Search This Blog

Friday 7 February 2014

రధ సప్తమి -సనాతన భారత కాల వి జ్ఞాన ధార .

Surya Namaskaraపిల్లలు,పెద్దలు  నిత్యం సూర్యోదయ  వేళలో ఈ బొమ్మలో చూపిన విధం గా సూర్య నమస్కార వ్యాయామం చేస్తే , వారు  హాస్పిటల్స్ కి వెళ్ళే పని ఉండదు . 
నువ్వుల నూనె శరీరానికి పట్టించి ,ఆర్క పత్రం (జిల్లేడు ఆకులు ) మన శరీరానికి తగిలించు కొని స్నానం చేయడం రధ సప్తమి నాడు ఆచరించ వలసిన విధి . 
సూర్య దేవుని పుట్టిన రోజు గా, వివస్వంత మన్వంతరానికి నాంది గా మాఘ శుద్ద సప్తమి ని ఓ పండుగ గా భారత ప్రజలు జరుపుకొంటారు . అలాగే  ఈ రోజే వసంత రుతు ప్రవేశం. పల్లెల్లో పంట కోత  కొచ్చే సమయం .
చంద్రుడు భూమి చుట్టూ ,భూమి సూర్యుని చుట్టూ,సూర్యుడు ధ్రువ నక్షత్రం చుట్టూ ప్రదక్షిణ చేస్తాయి .
 
భూమి సూర్యుని చుట్టూ చేసే ప్రదక్షిణ మార్గ మే  సూర్య రధ మార్గం . రధ సప్తమి నాడు ఆ రధం ఉత్తర దిక్కుగా మలుపు తిరుగుతుంది .
సూర్యుని గమనం,భూ భ్రమణ-పరిభ్రమణ లే కాలానికి కొ ల మానాలు .
సనాతన ఋషులు కాలాన్ని ఎంత సూక్ష్మం గా కొలిచారొ మన విద్యార్ధులు అర్ధం చేసుకోవాలి .
మన సౌర కుటుంబం  వయస్సు 500 కోట్ల సంవత్సరాలు .
బ్రహ్మ కాలంలో ఒక పగలు ని కల్పం  అని అంటారు . ప్రస్తుత కల్పం వయస్సు 500 కోట్ల సంవత్సరాలు .
కల్పం ప్రారంభం లో ,భూమి ని హిరణ్యాక్షుడు తీసుకెళ్ళి కాస్మిక్  అంతరాళం లో (సముద్రం లో) దాస్తాడు .
  సృష్టి ని ప్రారంభించ డానికి  భూమి లేక పోయే సరికి,బ్రహ్మ,  విష్ణువు ని ప్రార్ధన చేయగా , శ్రీ మహా విష్ణువు శ్వేత వరాహ రూపం లో హిరణ్యాక్షుణ్ణి  సంహరించి భూమిని మరల దాని స్థానం లో నెలకొల్పుతాడు . అందుకే ఈ కల్పాన్ని శ్వేత వరాహ కల్పం అని అంటారు .

ఒక కల్పం = 14 మన్వంతరాలు
ఒక మన్వంతరము = 72 చాతుర్ యుగాలు
ఒక చాతుర్ యుగము = 43 లక్షల సౌర లేదా మానవ సంవత్సరాలు.

ఒక కల్పం లో 14 మన్వంతరాలు ఉంటాయ్ . అనగా బ్రహ్మకి పగలు అంటే 14 బ్రహ్మ గంటలు అని గుర్తు పెట్టుకోండి.
ఒక మన్వంతరం లో 72 చాతుర్ యుగాలుంటాయి . అనగా బ్రహ్మకి ఒక గంటకి 72  బ్రహ్మ నిమిషాలు అని గుర్తు పెట్టుకోండి.
అంటే ,బ్రహ్మ కి ఒక నిమిషం అంటే , ఒక చాతుర్ యుగము . అంటే సుమారు 43 లక్షల సౌర లేదా మానవ సంవత్సరాలు.


  • ఎందుకు సూర్యుడు ఉత్తర దిక్కు (ఉత్తరాయణం )మరియు దక్షిణ దిక్కు గా ప్రయాణం చేస్తున్నట్టు కన్పిస్తాడు 

 సూర్యుని చుట్టూ, భూమి కొద్దిగా వంగి తిరుగుతూ ఉండటం వలన.
ఇలా ఒక పక్కకు వంగి ఉన్న భూమి పై పడే సూర్య కిరణాల హెచ్చు తగ్గుల వలన  6 ఋతువులు ఏర్పడ్డాయి .


