Search This Blog

Wednesday 12 March 2014

భూమిని,గోవుని ,అమ్మని కాచేవారు నవ్వుతూ ఉండాలి ...

దేశం లో 70శాతం ప్రజలు భూమిని నమ్ముకొన్న వ్యవ సాయదారులు,వ్యవసాయ కూలీలే .
 పొలం -పుట్రా, చె ట్టూ- చేమ, కొండా -బండ , అడవి - పోడు ,అరక - మడక ని నమ్ముకొన్న అమాయక జనాలే .

ఏటా 25కోట్ల టన్నుల ధాన్యం,ఇంకా కూరగాయలు,పండ్లు,అలాగే వాణిజ్య పంటలు పండిస్తున్నా వీరిలో 80శాతం మంది వారు చేసే పనిపై సంతృప్తిగా లేరు .
కారణం , చేలో ఎలుకలు,చీడపీడలు ,అంగట్లో దళారీ మూకలు,ఆకాశంలో గాలివానలు , అమలు కాని ప్రభుత్వ పధకాలు .
 8లక్షల కోట్ల రుణ పదకాలున్నా అవసర మున్న రైతులకు అందివ్వలేని  ప్రభుత్వ అసమర్ధత - ఇవన్నీ రైతుని మడి  నుండి పట్టణానికి పోమ్మంటున్నాయ్ .

సామూ హిక  ఎలుకల,చీడపీడల నివారణ ,
గోవుల ,జీవాల పెంపకం ద్వారా సమగ్ర వ్యవసాయం ,
సేంద్రియ ఎరువుల వాడకం ,పంట మార్పిడి ,
గ్రామాల్లో విత్తన శుద్ది ,విత్తన నిధి ఏర్పాటు ,
వ్యవసాయ ఉత్పత్తుల రక్షణకు శీతల గిడ్డంగుల ఏర్పాటు ,
సరిఐన సమయానికి రుణాల మంజూరు , అదునులో పదును కి సాయం ,
మండీల్లో మద్దతు ధరలు ,దళారుల నిర్మూలన  -------  ఇవన్నీ జరగవలసిన అవసరం ఉంది .

ప్రభుత్వం ఎన్నో ప్రణాళికలు రచిస్తుంది . కానీ కార్య క్షేత్రం లో ఆ పధకాలు,ప్రభుత్వ నిధులు అన్నీ పక్క దారి పట్టి రైతు నోటికి ఇంట మన్ను మశానం మిగులుతుంది .

రైతు భారతాన్ని సుసంపన్నం చేసే నాయకులు రావాలి .
రైతు లు కూడా మారాలి .

No comments:

Post a Comment