Search This Blog

Friday 18 January 2013

ఆంద్ర ప్రదేశ్ ని విడ గొడితే , అది చారిత్రిక తప్పిదమే . తెలుగు ప్రజల భవిష్యత్ అంధ కారమే.

ప్రజా స్వామ్య దేశం లో అన్ని వర్గాల ప్రజల అభీష్టాలకు విలువ ఇవ్వాలి . అలాగే తెలంగాణ నాయకుల ,ప్రజల మనోభావాలకు ,అదే సమయం లో వారితో ముడి పడి ఉన్న సీమాన్ద్రుల  మనోభావాల కు కూడ విలువ ఇవ్వాలి .
రెండు  విరుద్ద  భావనలను సంయమనం చేసే ముందు  , మానవతా విలువలకు ,మానవ అభివృద్దికి ,  కనీస ఆర్ధిక భద్రతకు పెద్ద పీట వేయాలి .అంతే గాని కొన్ని వర్గాల వారి  సెంటిమెంట్ లకు విలువ ఇస్తే సంఘ జీవనం చేస్తున్న మానవ సమూహాలకు హాని కలుగుతుంది . ప్రతి మనిషి  మనోభావాలను పరి రక్షించు కోవలసిన నైతిక భాద్యత ప్రభుత్వానిది ,ఆ సంఘ జనాలదీ .

3.5 కోట్ల జనం , విస్తార మైన అడవులు ( 45%  of A.P.) , భూగర్భ గనులు (బొగ్గు, బాక్సైట్ ,సున్నపు రాయి  , మైకా ) , మూసీ ,గోదావరి ,కృష్ణా నదులు పారాడే ఒక లక్ష చదరపు కిలోమీటర్ల  "తెలంగాణ "  పుట్టింది 1950 జనవరి 26.
అంతకు మునుపు ,హైదరాబాద్ రాష్ట్రం లో భాగం గా ఉండేది .

మహారాష్ట్ర ,కర్ణాటక ,తమిళనాడు ,ఆంధ్రా   లోని ఎన్నో ప్రాంతాల కలయిక తో హైదరాబాద్ రాష్ట్రం విశాలముగా  ఉండేది .నిజానికి బీదర్,ఔరంగాబాద్ నుండి తిరుచిరాపల్లి వరకు అనగా కోస్తా జిల్లాలు కూడ హైదరాబాద్ రాష్ట్రం లో భాగం గా ఉండేవి.తెలంగాణా ప్రాంతం సువిశాల హైదరాబాద్ రాష్ట్రం లో ఓ చిన్న ప్రాంతం . కాబట్టి చరిత్ర చూసినా హైదరాబాద్ రాష్ట్రం  పై తెలంగాణ వారికి ఎంత అనుబంధం ఉందో ,అంతే సంబంధం కోస్తావారికీ ఉంటుంది .

5 కోట్ల జనం , 1000 కిలోమీటర్ల సాగర తీరం , సహజ వాయు నిక్షేపాలు ,ఓడ రేవులు ,  గోదావరి ,కృష్ణా నదులు చివరి మజిలీ చేసే  1.5 లక్షల  చదరపు కిలోమీటర్ల "సీమాంధ్ర " పుట్టింది 1953 .
అంతకు మునుపు మద్రాస్ రాష్ట్రం లో భాగం గా ఉండేది .

20 February 1956 న ఇరు ప్రాంతాల పెద్దల మధ్య కుదిరిన ఒప్పందంతో  "తెలంగాణ , సీమాంధ్ర - రెండూ కలిసి ఆంద్ర ప్రదేశ్  గా పుట్టింది   నవంబర్ 1,1956.

"తెలంగాణ" నాయకులు  విడి పోతామని  ఎందుకు  అంటున్నారు ?
దేనికైనా అధికారం ,డబ్బే కారణం .

