Search This Blog

Monday 24 February 2014

తన్ను కోకండిరా . కష్ట పడి పనిచేయడం మొదలెట్టండ్రా

అటు ప్రజలు,ఇటు నాయకులు రాజధాని కోసం తన్నుకొంటు న్నారు .
జరిగిన విభజన ను అడ్డుకో లేకపోయిన  వీరి పౌరుషం ఇప్పుడు తమ ప్రాంతమే రాజధాని అవ్వాలని పరవళ్ళు తొక్కుతుంది .
తలకు 25000 రూపాయల అప్పుతో 5కోట్ల సీమాన్ద్రులు   తల్ల దిల్లుతూ  దిక్కులేని అనాధల్లా మిగిలి పోవడానికి కారణం ఎవరు ?
తెల్ల కాలర్ ఉద్యోగాలు చేసే వాళ్ళలో 60శాతం సీమాంధ్ర కి చెందిన వారే . ఇప్పుడు వారంతా ఒక క్రమ పద్దతిలో హైదరాబాద్ ని వదిలి సీమాంధ్ర కి తిరిగి రావలసిందే .
విద్యార్ధులకి ఉపాది అవకాశాలు లేక రోడ్లు పట్టవలసిన దుస్థితి .
సరే . ఇలాంటి మాటలు చెప్పీ చెప్పి విసు గోచ్చేసింది .
ఇప్పటి కైనా కళ్ళు తెరిచి , ఆఫేసు లన్నీ ఒకే చోట కుప్ప పోయకుండా, అభివృద్ధి వికేంద్రీ కరణ ద్వారా   అన్ని జిల్లాలు అభివృద్ధి చెందే టట్లు చూడాలి .

నేటి  సమాచార విప్లవ కాలంలో దూరాలకు సంబంధం లేకుండా ఆడియో -విడియో సమావేశాలను చక్కగా నిర్వర్తించు కోవచ్చు . అలాగే ఉద్యోగులను కూడా నెమ్మది గా క్రమ పద్దతి లో తగ్గించు కోవచ్చు .

హైకోర్టు మరికొన్ని న్యాయ వ్యవస్థకి సంబంధించిన కార్యా లయాలు గుంటూరు  జిల్లాలో ,
వ్యవసాయం,పశువుల,కోళ్ళ ,చేపల పెంపకానికి సంబంధించిన ఆఫీసులు
నెల్లూర్ ,  తూర్పు- పశ్చిమ గోదావరి లో ,
భారీ పరిశ్రమలు, సముద్రయాన ,నౌకా నిర్మాణ పరిశ్రమల ఆఫీసులు తీరం వెంబడి ,
జల విద్యుత్ ,ధర్మల్ విద్యుత్ , అణు విద్యుత్ ఆఫేసులు ఆయా పరిశ్రమలున్న చోట ,
చేనేత ,హస్త కళా కారీ మొదలగు కుటీర పరిశ్రమలు ఆయా గ్రామాలకు దగ్గరలోని మండల కార్యాలయాలలో ,
చిన్నతరహా ,మధ్య తరహా పరిశ్రమల ఆఫీసులు అనంతపూర్ లో ,
జలరవాణా,రోడ్ రవాణా ఆఫేసులు విజయవాడ లో ,
ఇరిగేషన్ ,మురుగుపారుదలకి సంబంధించిన ఆఫీసులు శ్రీశైలం లో ,
 గనుల శాఖ ఆఫీసులు కర్నూల్ లో ,
వ్యవసాయ పరిశ్రమల ఆఫీసులు చిత్తూర్ లో ,
ఆయుధ పరిశ్రమల ఆఫీసులు కడపలో ,
ఇలా ఆయా కార్యాలయాలు వాటికీ  సంబంధించిన పరిశ్రమలకు దగ్గరలో ఏర్పాటు కావాలి .

సీమాంధ్ర లో దరిదాపు 100 ఇంజనేరింగ్ కాలేజీలు మూత పడే స్థితిలో ఉన్నాయి . కేంద్ర ప్రభుత్వం వాటిని కొని , వివిధ కార్యాలయాలకు అనుగుణం గా తీర్చి దిద్దు కోవచ్చు .
అలాగే నాగార్జున విశ్వ విద్యాలయాన్ని సెక్రటేరియట్ గా మలచు కోవచ్చు .




No comments:

Post a Comment