Search This Blog

Thursday 13 December 2012

నాద యోగం

సాధకులందరి గమ్యం - సంకల్ప శూన్యత ,తద్వారా చిత్త వ్రుత్తి  నిరోధం ,మనోలయం  .

సంకల్ప శూన్యత (వికల్పం ) ఎలా కలి గి  సుస్థిర మవుతుంది ?
నేను,నా శరీరం ,నా సంపద ,నా కుటుంబం - అనే అభిమానం
సుఖం ,దుఖం - అనే ద్వంద భావం --- ఇవన్నీ భ్రాంతి  అని నమ్మి శ్రద్ద తో వైరాగ్యం అభ్యసిస్తే
చూ చేది (దృశ్యం ) ,చూచే వాడు (ద్రష్ట ) ఉండరు .చూడటం అనేది ఉంటుంది .
అంటే  సాక్షిగా  ఉంటాము .

సదా శివుడు భోధించిన 1లక్షా 25000 లయ యోగ పద్దతుల లో నాద యోగం అనుకూలమైనదని పెద్దలు చెబుతారు .
మన శరీరం లో ఉన్న నాడులు , చక్రాలు అన్నీ శు ద్ది పొందా లంటే ప్రాణా  యామం చేయాలి .
శుద్ది  జరిగిందనే దానికి గుర్తు -- అనాహత నాదం సాధకుడు విన గలుగు తాడు . ఆ నాదం పై చిత్తాన్ని లగ్నం చేయడమే నాదాను సంధానం .
ప్రాణమూ ,చిత్తమూ బొమ్మ బొరుసు ల్లాంటివి .ఒకదానిని నియంత్రిస్తే రెండోది నియంత్రిత మవుతుంది .

ప్రాణా యామ అభ్యా సం  -----> నాడీ  శుద్ది ----> అనాహత నాద శ్రవణం ----> నిరంతర మూ నాదం పై చిత్త  లగ్నం ----> ప్రాణ వాయువు సుషుమ్నా నాడీ  ప్రవేశం ----> అనాహతంలో ప్రాణ వాయువు లయం ----> మనోలయం .

No comments:

Post a Comment