Selfish sentiment Leads to Financial calamity !
చాలా కొద్ది మంది సెంటిమెంట్ కోసం , కోట్లాది ప్రజల ఆర్ధిక భవిష్యత్ ను బుగ్గి చేయడం ఎంతవరకు సబబు ?
కాలం మారుతుంది .ప్రజలూ సర్దుబాటు చేసుకొని మరింత కష్ట పడి తమ ప్రాంతాలను అభివృద్ధి చేసు కొంటారు . ఏదోవిధంగా రెండు ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయి .కానీ ఇది జరగటానికి ఎన్నో ఏళ్ళు పడుతుంది .ఈ లోపు,కొన్ని తరాల ప్రజలు ఆర్ధికం గా , సాంస్కృతికం గా నలిగి పోతారు .  
రాజ ధా ని , పరిపాలనా భవనాలు  నిర్మించు కోవాలి .నీటి పారుదల ప్రాజక్ట్ లు , ధర్మల్ ప్రాజక్ట్ లు , SEZ లు , పరిశ్రమలు , యూ నివర్సిటీలు  ,హాస్పిటల్స్  ఇవన్నీ నిర్మించు కోవా లంటే నిధులు , దార్శినికులైన నాయకులు కావాలి .
ప్రశాంతం గా సాగిపోతున్న రాష్ట్రాన్ని రావణ కాష్టం గా మార్చు కోవాలనే ఆలోచన , ఈ గ్లోబలైజేషన్ కాలం లో అంత అవసరమా ?
 కొద్ది మంది రాజకీయ నాయకుల స్వార్ధానికి  కోట్లాది ప్రజలు , విద్యార్ధులు బలి కాక తప్పదా ?
ఇది మానవ జనిత ఉత్పాతం . ప్రపంచ మంతా ఆర్ధిక  మాంద్యం ఉన్న ఈ పరిస్థితి లో గోరు చుట్టు పై రోకటి పోటులా రాష్ట్ర విభజన , సామాన్యుడిని కుంగ దీయక మానదు . మన రాష్ట్రం ( రాష్ట్రాలు )50 ఏళ్ళు వెనుక బడి  పోక తప్పదు .
State revenue coming from different areas: రాష్ట్ర రెవిన్యూ  ఆదాయం లో    వివిధ ప్రాంతాల పాత్ర  (2011  ) :
హైదరాబాద్ మహా నగర  నుండి  : 40%
తెలంగాణ" నుండి  : 22%
సీమాంధ్ర  నుండి  : 18%
శిస్తుల లో కేంద్రం ఇచ్చే  వాటా : 20%
అనగా హైదరాబాద్ మహా నగరం  లేక పోతే సీమాంధ్ర , తెలంగాణా లు
 బతక  లేవు .
తెలంగాణ వెనుక బాటు కి కారణాలు :
  • 70% గోదావరి ,కృష్ణా నదుల పరీవాహక ప్రాంతం  తెలంగాణ లో నే ఉంది .అయినా భౌగోళిక ముగా,  నదు ల ప్రవాహం ,సాగు భూముల మధ్యన ఎంతో అంతరం ( huge difference in levels) ఉండటం  వల్ల ఎత్తిపోతల పధకాలు తప్ప వాలుని ఉపయోగించు కొనే కాలువలు ,ఆన కట్టలు నిర్మించ లేని పరిస్థితి .
  • విద్య కి ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వక పోవటం .అందుకే మన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులలో తెలంగాణ ప్రాంతీయుల శాతం 25% మాత్రమే.
  • దొరల ,ర జాకార్ ల , దేశముఖ్  ల పాలనలో అణగారిన బానిస మనస్తత్వం ...
  • ఉద్వేగ పూరిత ఉద్యమ కార క మానసిక స్థితిని ఉపయోగించుకొనే రాజకీయ కామందులు 
ఇన్ని కారణాలు ఉన్నా ,కలిసి ఉండటం వలనే వారు వెనుక బడి పోతున్నారని తెలంగాణ మేధావులు కూడా ప్రచారం చేయడం భాధాకరం .
నిజంగా తెలంగాణ ప్రజలందరికీ విడి పోయి వేరే రాష్ట్రం కావాలనుకోన్నా అది ఎంతో  ఖర్చు , బాధ లతో కూడుకొన్న ఖరీదైన కోరిక .
వారి కోరికని  అందరూ గౌరవిద్దాం . కానీ ,కోరిక తీర్చు కోవాలని అనుకొనే వారే మూల్యం చెల్లించు కోవాలి .

No comments:

Post a Comment