Search This Blog

Saturday 15 March 2014

తెలంగాణ ప్రభుత్వం ముందు పెద్ద కర్తవ్యమే ఉన్నది.

ఏ ప్రాంతానికైనా భూమి మూలధనం. వ్యవసాయ దిగుబడి ఒక ప్రాంత సామర్థ్యాన్ని, స్థోమతను తెలియజేస్తుంది. 
 భూకమతాల సమీక్ష, భూసంపద నిర్ధారణ కోసం బృహత్ కార్యక్రమాన్ని నిజాయితీపరులైన అధికారుల పర్యవేక్షణలో సాగించాలి. దానికి తోడు చేయవలసిన ఒక ముఖ్యమయిన విధాన నిర్ణయం- వ్యవసాయభూముల కొనుగోలుపై ఆంక్షలు విధించడం. 

మహారాష్ట్రలో, గుజరాత్‌లో వ్యవసాయదారులు కానివారు పంటభూములను కొనడానికి వీలులేదు. నిర్ణీత ఆదాయం దాటిన వారు కూడా వ్యవసాయభూములు కొనరాదు. పెద్దమనుషుల ఒప్పందంలో అటువంటి నిబంధన ఒకటి ఉండేది. ఆ ఒప్పం దాన్ని ఖాతరు చేయకపోవడం వల్ల తెలంగాణ చాలా భూమిని కోల్పోయింది. వ్యవసాయ, వ్యవసాయేతర ఆదాయాలకు మధ్య అగాధం ఉన్న కాలంలో, ప్రవాసభారతీయుల చేతిలో మిగులుధనం మిక్కిలిగా ఉన్న సమయంలో, భూమిని అం గడిలో పెడితే, చివరికి ఏమీ మిగలదు.

కార్పొరేట్లకు, పరిశ్రమలకు, సెజ్‌లకు అవసరానికి మించిన భూములు ఇవ్వడం నిలిపివేయాలి. 

తెలంగాణా రైతులు,గిరిజనుల జీవితాలు స్వయం సమృద్ది గా పండుతాయని కన్న కలలు నిజం కావాలి . 

No comments:

Post a Comment