెక్టుల సంఖ్యలో సైతం 8 శాతం పెరుగుదల నమోదైందని, మొత్తం 697 ప్రాజెక్టుల్లో 63 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 4.20 లక్షల కోట్లు) పెట్టుబడిగా వచ్చిందని తెలిపింది.

Tuesday, 5 April 2016

'పనామా పేపర్స్'

పనామా పేపర్స్' వెల్లడించిన జాబితాల్లో (నల్ల ) ధనాన్ని విదేశాల్లో దాచినవారి లో ఎంత మంది ఆ పనిని చట్ట విరుద్దం గా చేశారో  గుర్తించ వలసిన బాధ్యత సిబీడీటీ, ఈడీ తదితర ఆర్ధిక నేర దర్యాప్తు సంస్థల చేతిలో ఉంది . 
విదేశాల్లో బ్యాంకు ఖాతా ఉండాలంటే, అందుకు సరైన కారణం చూపాల్సి వుంటుంది . 
ప్రతి భారతీయుడూ చట్టబద్ధంగా ఒక సంవత్సరం కాల వ్యవధిలో 2.50 లక్షల డాలర్లు (సుమారు రూ. 1.60 కోట్లు) విదేశాల్లో పెట్టుబడులు పెట్టవచ్చ ని ఆర్ధిక నిపుణులు చెబుతున్నారు . 
కాబట్టి జాబితాలో పేర్లు ఉన్నంత మాత్రాన అందరినీ నేరస్తులని ఇప్పుడే చెప్పలేము . 
తొందరపడి అందరిపైనా బురద జల్ల కూడదు . 

Monday, 4 April 2016

చంద్ర బాబు చేతులను ఎందుకు బల పరచాలి


  • పరిపాలన చేపట్టిన మూడు నెలల్లోనే కరెంటు సరఫరాను గాడిలో పెట్టినందుకు,
  • మన రాష్ట్రం కరెంట్ ఉత్పత్తి లో ,లైన్ నష్టాల నివారణలో , పునరుత్పత్తి  ఇంధన వనరుల వినియోగం లో దేశం లోనే ముందుకి  .. అదీ 2 ఏళ్లలో సాధ్యం చేసి నందుకు ,… 
  • హుదుద్ కు అల్లకల్లోలమైన విశాఖను ఒక్క నెల రోజుల్లోనే మళ్ళీ సాధారణ స్థితికి తీసుకు రావడమే కాదు , పారిశ్రామిక -వినోద -సాంకేతిక -ఆర్ధిక కేంద్రం గా వైజాగ్ ని వేగం గా మలుస్తున్నందుకు ... …
  •  నూతన రాజధాని కోసం చేపట్టిన ప్రణాళికలు… పెట్టుబడుల కోసం గతం లో ఏ ముఖ్య మంత్రీ గానీ .. ప్రధాన మంత్రి గానీ చేయని భగీరధ ప్రయత్నాలు చేయడమే కాక ,ఆచరణలో అత్యంత వేగ వంత  మైన రీతిలో ఫలితాలను కూడా రాబడు  తున్నందుకు ,  
  • నదీ జలాల అనుసంధానంలో భాగంగా పోలవరం పూర్తయ్యే లోపు  ఒక్క ఏడాదిలో, పట్టిసీమ  ప్రాజెక్ట్ ద్వారా ఎత్తిపోతల ప్రాజెక్ట్ ను పూర్తి చేసినందుకు .... 

  • వేల కోట్ల ఇసుక మాఫియాని ఒక్క కలం పోటుతో  దిమ్మ తిరిగే దెబ్బ కొట్టి నందుకు ... 
  • వేల  కోట్ల ఎర్ర చందనం  మాఫియాని ఇనప బూట్లతో అణచి వేస్తున్నందుకు .... 

  • దేశం లోనే మొట్ట మొదటి సారిగా ఓ చిన్న రాష్ట్రం అదీ లక్ష కోట్లు విలువ చేసే రాజధాని ఆస్థులను ,మరో  పది లక్షల కోట్లు విలువ చేసే రాజధాని మౌలిక సదుపాయాలను కోల్పోయి... అంతే కాదు 20 వేల కోట్ల  వార్షిక రెవెన్యూ లోటు  తో విల విల్లాడుతూ కూడా ....   5 లక్షల కోట్ల పెట్టు బళ్ళను  ఆకర్షింప చేసినందుకు ...  

  • చరిత్రలో కనీ వినీ ఎరగని రీతిలో ఆరుగాలం సాగుచేసుకొనే రైతన్నలకు ఋణ ఉపశమన పధకాన్ని .. ఎంత నెమ్మది గా నైనా  చిత్త శుద్ధి తో అమలు  చేస్తున్నందుకు ... 
  • అనవసర మైన ఖర్చులతో ,ఎడా  పెడా ఎరువులు -పురుగు మందులు చిమ్ముతూ వళ్ళు  ఇళ్ళే కాదు ... భూమిని కూడా గుల్ల చేసు కొంటున్న అమాయక రైతన్నలకు కనీస పెట్టుబడితో చేసే  పాలేకర్  ప్రక్రుతి వ్యవసాయ విధానంలో శిక్షణ ఇస్తున్నందుకు ... 
  • ప్రభుత్వ ఖజానా నుండి ఒక్క చిల్లి గవ్వ ఖర్చు పెట్టకుండా , దేశం లోనే తొలిసారి వేలాది ఎకరాల భూమిని స్వచ్చందం గా సమీకరింప చేసి ఒక బృహత్తర రాజధాని నిర్మాణం లో  ప్రజలకు భాగ స్వామ్యం కల్పించి కేవలం 2 ఏళ్లలో సెక్రటేరియట్ ,శాసన సభలను నిర్మించడమే కాదు ... అద్భుత రాజధాని  నిర్మాణ  పధకాలను( core capital master plan and integrated capital master plan and CRDA zonal master plan) కూడా కేవలం 2 ఏళ్లలో కాగితాలనుం డి కల సాకార మయ్యే దిశగా పరుగులు పెట్టిస్తున్నందుకు ... 
  • డిజిటల్ విప్లవం  లో  ఆంధ్ర రాష్ట్రం  ను ముందజ  వేయిస్తున్నందుకు ... ఫైబర్ నెట్ గ్రిడ్ , ఈ - ప్రగతి లాంటి సాంకేతిక సౌకర్యాలతో పల్లెల్లో కూడా సమాచార  విప్లవం తో సంపదని ఎలా పెంచు కోవచ్చో చేసి చూపిస్తున్నందుకు ...