Search This Blog

Tuesday 11 March 2014

కొత్తా రాష్ట్ర మండీ -

పూర్వం రాచరికాల కాలంలో పాలించే రాజు ఒక్కడు ధర్మం గా ఉంటే రాజ్యం సుభిక్షం గా ఉండేది . కానీ నేటి ప్రజాస్వామ్య యుగం లో ప్రతి మనిషి ధర్మం గా ఉంటేనే సంఘం శాంతం  గా ఉంటుంది .

తెలుగు ప్రజలకు రెండు రాష్ట్రాలు ఏర్పడ్డాయి . అధికారం కోసం ఎన్నో వర్గాలు తమ పోరు ప్రారంభించాయి .
ఇప్పటి వరకు ప్రాంతీయ విబేధాలను రెచ్చగొట్టిన రాజకీయులు ,కులాల వారీగా ప్రజలను చీల్చే పనిలో ఉన్నారు .
భాష ,కులం , మతం ,ప్రాంతీయత ,మనుషులను ఎలా వేరు చేస్తాయో మన దేశాన్ని చూస్తే అర్ధ మవుతుంది .


రెండు ప్రాంతాల్లో కొత్త సామాజిక శక్తులు రాజకీయాలను ప్రభావితం చేసే దశకు చేరుకున్నాయి. 
ఏ రాజకీయ పార్టీ అయినా దళితులను, మైనారిటీలను విస్మరించి దేశవ్యాప్త ప్రాబల్యం సంపాదించగలదా ? అనుమానమే ! 
తెలంగాణలో సుమారు 50 శాసనసభ నియోజకవర్గాలు సీమాంధ్రుల ఓట్ల పైనే ఆధార పడి యున్నాయ్ . 
సమైఖ్య రాష్ట్రం లో సుమారు 100 శాసనసభ నియోజకవర్గాలు,17 లోక్ సభ నియోజకవర్గాల లో 10 శాతం ముస్లిం వోటర్ లు ఉన్నారు . 

No comments:

Post a Comment