Search This Blog

Saturday 29 March 2014

 హిందూ ధర్మ శాస్త్రం,సత్సంతానానికి ,కులగోత్ర వం శ అభివృద్దికి ,అలాగే మనిషి మోక్షం పొందడానికి చేయ వలసిన కొన్ని గుహ్య    కర్మల కోసం , సమాజం జంతు స్థితికి  దిగ జార కుండా కాపాడు కోవటానికి -వివాహ చట్రాన్ని ఏర్పాటు చేసింది .
ఆయా కాల మాన పరిస్థితులకు  అనుగుణ్యమ్ గా కొన్ని విభిన్న మైన వివాహ  పద్దతులు వచ్చాయి . ఇంకా ఇంకా వస్తాయ్ .
ఏది ఎలా ఉన్నా స్త్రీ పురుష బంధం శారీరక,మానసిక,భావోద్వేగ ,సామా జిక స్థాయి లను దాటి ఆధ్యాత్మిక మార్గంలో నడవాలని  ఋషుల ముఖ్య ఉద్దేశ్యం .
పెళ్లి ఒక  పవిత్ర హోమం . మనిషి జీవితం లో జరగబోయే అనేక నిత్య నైమిత్తిక కర్మలు,హోమాలు,వ్రతాలు ,యజ్ఞాలకు వివాహ హోమం నాంది .

వివాహ సంప్రదాయ విధానం . 
పెళ్లి మండపం ప్రధాన ద్వారం దగ్గరే , ఆడ పెళ్లి వారు వరుడిని ,మగ పెళ్లి    వారిని  సాదరం గా- పూర్ణ కుంభ స్వాగతం తో  పెళ్లి మండపానికి ఆహ్వానించి , వరుడిని ఆశీర్వచనాలతో వేదిక పైకి తోడ్కొని వెళతారు . వధువు తల్లి,ఆ తర్వాత పురోహితుడు పెళ్లి కొడుకిని ఆశీర్వదిస్తారు . తర్వాత మగ పెళ్లి వారికి,వరుడికి మధుపర్కం లేదా  పానకం  ఇస్తారు .
వరుడు తూర్పు దిక్కుగా ,వధువు ఉత్తర దిక్కుగా నిలబడి ఉండి ,వధువు వరుడిని పెళ్ళిపీట పై ఆసీనుల వ్వమని కోరాలి . వరుడు కూ ర్చున్న  తర్వాత వధువు వరుడికి కుడి ప్రక్కన కూర్చోవాలి .
పురోహితుడు చేయించే  క్రమం . 

  • వరుడితో ఆచమనం,అంగ న్యాసం చేయించాలి . 
  • మధుపర్కం స్వీకారం . 
  • బహుమతుల ప్రధానం - వధువు తండ్రి వరుడికి ఆవుని ,ఇతర బహుమతులు ఇవ్వాలి . వరుడు వధువుకి బంగారం,వస్త్రాలు ప్రధానం చేయాలి . 


మిగతా భాగం తర్వాత పోస్టులో 

No comments:

Post a Comment