  • మనం ధ్రువ నక్షత్రం గా చెప్పు కొనే తార దేనిని సూచిస్తుంది ?  విశ్వం (galaxy)యొక్క కేంద్రాన్ని . దీనినే మన ఋషులు పరమ పదం అన్నారు. మేరు పర్వతం ధ్రువ నక్షత్రాన్ని చూ స్తూ ఉంటుంది . సూర్యుడు మేరు పర్వతం చుట్టూ తిరుగుతున్నట్లు వేద ఋషులు వర్ణించారు . అనగా సూర్యుడు విశ్వ కేంద్రం చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నాడు .


సూర్యుని ఆకర్షణ శక్తి వలనే గ్రహాలు ఏర్పడ్డాయి . గ్రహాలు  గతి తప్పక పరిభ్ర మించడానికి  కారణం సూర్యుడే .
సూర్యుని వ్యాసం మన భూమి వ్యాసానికి 108 రెట్లు . అలాగే, భూ -సూర్యుల కి మధ్య దూరం ,సూర్య వ్యాసానికి 108 రెట్లు .మన రాశి  చక్రం ను  108 నక్షత్ర పాదాలుగా విభజించారు .అందుకే  108 సంఖ్య కి అంత  ప్రాముఖ్యత .

ఏక చక్రరధం తో , 7 గుర్రాలతో ,14 బృందాల దేవతలు,మునులు,యక్షులు,60 వేల వాలఖిల్యులు  ప్రార్ధనలు చేస్తూ ఉంటుంటే ,అరుణుడు సారధిగా నడుస్తున్న సూర్యుడే  మన భూమండ లానికి సంభందించి నంత వరకు ప్రత్యక్ష దేవుడు . ఇదే మన కాలచక్రం . దీనినే సూర్య రధం అని పిలుచు కొంటాం .
భూమి సూర్యుని చుట్టూ తిరిగే కక్ష్య నే ఏక చక్రం అని ,కాంతి లోని 7 వర్ణాలను 7 గుర్రాలని , సూర్య మండలాన్ని ఆవరించి ఉన్న అయస్కాంత వలయం(magnetosphere) నే సారధి అరుణుడు అని వర్ణించారు . సూర్యుని తెల్లటి కాంతి సారధి ద్వారా పయనించి 7 రంగులుగా మన భూమిని తాకుతుంది .
మేరు పర్వతం ఊహా ? నిజమా? 
మేరువు వేరు . మేరు పర్వతం వేరు .
భూమి ఇరుసు లేదా అక్ష రేఖ నే మేరువు(earth axis) అని పురాణాలలో వర్ణించారు . ఆ అక్ష రేఖ పైనే ఉత్తర ధృవం లో మేరు పర్వతం ఉంది . ఆ పర్వతం సూటిగా ధ్రువ నక్షత్రాన్ని చూడటం వలన ఆ ప్రాంతం లో దేవ భూములు ఉంటాయని అక్కడ దేవతలు,స్వర్గం ఉంటాయని పురాణాలలో వర్ణించారు .
25   కోట్ల ఏళ్ల క్రితం మన ఖండాలన్నీ కలిసి ఒకే పెద్ద ఖండం గా(pangea) ఉండేవి . ఇలా ప్రతి 25 కోట్ల ఏళ్లకు ఖండాలు విడిపోవడం ,కలవడం చేస్తాయి(plate tectonics).

సనాతన నాగరికత . 
రెండు లక్షల ఏళ్ల  క్రితం మానవ జాతి ప్రస్తుతం ఆఫ్రికా అని పిలుచు కొనే పెద్ద ఖండం లో పురుడు పోసుకొని కాల క్రమేణా ఆహార అందుబాటు ,వాతావరణ పరిస్థితుల కు అనుగుణం గా వర్వేరు ప్రదేశాలకు వలస పోయింది . అలా వలస వచ్చి న వారు అత్యధిక శాతం భారత దేశం ముఖ్యం గా ప్రస్తుత ఆప్ఘనిస్తాన్,పాకిస్తాన్,ఇరాక్,ఇరాన్ ,ప్రాంతాలలో స్థిర పడింది . 3000 ఏళ్ల క్రితం ఇరాక్ నుండి ప్రస్తుత ఇండియా ,బర్మా ,థైలాండ్ ,మలేసియా,కంబోడియా ,ఇండోనేసియా వరకు భారత వర్ష మే .   భూమండలం లోనే మొట్ట మొదటి నాగరికత ఈ భారత వర్ష ము లోనే  అభివృద్ధి చెంది నాలుగు దిక్కులా పాకింది .

మరి కొంత మంది అప్పట్లో  గా  నివాస యోగ్యం గా ఉన్న  ఉత్తర ధ్రువ ప్రాంతానికి ,మరి కొంత మంది గ్రీకు,మొదలగు యూరప్ ప్రాంతానికి,దక్షిణ అమెరికా ,ఆస్త్రే లియా కి వలస వెళ్లి స్థిర పడ్డారు . 

No comments:

Post a Comment