Search This Blog

Tuesday 25 March 2014

జై కిసాన్ ... జై హింద్




మన దేశంలో సుమారు 18 మి లియన్ టన్నుల ధాన్యం- వరి ,గోధుమ - గోడౌన్ లు లేక ఆరుబయట చాలీ చాలని టార్పాలిన్ ల క్రింద ముక్కిపోతున్నాయి . అంతే కాదు , ఈ ధాన్యాన్ని కాపాడటానికి ప్రభుత్వం ఏటా లక్ష కోట్లు ఖర్చు చేస్తుంది .

దీంట్లో 10 మి లియన్ టన్నుల ధాన్యాన్ని ఎగుమతి చేసినా 3 బిలియన్ డాలర్ ల విదేశీ మారక ద్రవ్యం వస్తుంది .
ఇంత  మిగులు వ్యవసాయ ఉత్పత్తికి కారణం ప్రైవేట్ విత్తన సంస్థలు , ముఖ్యం గా బిటి ,మోన్సా  టో ,పయోనీర్ లాంటి సంస్థలు పరిశోధనలపై బాగా ఖర్చు పెట్టి పత్తి  ,మొక్క జొన్న దిగుబడులను పెంచడమే .

మొదటి పచ్చ విప్లవానికి , తొలి క్షీర విప్లవానికి ప్రభుత్వమూ , సహకార సంస్థలు కారణ మైతే ,నేటి రెండో వ్యవసాయ విప్లవానికి కారణం , శాస్త్రజ్ఞుల కృషి ని చేలోకి తీసుకెళ్ళిన ప్రైవేట్ సంస్థల వాణిజ్య బలం .

సెప్టెంబర్ 2011 లో వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతుల పై  ఉన్న ఆంక్షలు తొలగించిన తర్వాత ఏటా 10 మిలియన్ టన్నుల వరి , 7మిలియన్ టన్నుల గోధుమ ని మనం ఎగుమతి చేయ గలుగు తున్నాము .

వ్యవసాయ రంగం లో పెట్టుబడులు పెరగాలి .
వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులను ప్రోత్సహించాలి .
రైతు పండించే పంటకి కి పోటా పోటీ మద్దతు ధరలు ఉండాలి .
ఎందుకంటే దేశంలో పనిచేసే వారిలో 60శాతం మంది వ్యవసాయాన్ని నమ్ముకొని బతుకు తున్నారు .
 వారు చల్లగా ఉండాలి . వారి చేలు పచ్చగా ఉండాలి .
అప్పుడే ప్రతి ఒక్కరికి చేతి నిండా పని , కడుపు నిండా కూడు దొరుకుద్ది .
జై కిసాన్ ... జై హింద్

No comments:

Post a Comment