Search This Blog

Tuesday 18 December 2012

విద్యా విదానం శరణమ్ గచ్చామి :

సంఘం ఎలా ఉండాలి ? ఎలా ఉంటే శాంతి సంతోషాలు ఉంటాయి ?
సంఘం లోని ప్రజల జీవన విధానాన్ని సంస్కృతి అంటారు . ఈ    సంస్కృతి విధ్యా   విధానం పై ఆధార పడి ఉంటుంది .
విధ్యా   విధానం ----> సంస్కృతి ---->   శాంతి సంతోషాలు.

వేద ఋషులు రరకాల మానవ  మనస్తత్వాలను పరిశీలించి ,మనుషుల్లోని స్వార్ధము మొదలగు అరిష డ్వర్గాల సమ్మేళ నాన్ని,  వాటి వల్ల  వచ్చే పరిణామాలను అంచనా వేసి , వివాహ వ్యవస్థను , గుణ కర్మ ల కను గుణ మైన  వర్ణ   వ్యవస్థను (నేటి కుల వ్యవస్థ కాదు ) ప్రోత్స హించారు .
ఏ సంఘ మైనా ప్రజల జీవనోపాధి , జీవిత పర మావధి -రెంటినీ సమానం గా ఆదరించి నప్పుడే ,  అ సంఘం లో    శాంతి సంతోషాలు పరిడ విల్లు తాయి .
సత్వ గుణం ఉన్న ప్రజలకు ,  జీవిత పర మావధి కి అవసర మైన మానవ చైతన్య పరిణామ  లేదా ఆత్మ వికాసానికి  దారి చూపించే భాద్యత నిచ్చారు . వారు ధర్మ  , న్యాయ ,తర్క  ,మీమాంస ,రాజ నీతి  ,అర్ధ , ముహూర్త , జ్యోతిష , వ్యాకరణ, భాషా , వైద్య  ,మంత్ర ,యోగ ,ఆగమ శాస్త్రాలను రచించి ప్రజలకు మార్గ దర్శ నం చేసే వారు .

రజో గుణం ప్రధానంగా ఉన్న వారికి సంఘ రక్షణ భాద్యత లను అప్ప చెప్పారు . వారే కాల క్రమేణా క్షత్రియులుగా రాజ్యా ఏలారు .
జన పద మైనా ,గణ తంత్ర రాజ్య మైనా , పెద్ద సామ్రాజ్య మైనా రాజ గురువులు ,మంత్రి మండలి , న్యాయ ధర్మ మండలి రాజుకి పాలన లో సాయం చేసేవి .
రజో తమో గుణ మిశ్రమం ఉన్న వారికి వ్యాపార వృత్తిని ,సరకు కొని అమ్మే వృత్తిని కేటాయించారు .
తమో గుణం ప్రధానంగా ఉన్న వారికి వస్తూత్పత్తిని ,వ్యవసాయాన్ని కేటాయించారు .

వ్యక్తీ స్వ ధర్మాన్ని  నాలుగు పురుషార్ధా లైన  ధర్మార్ధ కామ మోక్షా లను  ధర్మంగా సాధించు తుంటే  , ఏ సమాజ మైనా ధర్మ బద్దం గా  నడిచి శాంతి సంతోషాల తో ఉంటుంది .
ధర్మానికి మూలం  మంచి విద్యా విధానం . 
విద్య జీవనోపాధి కే కాదు  , జీవిత పర మావధి  కీ ఉపయోగ పడి తేనె , ఆ విద్య సార్ధకం , ఆ సమాజం  బృందావనం అవుతుంది .

No comments:

Post a Comment